అంకురాల ప్రోత్సాహం.. ఉపాధికి ఉత్సాహం
వచ్చేనెల నుంచి అమల్లోకి వచ్చేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది నాలుగేళ్ల పాటు అమల్లో ఉంటుంది. కొత్త పారిశ్రామిక విధానం నిర్ణయాలు, లక్ష్యాలు, ప్రత్యేకతలివీ...
కొత్త పారిశ్రామిక విధానం ప్రత్యేకతలివీ...
ఈనాడు, అమరావతి: వచ్చేనెల నుంచి అమల్లోకి వచ్చేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది నాలుగేళ్ల పాటు అమల్లో ఉంటుంది. కొత్త పారిశ్రామిక విధానం నిర్ణయాలు, లక్ష్యాలు, ప్రత్యేకతలివీ...
లక్ష్యాలు...
* జీఎస్డీపీలో పారిశ్రామిక రంగం వాటా 30 శాతం
* రాష్ట్రానికి ఉన్న సహజ తీర ప్రాంతం ఆధారంగా పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం
* పరిశ్రమ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉత్పత్తిలోకి వచ్చే వరకు ప్రభుత్వ సాయం
* ఉపాధి అవకాశాలు... పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దడం
* అంకుర సంస్థలను ప్రోత్సహించడం ద్వారా కొత్త పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దడం
* ప్లగ్ అండ్ ప్లే విధానంలో పెట్టుబడుల ఆకర్షణ
పాలసీలో ప్రత్యేకతలు
* ఐటీ ఆధారిత అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి విశాఖ కేంద్రంగా ‘స్టార్టప్ మిషన్’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రానికి వచ్చే అంకుర సంస్థలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు విశాఖలో ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న ‘ఐ-స్పేస్’ మల్టీ డొమైన్ ఇన్నోవేషన్ హబ్ను పర్యవేక్షిస్తుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డి), పర్యావరణ హిత నూతన ఆవిష్కరణల కేంద్రంగా ఐ-స్పేస్ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇంక్యుబేటర్లు, కో-వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. సంస్థలను ఏర్పాటు చేయడం నుంచి నిర్వహణ వరకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడం.. నిర్వహణలో అవసరమైన సహకారాన్నీ స్టార్టప్ మిషన్ పర్యవేక్షిస్తుంది. దీనికి అవసరమైన సీడ్ క్యాపిటల్ను కార్పస్ ఫండ్గా ప్రభుత్వం సమకూరుస్తుంది.
* భవిష్యత్తులో ఏర్పాటు చేసే పారిశ్రామిక పార్కులు/హబ్స్ విస్తీర్ణంలో కనీసం 5 శాతం లాజిస్టిక్స్, గోదాముల ఏర్పాటుకు కేటాయించాలని నిర్ణయం. వాటి ఏర్పాటును ప్రత్యేక ప్రోత్సాహకాలను చెల్లించాలని నిర్ణయం. గోదాములకు రూ.5 కోట్లు, కోల్డు స్టోరేజీలకు రూ.3 కోట్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు కనీసం రూ.50 కోట్లు ఖర్చు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది.
ప్రైవేటు రంగంలో ఎంఎస్ఎంఈ పార్కులు
* సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులు, టెక్నాలజీ అప్గ్రెడేషన్ను అందించడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఆర్అండ్డి సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం. ఏపీఐఐసీ ద్వారా కొత్తగా అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో 33 శాతం ఎంఎస్ఎంఈలకు కేటాయింపు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం విస్తీర్ణాన్ని కేటాయించాలి. ప్రైవేటు రంగంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు కనీసం 25 ఎకరాల భూములు ఉండాలి. వాటి అభివృద్ధిని ప్రోత్సహించేలా..
* మౌలిక సదుపాయాల కల్పనకు చేసిన ఖర్చులో 25 శాతం.. గరిష్ఠంగా రూ.కోటి రాయితీ
* స్టాంపు డ్యూటీ పూర్తిగా మినహాయింపు
* భూముల వినియోగ మార్పిడి ఛార్జీల మినహాయింపు
* దీర్ఘకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటులో 3 శాతం రాయితీ.. గరిష్ఠంగా మూడేళ్లలో రూ.కోటి రాయితీ
* 50 శాతం ఆక్యుపెన్సీ ఉంటే... ప్రోత్సాహకాల్లో 50 శాతాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.
ప్రైవేటు రంగంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి
* కనీసం 50 ఎకరాలు.. రూ.200 కోట్ల థ్రెషోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి.
* పార్కు అభివృద్ధి చేసే విస్తీర్ణంలో 33 శాతం నివాస/వాణిజ్య ప్రాంతం కింద కేటాయించాలి.
మధ్య తరహా పరిశ్రమలు
* పెట్టుబడి రాయితీ/ఎస్జీఎస్టీ: ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్పై 5 ఏళ్లలో 15 శాతం.. గరిష్ఠంగా రూ.2.5 కోట్లు సమ వాయిదాల్లో చెల్లింపు లేదా నెట్ ఎస్జీఎస్టీలో 50 శాతం వంతున 5 ఏళ్ల పాటు చెల్లింపు
* ఐపీ సేకరణ వ్యయంలో 75 శాతం.. గరిష్ఠంగా రూ.10 లక్షలు
* టెక్నాలజీ అప్గ్రెడేషన్కు చేసే ఖర్చులో 50 శాతం.. గరిష్ఠంగా రూ.25 లక్షలు
* పైపు ద్వారా నీటి సరఫరాకు చేసిన ఖర్చుపై అప్పటి ధరలకు అనుగుణంగా రాయితీ మొత్తం నిర్ణయం
భారీ పరిశ్రమలకు... నెట్ ఎస్జీఎస్టీ చెల్లింపు
కేటగిరీ-1: స్థిర మూలధనానికి సమానమైన (భూముల ధరతో కలిపి) నెట్ ఎస్జీఎస్టీ 5 ఏళ్ల పాటు చెల్లింపు.
కేటగిరీ-2: స్థిర మూలధనంలో 75 శాతానికి సమానమైన (భూముల ధర మినహాయించి) నెట్ ఎస్జీఎస్టీ 5 ఏళ్ల పాటు
కేటగిరీ-3: స్థిర మూలధనంలో 50 శాతానికి సమానమైన (భూముల ధర మినహాయించి) నెట్ ఎస్జీఎస్టీ 5 ఏళ్ల పాటు చెల్లింపు
* పైపులైను ద్వారా నీటి సరఫరా కోసం చేసిన ఖర్చుపై అప్పటి ధరల ప్రకారం నిర్ణయం.
* మెగా పరిశ్రమలకు చెల్లించే రాయితీలను అప్పటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం.
రాష్ట్రం మూడు జోన్లుగా విభజన
పారిశ్రామికంగా తక్కువ అభివృద్ధి చెందిన జిల్లాల్లో పరిశ్రమలను ఏర్పాటును ప్రోత్సహించాలన్నది ఉద్దేశంతో.. జిల్లాలను మూడు జోన్లుగా విభజించింది.
ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం..
* తక్కువ పారిశ్రామికాభివృద్ధి జిల్లాలు: అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కర్నూలు, కృష్ణా, నంద్యాల, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, వైయస్ఆర్, అల్లూరి సీతారామరాజు.
* మోడరేట్ పారిశ్రామికాభివృద్ధి సాధించిన జిల్లాలు: చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, విజయనగరం.
* అధిక పారిశ్రామికాభివృద్ధికి చెందిన జిల్లాలు: అనకాపల్లి, తిరుపతి, విశాఖపట్నం
మధ్య తరహా పరిశ్రమలు
* పెట్టుబడి రాయితీ/ఎస్జీఎస్టీ: ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్పై 5 ఏళ్లలో 15 శాతం.. గరిష్ఠంగా రూ.2.5 కోట్లు సమ వాయిదాల్లో చెల్లింపు లేదా నెట్ ఎస్జీఎస్టీలో 50 శాతం వంతున 5 ఏళ్ల పాటు చెల్లింపు.
* ఐపీ సేకరణ వ్యయంలో 75 శాతం.. గరిష్ఠంగా రూ.10 లక్షలు
* టెక్నాలజీ అప్గ్రెడేషన్కు చేసే ఖర్చులో 50 శాతం.. గరిష్ఠంగా రూ.25 లక్షలు
* పైపు ద్వారా నీటి సరఫరాకు చేసిన ఖర్చుపై అప్పటి ధరలకు అనుగుణంగా రాయితీ మొత్తం నిర్ణయం
భారీ పరిశ్రమలకు నెట్ ఎస్జీఎస్టీ చెల్లింపు
* కేటగిరీ-1: స్థిర మూలధనానికి సమానమైన(భూముల ధర మినహాయించి) నెట్ ఎస్జీఎస్టీ 5 ఏళ్ల పాటు చెల్లింపు.
* కేటగిరీ-2: స్థిర మూలధనంలో 75 శాతానికి సమానమైన(భూముల ధర మినహాయించి) నెట్ ఎస్జీఎస్టీ 5 ఏళ్ల పాటు
* కేటగిరీ-3: స్థిర మూలధనంలో 50 శాతానికి సమానమైన(భూముల ధర మినహాయించి) నెట్ ఎస్జీఎస్టీ 5 ఏళ్ల పాటు చెల్లింపు
* పైపులైను ద్వారా నీటి సరఫరా కోసం చేసిన ఖర్చుపై అప్పటి ధరల ప్రకారం నిర్ణయం.
* మెగా పరిశ్రమలకు చెల్లించే రాయితీలను అప్పటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం.
* ఎస్సీ, ఎస్టీలకు వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు
* సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఇచ్చే పెట్టుబడి ప్రోత్సాహకాలు
* పెట్టుబడిలో 45 శాతం.. గరిష్ఠంగా రూ1.20 లక్షలు.
వడ్డీ రాయితీ
* వడ్డీ రేటులో 9 శాతం రాయితీ.. గరిష్ఠంగా 5 ఏళ్లలో రూ.50 లక్షలు
ఎస్జీఎస్టీ:
* 5 ఏళ్ల పాటు ఎస్జీఎస్టీ 100 శాతం తిరిగి చెల్లింపు
* స్టాంపు డ్యూటీ 100 శాతం చెల్లింపు (అన్ని కేటగిరీలకు వర్తింపు)
* భూమి కొనుగోలు చేసిన వ్యయంలో 50 శాతం.. గరిష్ఠంగా రూ.10 లక్షలు
* భూ వినియోగ మార్పిడి ఛార్జీల్లో 25 శాతం.. గరిష్ఠంగా రూ.10 లక్షలు
* విద్యుత్ సుంకం యూనిట్కు రూపాయి వంతున.. యూనిట్కు 50 పైసల రాయితీ ఏళ్ల పాటు వర్తింపు
* ఇంటలెక్చువల్ ప్రాపర్టీ(ఐపీ) సేకరణకు చేసే ఖర్చులో 75 శాతం.. గరిష్ఠంగా రూ.10 లక్షలు
* టెక్నాలజీ అప్గ్రెడేషన్కు చేసే ఖర్చులో 50 శాతం.. గరిష్ఠంగా రూ.25 లక్షలు
* నాణ్యత ధ్రువీకరణ పత్రాలకు చేసే ఖర్చు 100 శాతం.. గరిష్ఠంగా రూ.3 లక్షలు
* పైపు ద్వారా నీటి సరఫరా కోసం చేసే ఖర్చును అప్పటి ధరల ఆధారంగా నిర్ణయం.
* రవాణా వాహనాలను తీసుకుంటే.. మూలధన సబ్సిడీ కింద 45 శాతం.. గరిష్ఠంగా రూ.75 లక్షలు రాయితీ
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు
* సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఇచ్చే పెట్టుబడి ప్రోత్సాహకాలు
* జనరల్ కేటగిరీ: పెట్టుబడిలో 15 శాతం.. గరిష్ఠంగా రూ20 లక్షలు.
* బీసీ/మైనారిటీలు: పెట్టుబడిలో 15 శాతం.. గరిష్ఠంగా రూ.20 లక్షలు
* మహిళలు: పెట్టుబడిలో 15 శాతం.. గరిష్ఠంగా రూ.30 లక్షలు
వడ్డీ రాయితీ
జనరల్: వడ్డీ రేటులో 3 శాతం రాయితీ.. గరిష్ఠంగా 5 ఏళ్లలో రూ.25 లక్షలు
బీసీ/మైనారిటీలు: వడ్డీ రేటులో 3 శాతం రాయితీ.. గరిష్ఠంగా 5 ఏళ్లలో రూ.30 లక్షలు
ఎస్జీఎస్టీ: 5 ఏళ్ల పాటు ఎస్జీఎస్టీ 100 శాతం తిరిగి చెల్లింపు(అన్ని కేటగిరీలకు ఇవే నిబంధనలు వర్తింపు)
ఇతరాలు
* స్టాంపు డ్యూటీ 100 శాతం చెల్లింపు (అన్ని కేటగిరీలకు వర్తింపు)
* భూ వినియోగ మార్పిడి ఛార్జీల్లో 25 శాతం.. గరిష్ఠంగా రూ.10 లక్షలు
* విద్యుత్ సుంకం యూనిట్కు రూపాయి వంతున.. 5 ఏళ్ల పాటు చెల్లింపు
* ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) సేకరణకు చేసే ఖర్చులో 75%.. గరిష్ఠంగా రూ.10లక్షలు
* టెక్నాలజీ అప్గ్రెడేషన్కు చేసే ఖర్చులో 50 శాతం.. గరిష్ఠంగా రూ.25 లక్షలు
* నాణ్యత ధ్రువీకరణ పత్రాలకు చేసే ఖర్చు 100 శాతం.. గరిష్ఠంగా రూ.3 లక్షలు
* పైపు ద్వారా నీటి సరఫరా కోసం చేసే ఖర్చును అప్పటి ధరల ఆధారంగా నిర్ణయం.
* సేవా రంగంలోని పరిశ్రమలకు: అనుమతించిన పరిశ్రమల ఏర్పాటుకు చేసే మూలధన పెట్టుబడిలో 15శాతం.. గరిష్ఠంగా రూ.20లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!