రికార్డు స్థాయిలో విద్యుత్తు వెలుగులు
నాగార్జునసాగర్ కుడిగట్టుపై ఉన్న జల విద్యుత్ కేంద్రం ఈ ఏడాది (మార్చి 1 నాటికి) రికార్డు స్థాయిలో 283.513 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి కొత్త మైలురాయిని చేరుకుంది.
సాగర్ కుడిగట్టు విద్యుత్తు కేంద్రంలో మైలురాయి
మార్చి 1 నాటికి 283.513 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి
నలభై ఏళ్లలో ఇదే గరిష్ఠం
ఈనాడు, అమరావతి: నాగార్జునసాగర్ కుడిగట్టుపై ఉన్న జల విద్యుత్ కేంద్రం ఈ ఏడాది (మార్చి 1 నాటికి) రికార్డు స్థాయిలో 283.513 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి కొత్త మైలురాయిని చేరుకుంది. కుడిగట్టు విద్యుత్తు కేంద్రం స్థాపించి ఫిబ్రవరి 25 నాటికి 40 ఏళ్లు పూర్తయిన వేళ ఈ రికార్డు సాధించడం విశేషం. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ప్రతి నెలా విద్యుత్తు ఉత్పత్తి జరగడంతో ఈ ఘనత సాధించారు. నాగార్జునసాగర్ జలాశయంలో 530 అడుగులపైన నీటి నిల్వలున్నప్పుడు సాగర్ కుడికాలువ కింద అవసరాలకు కుడిగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి తీసుకుంటున్నారు. విద్యుత్తు కేంద్రం నుంచి 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే వెసులుబాటు ఉంది. అయితే కుడికాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులే కావడంతో ఆ మేరకే నీటిని వదులుతున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాగర్ కుడికాలువ కింద తాగు, సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసే క్రమంలో డ్యామ్లో 530 అడుగులపైన నిల్వలు ఉండటంతో పవర్హౌస్ ద్వారా నీటిని వాడుకున్నారు. దీంతో వేసవిలో (ఏప్రిల్, మే నెలల్లో)నూ కొంతమేర విద్యుత్తు ఉత్పత్తి చేశారు. జూన్ నుంచి నదికి వరద నీరు రావడంతో కాలువకు నిరంతరాయంగా నీటిని విడుదల చేస్తుండటంతో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతోంది.
40 ఏళ్ల వేళ కొత్త మైలురాయి
నాగార్జునసాగర్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1983 ఫిబ్రవరి 25న ఉత్పత్తి మొదలైంది. గత నెల 25 నాటికి 40 ఏళ్లు పూర్తయింది. ప్రారంభించినప్పటి నుంచి ఈ మార్చి వరకు మొత్తం 6,032.533 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. 2006-07లో అత్యధికంగా 283.512 మిలియన్ యూనిట్ల ఉత్పత్తితో ఈ కేంద్రం రికార్డు సృష్టించింది. దాన్ని అధిగమిస్తూ ఈ నెల 1న 283.513 మిలియన్ యూనిట్ల మైలురాయిని చేరుకుంది. కుడి కాలువకు నీటివిడుదల కొనసాగుతున్నందున ఇంకా ఉత్పత్తి జరుగుతోంది. నిరంతర పర్యవేక్షణ, విద్యుదుత్పత్తికి అంతరాయం కలగకుండా కాలువ అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయడంతో రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధ్యమైందని జెన్కో ఇంజినీర్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీవారి భక్తులకు అపరిమితంగా శ్రీవాణి టికెట్ల జారీ!
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను తితిదే రద్దు చేసిన విషయం తెలిసిందే. -
జగన్ సర్కారును పెకలించేేద్దాం
రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన జగన్ సర్కారును పెకలించి వేసేందుకు, కేంద్రంలో మళ్లీ ఎన్డీయే సర్కారును తెచ్చేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. -
ఓటు హక్కుపై వేటు.. అదే జగన్ రూటు!
అవినీతి అక్రమాలపై చెడుగుడు ఆడే పాశుపతాస్త్రం.. ఓటు. పరమ పవిత్రమైన ఓట్లు జగనన్న పాలనలో పప్పుబెల్లాలు అయ్యాయి. వక్రబుద్ధి మరవని జగన్.. తన పాలనకు మడుగులొత్తే అధికారుల అండతో లెక్కకు మిక్కిలి దొంగ ఓట్లను నమోదు చేయించి.. ఓటు విలువను అభాసుపాలు చేశారు. -
ప్రశ్నలను తెలుగులో అను‘వధించారు’
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అభ్యర్థులను బెంబేెలెత్తించాయి. ఆదివారం జరిగిన ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నలను ఆంగ్లం నుంచి తెలుగులోనికి అనువదించడంలోనూ తప్పులు దొర్లాయి. -
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
టెట్ ఫలితాల విడుదల ఎప్పుడో?
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ‘కీ’లను ప్రకటించిన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. డీఎస్సీ షెడ్యూల్ ప్రకటించినందున టెట్ మార్కులు కీలకం కానున్నాయి. -
ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. మైకుల మొరాయింపు
బొప్పూడి ‘ప్రజాగళం’ సభలో సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలోనే నాలుగుసార్లు మైకులు మొరాయించాయి. సౌండ్ సిస్టం ఉన్న ప్రాంతంలో జనాన్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం కారణంగా ఈ అంతరాయాలు చోటుచేసుకున్నాయి. -
విశాఖలో ‘భారత్ నివేష్ రన్’
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్డులో ‘భారత్ నివేష్ రన్’ పేరిట 5కే రన్ నిర్వహించారు. -
మోదీజీ.. అమరావతిని కాపాడండి
అయిదు సంవత్సరాల నుంచి చస్తూ బతుకుతున్న అమరావతి... మోదీజీ రాజధానికి రండి.. ఆంధ్రాను రక్షించండి.. అమరావతి రైతుల జీవితాలను కాపాడండి.. మా బాబు, మన మోదీ, మా పవన్... ఇకపై ఆంధ్రాకు, అమరావతికి అమృతమే.. -
జజ్జనకరి జనారే.. సభంతా హుషారే
‘ప్రజాగళం’ సభ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ‘పసుపు దళపతి.. చీకటిని పారదోలే అధిపతి’ అంటూ సాగే పాటకు జనం ‘జై బాబు.. జైజై బాబు’ అంటూ నినాదాలు చేశారు. -
ఉప్పొంగిన జన సంద్రం
ఎటు చూసినా జనం.. కోటప్పకొండ జాతరను మించిన జన జాతర.. సభా ప్రాంగణంలోని గ్యాలరీల్లో జనం.. రోడ్లపైనా వెల్లువలా ప్రజలు.. తెదేపా, జనసేన, భాజపాల మధ్య పొత్తు కుదిరాక మూడు పార్టీలూ సంయుక్తంగా బొప్పూడి వద్ద నిర్వహించిన తొలి సభ దిగ్విజయమైంది.. -
ప్రధాని సభలో భద్రతా వైఫల్యం
ప్రజాగళం సభలో పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపించింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్రెడ్డి తన యంత్రాంగంతో బందోబస్తు విధులు సమర్థంగా చేయించటంలో విఫలమయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
ప్రేక్షకపాత్రకే పరిమితమైన పోలీసులు
ప్రధాని రాకకు ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకున్న ఎన్ఎస్జీ, ఎస్పీజీ బృందాలు సైతం సభ నిర్వహణలో బందోబస్తుపరమైన లోపాలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తం చేశాయి. అప్పుడూ పోలీసులు స్పందించలేదు. -
మీ ప్రాణాలు మాకెంతో విలువైనవి.. టవర్లు దిగిరండి
‘ప్రజాగళం’ బహిరంగ సభలో సౌండ్ సెట్టింగ్కు ఏర్పాటుచేసిన టవర్లను ఎక్కిన యువకులంతా వాటిని దిగి కిందికి రావాలని ప్రధాని మోదీ పదేపదే విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ ప్రసంగించే సమయంలో టవర్లపై కొందరు యువకులున్న విషయాన్ని గమనించిన మోదీ.. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ చీరల పంపిణీ
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ వైకాపా నాయకులు ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆదివారం అమరావతిలో ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
రాఘవాచారి సంపాదకీయాలు సమకాలీన పరిస్థితులకు దర్పణం
సమకాలీన రాజకీయాలు, పరిస్థితులకు చక్రవర్తుల రాఘవాచారి సంపాదకీయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.గిరిజాశంకర్ అన్నారు. -
నామిని రచనల్లో సామాన్యుల జీవితాలు
‘‘నామిని రచనల్లో ‘మిట్టూరోడి కథలు’ సామాన్యుల జీవనాన్ని ప్రతిబింబించాయి. నేటి రచయితలు అనేకమంది నాన్న ప్రేమను, ఆయన శ్రమను కథలుగా రాస్తే, నామిని మాత్రం తన రచనల్లో అమ్మ శ్రమను ఆవిష్కరించారు’’ అని మాజీ మంత్రి, రాజన్న ఫౌండేషన్ డైరెక్టర్ గల్లా అరుణకుమారి అన్నారు. -
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజీనామా
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వాసేపల్లిపాడుకు చెందిన లింగంగుంట రవిబాబు తన పదవికి, వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఏపీ ఫైబర్నెట్లో సీఎం జగన్ ప్రత్యక్షం.. ఎన్నికల కోడ్ వర్తించదా?
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేస్తున్నారు. ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సీఎం జగన్ చిత్రపటాలను తీసేస్తున్నారు. -
రాజకీయ పార్టీల హోర్డింగ్లు వెంటనే తొలగించండి
ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ పార్టీల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, పోస్టర్లు తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. -
ఒకసారే మూల్యాంకనం చేశాం
గ్రూపు-1 (2018) ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ వెల్లడించారు. గ్రూపు-1 ప్రధాన పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ranveer Singh: ‘శక్తిమాన్’గా రణ్వీర్.. రీల్ ‘శక్తిమాన్’ అసహనం
-
TS News: హైదరాబాద్ ప్రజాభవన్లో ‘ప్రజావాణి’కి తాత్కాలిక బ్రేక్
-
KL Rahul: ఐపీఎల్ 2024 సీజన్.. కేఎల్ రాహుల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్
-
Chandrababu: ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానే: చంద్రబాబు
-
Hunger Crisis: క్షామం అంచున గాజా.. 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో!