AP Assembly: సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే సస్పెండ్ అయినట్లే.. రూలింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని
‘తెదేపా సభ్యులు సభలో ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. స్పీకర్గా ఎవరున్నారనేది కాదు. ఈ స్థానం కీలకమైనది. గౌరవప్రదమైన నిరసన తెలిపితే అభ్యంతరం లేదు.
ఈ సభకు స్పీకర్గా ఉండటం బాధగా ఉంది
శ్రీరామచంద్రుడు వంటి మన నాయకుడికి రావణుడిని ఎలా చంపాలో తెలుసని వ్యాఖ్య
ఈనాడు - అమరావతి: ‘తెదేపా సభ్యులు సభలో ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. స్పీకర్గా ఎవరున్నారనేది కాదు. ఈ స్థానం కీలకమైనది. గౌరవప్రదమైన నిరసన తెలిపితే అభ్యంతరం లేదు. సభాపతి స్థానాన్ని, సభ గౌరవాన్ని తగ్గించే విధంగా తెదేపా సభ్యుల ప్రవర్తన ఆక్షేపణీయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సి ఉంది. సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోడియం వద్దకు వచ్చి సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే ఆటోమెటిక్ సస్పెండ్ అయ్యేలా రూల్ను అమల్లోకి తెస్తున్నా...’ అని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. శాసనసభలో సోమవారం జరిగిన పరిణామాలపై ఆయన మాట్లాడారు. ‘ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తర్వాత వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టేలా 2016లోనే శాసనసభ నిర్ణయం తీసుకుంది. అదేమీ తెలియకుండా వ్యవహరించడం దురదృష్టకరం. ప్రభుత్వం ఏం చేసింది, చేయబోతోంది అనేది గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పడం రాజ్యాంగ సంప్రదాయం. దానికి కూడా గౌరవాన్ని ఇవ్వలేని ప్రతిపక్షం సభలో ఉండటం, ఆ సభలో నేను స్పీకర్గా ఉండటం బాధగా ఉంది. సభ్యులు, పార్టీల పట్ల నాకు ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. ఎస్సీ ఎమ్మెల్యేల పేరిట సభలో చర్చ రావడం దురదృష్టకరం. ఇదంతా సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకే. దీనిని సభ చూస్తూ ఊరుకోవాలా? వాయిదా తీర్మానం ఇప్పుడే చదవాలని అచ్చెన్నాయుడు అన్నారు. సీనియారిటీ అంటే ఇదేనా? ఎవరు బుద్ధిమంతుడైతే వాడు వృద్ధుడు కానీ, ఏండ్లు మీరినవాడు కాదని.. పోగాలం దాపురించినప్పుడు మూర్ఖులు కనరు వినరు అని పరవస్తు చిన్నయసూరి చెప్పారు. ప్లకార్డులు ముఖానికి అడ్డంగా పెట్టారు. వాటిని చేతితో పక్కకు తీస్తే.. స్పీకర్ చేయిచేసుకున్నారని హడావుడి చేశారు. మీకు ఎవరు చెప్పి పంపారు? నాయకుడు ఎలా ఉంటే, కింద వాళ్లు అలానే ఉంటారు. ఎంత కవ్వించినా.. నేను స్పందించలేదు. పేపరు చింపి నా మీద వేస్తే.. పువ్వులు వేసినట్లు భావించాను. ఇతర సభ్యుల హక్కులను హరిస్తుంటే ఊరుకోవాలా? సభ నిర్వహణకు ప్రతి నిమిషానికి ఎంతో ఖర్చు చేస్తున్నాం. ధనం, సమయం వృథా చేస్తున్నారు. మీరు శాసనసభకు పనికొస్తారా? లేదా? అనేది సమయం వచ్చినప్పుడు ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. రావణాసురుడిని శ్రీరామచంద్రుడు సంహరించాడు. మన ముందు శ్రీరామచంద్రుడి వంటి నాయకుడు ఉన్నాడు. రావణుడిని ఎలా చంపాలో ఆయనకు తెలుసు. రేపు కదనరంగంలో నిరూపించుకుందాం. ఈ సభలో ఎందుకు అనవసర న్యూసెన్స్....’ అని స్పీకర్ సీతారాం పేర్కొన్నారు.
సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేయాలి: మంత్రి సురేష్
ఈ ఉదంతాన్ని సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కోరారు. ఆ సభ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, వాళ్లు చేసిన దుర్మార్గాన్ని అలా వదిలేయకూడదని తెలిపారు. మీరు సంతకాలు పెట్టి పంపితే, దానిని సభా హక్కుల కమిటీకి సిఫార్సు చేస్తానని స్పీకర్ సీతారాం చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.