AP Assembly: సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే సస్పెండ్ అయినట్లే.. రూలింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని
‘తెదేపా సభ్యులు సభలో ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. స్పీకర్గా ఎవరున్నారనేది కాదు. ఈ స్థానం కీలకమైనది. గౌరవప్రదమైన నిరసన తెలిపితే అభ్యంతరం లేదు.
ఈ సభకు స్పీకర్గా ఉండటం బాధగా ఉంది
శ్రీరామచంద్రుడు వంటి మన నాయకుడికి రావణుడిని ఎలా చంపాలో తెలుసని వ్యాఖ్య
ఈనాడు - అమరావతి: ‘తెదేపా సభ్యులు సభలో ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. స్పీకర్గా ఎవరున్నారనేది కాదు. ఈ స్థానం కీలకమైనది. గౌరవప్రదమైన నిరసన తెలిపితే అభ్యంతరం లేదు. సభాపతి స్థానాన్ని, సభ గౌరవాన్ని తగ్గించే విధంగా తెదేపా సభ్యుల ప్రవర్తన ఆక్షేపణీయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సి ఉంది. సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోడియం వద్దకు వచ్చి సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే ఆటోమెటిక్ సస్పెండ్ అయ్యేలా రూల్ను అమల్లోకి తెస్తున్నా...’ అని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. శాసనసభలో సోమవారం జరిగిన పరిణామాలపై ఆయన మాట్లాడారు. ‘ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తర్వాత వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టేలా 2016లోనే శాసనసభ నిర్ణయం తీసుకుంది. అదేమీ తెలియకుండా వ్యవహరించడం దురదృష్టకరం. ప్రభుత్వం ఏం చేసింది, చేయబోతోంది అనేది గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పడం రాజ్యాంగ సంప్రదాయం. దానికి కూడా గౌరవాన్ని ఇవ్వలేని ప్రతిపక్షం సభలో ఉండటం, ఆ సభలో నేను స్పీకర్గా ఉండటం బాధగా ఉంది. సభ్యులు, పార్టీల పట్ల నాకు ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. ఎస్సీ ఎమ్మెల్యేల పేరిట సభలో చర్చ రావడం దురదృష్టకరం. ఇదంతా సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకే. దీనిని సభ చూస్తూ ఊరుకోవాలా? వాయిదా తీర్మానం ఇప్పుడే చదవాలని అచ్చెన్నాయుడు అన్నారు. సీనియారిటీ అంటే ఇదేనా? ఎవరు బుద్ధిమంతుడైతే వాడు వృద్ధుడు కానీ, ఏండ్లు మీరినవాడు కాదని.. పోగాలం దాపురించినప్పుడు మూర్ఖులు కనరు వినరు అని పరవస్తు చిన్నయసూరి చెప్పారు. ప్లకార్డులు ముఖానికి అడ్డంగా పెట్టారు. వాటిని చేతితో పక్కకు తీస్తే.. స్పీకర్ చేయిచేసుకున్నారని హడావుడి చేశారు. మీకు ఎవరు చెప్పి పంపారు? నాయకుడు ఎలా ఉంటే, కింద వాళ్లు అలానే ఉంటారు. ఎంత కవ్వించినా.. నేను స్పందించలేదు. పేపరు చింపి నా మీద వేస్తే.. పువ్వులు వేసినట్లు భావించాను. ఇతర సభ్యుల హక్కులను హరిస్తుంటే ఊరుకోవాలా? సభ నిర్వహణకు ప్రతి నిమిషానికి ఎంతో ఖర్చు చేస్తున్నాం. ధనం, సమయం వృథా చేస్తున్నారు. మీరు శాసనసభకు పనికొస్తారా? లేదా? అనేది సమయం వచ్చినప్పుడు ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. రావణాసురుడిని శ్రీరామచంద్రుడు సంహరించాడు. మన ముందు శ్రీరామచంద్రుడి వంటి నాయకుడు ఉన్నాడు. రావణుడిని ఎలా చంపాలో ఆయనకు తెలుసు. రేపు కదనరంగంలో నిరూపించుకుందాం. ఈ సభలో ఎందుకు అనవసర న్యూసెన్స్....’ అని స్పీకర్ సీతారాం పేర్కొన్నారు.
సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేయాలి: మంత్రి సురేష్
ఈ ఉదంతాన్ని సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు. ఆ సభ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, వాళ్లు చేసిన దుర్మార్గాన్ని అలా వదిలేయకూడదని తెలిపారు. మీరు సంతకాలు పెట్టి పంపితే, దానిని సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేస్తానని స్పీకర్ సీతారాం చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్