అంగన్వాడీలపై ఉక్కుపాదం
డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సోమవారం చేపట్టిన ‘చలో విజయవాడ’ ఉద్రిక్తతకు దారితీసింది.
ఎక్కడికక్కడ అరెస్టులు.. నిర్బంధాలు
పోలీసుల కళ్లు గప్పి వేలల్లో విజయవాడకు వచ్చిన కార్యకర్తలు
నగరంలోని ఏలూరు రోడ్డుపై హోరెత్తిన నినాదాలు
ఈడ్చుకెళ్లిన పోలీసులు.. స్టేషన్లలోనూ నిరసనల వెల్లువ
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పథం.. కొనసాగిన ఉద్రిక్తత
ఈనాడు, ఈనాడు డిజిటల్- అమరావతి, న్యూస్టుడే-అలంకార్ కూడలి, గవర్నర్పేట
డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సోమవారం చేపట్టిన ‘చలో విజయవాడ’ ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి విజయవాడకు వేలాది కార్యకర్తలు తరలివచ్చారు. వారి నినాదాలు, నిరసనలతో నగరం హోరెత్తింది. ఆందోళనలో పాల్గొనడానికి వివిధ పట్టణాలు, పల్లెలనుంచి బయలుదేరిన వారినీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. కళ్లుగప్పి విజయవాడకు చేరుకున్న కార్యకర్తలను పోలీసులు నియంత్రించారు. బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలో కుక్కి స్టేషన్లకు తరలించారు. వారితో నగర ప్రాంతంలోని పోలీసుస్టేషన్లు నిండిపోయాయి. దీంతో వందల మంది కార్యకర్తలను కల్యాణమండపాలు, ఇతర ప్రాంతాలకూ తరలించారు. పోలీసులతో తోపులాటలేర్పడి కొందరు కార్యకర్తలు అస్వస్థతకు గురయ్యారు. తమకిచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఉద్యమకారులు నినదించారు. విజయవాడ ధర్నాచౌక్లో ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
చలో విజయవాడలో పాల్గొనేందుకు తెల్లవారుజామునే వివిధ ప్రాంతాలనుంచి నగరానికి చేరుకున్న అంగన్వాడీలను బస్టాండ్, రైల్వేస్టేషన్లకు వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నాచౌక్ వైపు వస్తున్న వారిని అలంకార్ కూడలిలో అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాలనుంచి చాలామంది ముందు రోజే విజయవాడకు చేరుకుని బంధువుల ఇళ్లలో బస చేశారు. దీంతో ఎవరి కంటపడకుండా వారు భారీగా బీసెంట్ రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు, సాంబమూర్తి రోడ్డు, గాంధీనగర్ ప్రాంతాలకు చేరుకున్నారు. అందరూ ఒక్కసారిగా ఏలూరు రోడ్డుపైకి చేరుకున్నారు. ఈ రోడ్డుపై గంటన్నరపాటు ఆందోళన సాగి ట్రాఫిక్ నిలిచింది. పోలీసులు తేరుకుని అదనపు బలగాలను రప్పించారు. లెనిన్ సెంటర్, ధర్నాచౌక్ వైపు వెళ్లే వారిని అతికష్టంపై నిలువరించారు.
పోలీసుల అరెస్టులతో ఇరువర్గాల మధ్య వాగ్వాదమేర్పడింది. ఒక వైపు రోడ్డుపై బైఠాయించిన వారిని అరెస్టు చేస్తుండగా, మిగిలినవారు రెండో వైపునకు చేరుకుని అటువైపు వెళ్లే వాహనాలకు అడ్డుగా కూర్చున్నారు. వీరికి మద్దతుగా వస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ నాయకుడు ఏవీ నాగేశ్వరరావు సారథ్యంలో కొందరు అంగన్వాడీలు దుర్గాపురం మీదుగా సాంబమూర్తి రోడ్డు వైపు వచ్చారు. పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా ముందుకు సాగారు. వారిని ధర్నాచౌక్ సమీపంలో అరెస్టు చేశారు. సీపీఎం నేత మధు సారథ్యంలో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చినవారిని నిలువరించేందుకు పోలీసులు చెమటోడ్చారు. తోపులాటలు కొనసాగాయి. అరెస్టయి స్టేషన్లు, కల్యాణమండపాలకు చేరిన ఉద్యమకారులు అక్కడా ధర్నా కొనసాగించారు. వేతనాలను ప్రభుత్వం 4నెలలుగా చెల్లించడం లేదని, తెలంగాణలోని అంగన్వాడీలకు మించి వేతనాలను ఇస్తామన్న సీఎం హామీని విస్మరించారని కార్యకర్తలు వాపోయారు. మహిళా పోలీసులపై కొందరు ఆందోళనకారులు తిరగబడ్డారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు.
తోపులాటలో అనంతపురానికి చెందిన కార్యకర్త కమల స్పృహ తప్పారు. సహచరులే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో అంగన్వాడీ కార్యకర్తకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకో కార్యకర్త సొమ్మసిల్లి ఏలూరు రోడ్డు డివైడర్పై పడ్డారు. పలువురు గాయాలపాలయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగానూ నిరసనల హారు
అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలను నిరసిస్తూ అంగన్వాడీలు ఎక్కడికక్కడ ధర్నాలు చేశారు. నిరసనల్లో పాల్గొనరాదని సంఘ నేతలకు 2 రోజుల ముందే నోటీసులిచ్చిన పోలీసులు ఆదివారం రాత్రినుంచే బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద కార్యకర్తలు, సహాయకులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చేరుకునే ప్రధాన రహదారుల్లోని టోల్గేట్ల వద్ద పహారా పెంచారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలనుంచి వస్తున్న కార్యకర్తలను కలపర్రు టోల్గేటు వద్ద, ప్రకాశం, రాయలసీమ జిల్లాలనుంచి వస్తున్న వారిని కాజ టోల్గేటు వద్ద అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. పిఠాపురం రైల్వేస్టేషన్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని నిరసిస్తూ అక్కడే వారు ధర్నా చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాయవరం, కపిలేశ్వరపురం, మండపేట మండలాలకు చెందిన అంగన్వాడీ సిబ్బందిని తెల్లవారుజామున ఐదింటినుంచే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మండపేట గ్రామీణ పోలీసుస్టేషన్కు 45మందిని తరలించారు. పెద్దాపురంలోనూ 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. భీమవరంలో ఉద్యమకారులు ధర్నా చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి, బాపట్ల, గుంటూరులలో కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు బైఠాయించారు. అంతర్రాష్ట్ర రహదారిపైకి ర్యాలీగా చేరుకుని బైఠాయించారు. విశాఖ జగదాంబ సెంటర్ నుంచి వాచ్హౌస్ వరకు రాస్తారోకో నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని కుప్పం-కృష్ణగిరి జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. అనకాపల్లిలోనూ ధర్నా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!