ముందస్తు అరెస్టులు.. గృహ నిర్బంధాలు
ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాసేలా ఉన్న జీవో నంబరు-1ని రద్దు చేయాలనే డిమాండుతో ‘జీవో-1 రద్దు పోరాట ఐక్య వేదిక’ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
పోరాట ఐక్యవేదిక చేపట్టిన చలో అసెంబ్లీపై ఉక్కుపాదం
జీవో-1 రద్దు చేయాలంటూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా నాయకుల అరెస్టు
ఈనాడు, అమరావతి: ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాసేలా ఉన్న జీవో నంబరు-1ని రద్దు చేయాలనే డిమాండుతో ‘జీవో-1 రద్దు పోరాట ఐక్య వేదిక’ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వివిధ జిల్లాల నుంచి ఐక్యవేదిక నాయకులు, కార్యకర్తలు విజయవాడ రాకుండా ఆదివారం నుంచే గృహనిర్బంధాలు,అరెస్టులతో నిలువరించిన పోలీసులు.. సోమవారం మరింతగా నిర్బంధాన్ని అమలుచేశారు. అసెంబ్లీ వైపు వెళ్లే మార్గాలన్నింటిలో బందోబస్తు పెంచారు. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి, గుర్తింపు కార్డులు పరిశీలించి పంపించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ సహా పలువురు ముఖ్యుల్ని అరెస్టు చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. పోరాట ఐక్య వేదిక కన్వీనర్లలో ఒకరైన సుంకర రాజేంద్రప్రసాద్ను విజయవాడలోని ఆయన నివాసంలో, మరో కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావును రాజానగరం పోలీసుస్టేషన్లో నిర్బంధించారు.
బలవంతంగా తీసుకెళ్లి...: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆ పార్టీ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, దోనెపూడి శంకర్, జి.కోటేశ్వరరావు, ఈశ్వరయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు విజయవాడలోని దాసరి భవన్(సీపీఐ రాష్ట్ర కార్యాలయం) నుంచి అసెంబ్లీని ముట్టడించేందుకు బయల్దేరగా పోలీసులు వారిని అక్కడే నిలువరించారు. సీపీఐ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం నాయకులంతా తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకూ ర్యాలీగా తరలివెళ్లారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన జీవో-1ని రద్దు చేయాలంటూ నినదించారు. అక్కడి నుంచి నాయకులందరూ అసెంబ్లీ మార్గం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి కృష్ణలంక పోలీసుస్టేషన్కు తరలించారు. అంతకుముందు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఇతర నాయకులు వై.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్, టీఎన్టీయూసీ, ఎస్ఎఫ్ఐ తదితర విభాగాల నాయకులు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు వేర్వేరుగా చేరుకుని అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారినీ పోలీసులు అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీసుస్టేషన్కు తరలించారు. అంతకు ముందూ కళాక్షేత్రం వద్దకు చేరుకున్న వివిధ ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు నాయకుల్ని అరెస్టు చేసిన పోలీసులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ పోలీసుస్టేషన్లోనే నిర్బంధించారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఎక్కడికక్కడే...: ఆదివారం మధ్యాహ్నం పోరాట ఐక్య వేదిక కన్వీనర్, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో నిర్బంధించారు. సాయంత్రం రాజానగరం పోలీసుస్టేషన్కు తరలించి రాత్రంతా నిర్బంధించారు. సుబ్బారావు తరఫు న్యాయవాదులు హైకోర్టులో హెబియస్కార్పస్ రిట్ దాఖలు చేయగా... సోమవారం ఉదయం పోలీసులు ఆయన్ను విడిచిపెట్టారు. పోరాట ఐక్య వేదిక మరో కన్వీనర్ సుంకర రాజేంద్రప్రసాద్ను విజయవాడ సీతారామపురంలోని ఆయన నివాసంలో నిర్బంధించారు. సోమవారం సాయంత్రంవరకూ బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. వివిధ జిల్లాల్లో సైతం పోరాట ఐక్య వేదిక, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులకు నోటీసులిచ్చి గృహనిర్బంధం చేశారు.
న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అక్రమ అరెస్టుపై హైకోర్టులో వ్యాజ్యం
విడిచిపెట్టినట్లు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది
జీవో నంబరు 1ని రద్దు చేయాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, భారత న్యాయవాదుల సంఘం(ఐఏఎల్) ఏపీ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావును రాజమహేంద్రవరం 1వ పట్టణ, రాజానగరం పోలీసులు అక్రమం అరెస్టు చేయడంపై సోమవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలైంది. సుబ్బారావు కుమారుడు విశాల్స్ఫూర్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ వి.శ్రీనివాస్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వ్యాజ్యం వేశాక సుబ్బారావును విడిచిపెట్టినట్లు పోలీసుల తరఫు ప్రభుత్వ న్యాయవాది తెలిపారన్నారు. అక్రమ అరెస్ట్ చేసిన నేపథ్యంలో బాధ్యులైన పోలీసుల నుంచి రూ.2లక్షల పరిహారం ఇప్పించాలని కోరారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే