అంగన్వాడీలపై ఉక్కుపాదం
డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సోమవారం చేపట్టిన ‘చలో విజయవాడ’ ఉద్రిక్తతకు దారితీసింది.
ఎక్కడికక్కడ అరెస్టులు.. నిర్బంధాలు
పోలీసుల కళ్లు గప్పి వేలల్లో విజయవాడకు వచ్చిన కార్యకర్తలు
నగరంలోని ఏలూరు రోడ్డుపై హోరెత్తిన నినాదాలు
ఈడ్చుకెళ్లిన పోలీసులు.. స్టేషన్లలోనూ నిరసనల వెల్లువ
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పథం.. కొనసాగిన ఉద్రిక్తత
ఈనాడు, ఈనాడు డిజిటల్- అమరావతి, న్యూస్టుడే-అలంకార్ కూడలి, గవర్నర్పేట
డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సోమవారం చేపట్టిన ‘చలో విజయవాడ’ ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి విజయవాడకు వేలాది కార్యకర్తలు తరలివచ్చారు. వారి నినాదాలు, నిరసనలతో నగరం హోరెత్తింది. ఆందోళనలో పాల్గొనడానికి వివిధ పట్టణాలు, పల్లెలనుంచి బయలుదేరిన వారినీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. కళ్లుగప్పి విజయవాడకు చేరుకున్న కార్యకర్తలను పోలీసులు నియంత్రించారు. బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలో కుక్కి స్టేషన్లకు తరలించారు. వారితో నగర ప్రాంతంలోని పోలీసుస్టేషన్లు నిండిపోయాయి. దీంతో వందల మంది కార్యకర్తలను కల్యాణమండపాలు, ఇతర ప్రాంతాలకూ తరలించారు. పోలీసులతో తోపులాటలేర్పడి కొందరు కార్యకర్తలు అస్వస్థతకు గురయ్యారు. తమకిచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఉద్యమకారులు నినదించారు. విజయవాడ ధర్నాచౌక్లో ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
చలో విజయవాడలో పాల్గొనేందుకు తెల్లవారుజామునే వివిధ ప్రాంతాలనుంచి నగరానికి చేరుకున్న అంగన్వాడీలను బస్టాండ్, రైల్వేస్టేషన్లకు వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నాచౌక్ వైపు వస్తున్న వారిని అలంకార్ కూడలిలో అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాలనుంచి చాలామంది ముందు రోజే విజయవాడకు చేరుకుని బంధువుల ఇళ్లలో బస చేశారు. దీంతో ఎవరి కంటపడకుండా వారు భారీగా బీసెంట్ రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు, సాంబమూర్తి రోడ్డు, గాంధీనగర్ ప్రాంతాలకు చేరుకున్నారు. అందరూ ఒక్కసారిగా ఏలూరు రోడ్డుపైకి చేరుకున్నారు. ఈ రోడ్డుపై గంటన్నరపాటు ఆందోళన సాగి ట్రాఫిక్ నిలిచింది. పోలీసులు తేరుకుని అదనపు బలగాలను రప్పించారు. లెనిన్ సెంటర్, ధర్నాచౌక్ వైపు వెళ్లే వారిని అతికష్టంపై నిలువరించారు.
పోలీసుల అరెస్టులతో ఇరువర్గాల మధ్య వాగ్వాదమేర్పడింది. ఒక వైపు రోడ్డుపై బైఠాయించిన వారిని అరెస్టు చేస్తుండగా, మిగిలినవారు రెండో వైపునకు చేరుకుని అటువైపు వెళ్లే వాహనాలకు అడ్డుగా కూర్చున్నారు. వీరికి మద్దతుగా వస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ నాయకుడు ఏవీ నాగేశ్వరరావు సారథ్యంలో కొందరు అంగన్వాడీలు దుర్గాపురం మీదుగా సాంబమూర్తి రోడ్డు వైపు వచ్చారు. పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా ముందుకు సాగారు. వారిని ధర్నాచౌక్ సమీపంలో అరెస్టు చేశారు. సీపీఎం నేత మధు సారథ్యంలో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చినవారిని నిలువరించేందుకు పోలీసులు చెమటోడ్చారు. తోపులాటలు కొనసాగాయి. అరెస్టయి స్టేషన్లు, కల్యాణమండపాలకు చేరిన ఉద్యమకారులు అక్కడా ధర్నా కొనసాగించారు. వేతనాలను ప్రభుత్వం 4నెలలుగా చెల్లించడం లేదని, తెలంగాణలోని అంగన్వాడీలకు మించి వేతనాలను ఇస్తామన్న సీఎం హామీని విస్మరించారని కార్యకర్తలు వాపోయారు. మహిళా పోలీసులపై కొందరు ఆందోళనకారులు తిరగబడ్డారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు.
తోపులాటలో అనంతపురానికి చెందిన కార్యకర్త కమల స్పృహ తప్పారు. సహచరులే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో అంగన్వాడీ కార్యకర్తకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకో కార్యకర్త సొమ్మసిల్లి ఏలూరు రోడ్డు డివైడర్పై పడ్డారు. పలువురు గాయాలపాలయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగానూ నిరసనల హారు
అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలను నిరసిస్తూ అంగన్వాడీలు ఎక్కడికక్కడ ధర్నాలు చేశారు. నిరసనల్లో పాల్గొనరాదని సంఘ నేతలకు 2 రోజుల ముందే నోటీసులిచ్చిన పోలీసులు ఆదివారం రాత్రినుంచే బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద కార్యకర్తలు, సహాయకులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చేరుకునే ప్రధాన రహదారుల్లోని టోల్గేట్ల వద్ద పహారా పెంచారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలనుంచి వస్తున్న కార్యకర్తలను కలపర్రు టోల్గేటు వద్ద, ప్రకాశం, రాయలసీమ జిల్లాలనుంచి వస్తున్న వారిని కాజ టోల్గేటు వద్ద అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. పిఠాపురం రైల్వేస్టేషన్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని నిరసిస్తూ అక్కడే వారు ధర్నా చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాయవరం, కపిలేశ్వరపురం, మండపేట మండలాలకు చెందిన అంగన్వాడీ సిబ్బందిని తెల్లవారుజామున ఐదింటినుంచే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మండపేట గ్రామీణ పోలీసుస్టేషన్కు 45మందిని తరలించారు. పెద్దాపురంలోనూ 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. భీమవరంలో ఉద్యమకారులు ధర్నా చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి, బాపట్ల, గుంటూరులలో కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు బైఠాయించారు. అంతర్రాష్ట్ర రహదారిపైకి ర్యాలీగా చేరుకుని బైఠాయించారు. విశాఖ జగదాంబ సెంటర్ నుంచి వాచ్హౌస్ వరకు రాస్తారోకో నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని కుప్పం-కృష్ణగిరి జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. అనకాపల్లిలోనూ ధర్నా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి