5 లక్షణాలుంటేనే ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గతంలో 5 లక్షణాల ఆధారంగానే ప్రత్యేక హోదా ఇచ్చారని చెప్పడం ద్వారా.. ఆ అర్హత ఆంధ్రప్రదేశ్కు లేదని గుర్తుచేసింది.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్
ఆంధ్రప్రదేశ్కు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసిన మంత్రి
లోక్సభలో రాష్ట్ర ఎంపీల ప్రశ్నలకు జవాబు
ఈనాడు - దిల్లీ
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గతంలో 5 లక్షణాల ఆధారంగానే ప్రత్యేక హోదా ఇచ్చారని చెప్పడం ద్వారా.. ఆ అర్హత ఆంధ్రప్రదేశ్కు లేదని గుర్తుచేసింది. విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వాగ్దానం చేశారా.. లేదా అన్న ప్రశ్నను దాటవేసింది. లోక్సభలో వైకాపా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి మంగళవారం అడిగిన ప్రశ్నలకు కేంద్రం సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో అయిదు లక్షణాలను నిర్దేశించిందని, వాటి ఆధారంగానే గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కట్టబెట్టిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
‘‘రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అనుసరించే విధానమేంటి? ఆంధ్రప్రదేశ్కు ఇవ్వకపోవడానికి కారణమేంటి? 2014లో విభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొనే ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం వాగ్దానం చేసిందా? ఒకవేళ చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తిచేసిన వాగ్దానాలేంటి? విభజన చట్టంలో ఇంకా ఏయే వాగ్దానాలు పెండింగ్లో ఉన్నాయి, వాటి జాప్యానికి కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్లో విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టులకు 90:10 నిష్పత్తిలో నిధులు సమకూర్చడానికి కేంద్రం అంగీకరించిందా? అంగీకరిస్తే ఇప్పటివరకు ఏం చేసింది? ప్రత్యేక హోదా కోసం గత ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏమైనా విజ్ఞాపన వచ్చిందా? వస్తే అందులో వివరాలేంటి? రాష్ట్రానికి ఎప్పటిలోపు ప్రత్యేక హోదా ఇస్తారు?’’ అని వైకాపా ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. ‘‘ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్తోపాటు కొన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి విజ్ఞప్తులు అందాయి. ప్రణాళికా సాయం కోసం గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించింది. 1. కొండ, సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు 2. తక్కువ జనసాంద్రత/ అధికసంఖ్యలో గిరిజన జనాభా, 3. ఇరుగుపొరుగు దేశాల సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటం, 4. ఆర్థిక, మౌలిక వసతుల పరంగా వెనుకబాటుతనం, 5. రాష్ట్రానికి ఆర్థిక సుస్థిరత లేకపోవడం లాంటి లక్షణాలన్నీ ఉంటేనే గతంలో ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించారు.
తేడా చూపొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పింది
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా పంచేటప్పుడు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి తేడా చూపలేదు. ఆ సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు పంచే పన్ను వాటాను 32% నుంచి 42%కి పెంచింది. 15వ ఆర్థిక సంఘం దాన్ని యథాతథంగా ఉంచింది. రాష్ట్రాల వనరుల లోటును సాధ్యమైనంత మేరకు పన్ను పంపిణీ ద్వారా భర్తీచేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇలా పన్నుల్లో వాటా పంచిన తర్వాత కూడా లోటు ఉన్న రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ గ్రాంట్లు ఇచ్చాం.
ప్రత్యేక సాయానికి అంగీకరించాం
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 90:10 నిష్పత్తిలో ఇచ్చి ఉంటే 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎంత అదనపు మొత్తం వచ్చి ఉండేదో దాన్ని భర్తీచేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక సాయం చేయడానికి అంగీకరించింది. 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో రాష్ట్రప్రభుత్వం సంతకం చేసి తీసుకున్న రుణాల వడ్డీ, అసలును చెల్లించడానికి కేంద్రం సిద్ధపడింది. దాని ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు 2018-19లో కేంద్ర ప్రభుత్వం విదేశీ రుణాల తిరిగి చెల్లింపు కోసం రూ.15.81 కోట్లు విడుదల చేసింది.
విభజన చట్టంలో చాలా అమలు చేశాం
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చాలా అంశాలను అమలు చేశాం. మిగిలిన వాటి అమలు వివిధ దశల్లో ఉంది. మౌలికవసతులు, విద్యాసంస్థల్లాంటి వాటికి దీర్ఘకాలం అవసరం. విభజన చట్టంలోనే వాటికి పదేళ్ల సమయం ఇచ్చారు’’ అని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM