వడగళ్లు... రైతుకు కడగండ్లు
ఖరీఫ్, రబీల్లో పంటలు సాగు చేసిన రైతుల 9 నెలల కష్టాన్ని అకాల వర్షాలు తుడిచిపెట్టేశాయి. ఈదురుగాలులు, వడగళ్లవానలకు సుమారు 16 జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
నేలమట్టమైన మొక్కజొన్న
వరి రైతుల ఆశలూ ఆవిరి
భారీగా పంట నష్టం
16 జిల్లాల్లో వర్షాలు, వడగళ్ల వానల ప్రభావం
వ్యవసాయ పంటల నష్టం రూ.400 కోట్లపైనే
ఈనాడు - అమరావతి, యంత్రాంగం
ఖరీఫ్, రబీల్లో పంటలు సాగు చేసిన రైతుల 9 నెలల కష్టాన్ని అకాల వర్షాలు తుడిచిపెట్టేశాయి. ఈదురుగాలులు, వడగళ్లవానలకు సుమారు 16 జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న భారీగా దెబ్బతింది. రబీలో వేసిన ధాన్యం కోతకొచ్చిన చోట వానలకు గింజ రాలిపోతోంది. కొన్ని జిల్లాల్లో ఇంకా రైతుల ఇళ్ల వద్దే ఉన్న ఖరీఫ్ ధాన్యమూ ఈ వానలకు తడిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అంచనా. సగటున ఎకరాకు రూ. 20 వేల లెక్కన చూసినా రైతులు దాదాపు రూ. 400 కోట్లకు పైగా నష్టపోయారు. ఆరుగాలం కష్టపడి, అప్పులు తెచ్చి సాగు చేసిన పంట నేలవాలి, నీటిలో నానుతున్న తీరు చూసి రైతు గుండె పగులుతోంది. నష్టం అంచనాల్లో ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం అంచనాలు ఎలా తగ్గించాలనే ఆలోచిస్తోంది. పంట నష్టం కళ్లెదుటే కన్పిస్తున్నా.. 33% పంట దెబ్బతినలేదంటూ సతాయిస్తోంది. రూ.లక్షల్లో నష్టపోయిన తమకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రాయితీ సొమ్ము.. విత్తనాలు, వ్యవసాయ ఖర్చులకు కూడా చాలదని.. ఆ కొద్ది మొత్తానికీ రకరకాల నిబంధనలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఉన్న వ్యవసాయ సహాయకులతో ఒకటి రెండు రోజుల్లో నష్టం అంచనాలు లెక్క కట్టొచ్చని.. నష్టాన్ని తగ్గించి చూపడానికే దాన్ని నెలాఖరు వరకు సాగదీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
కల్లాల్లోనే తడిసిన ధాన్యం
వడగళ్ల వానలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మామిడి, మెక్కజొన్న, వరి, అరటి, తమలపాకు, మినుము, పెసర పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. రైతుల దగ్గర ఇంకా 4 లక్షల టన్నుల వరకు ధాన్యం నిల్వలుండగా లక్ష టన్నుల కొనుగోలుకు అనుమతిచ్చారు. తోట్లవల్లూరు, ఉంగుటూరు, గూడూరు, అవనిగడ్డ, గుడ్లవల్లేరు మండలాల్లో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసింది. రంగు మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో వేసిన వరి, మొక్కజొన్న, జొన్న పడిపోయాయి. రెండో పంటగా వేసిన సుమారు 40 వేల ఎకరాల్లోని మినుము చేతికొచ్చే దశలో, పనలపై ఉండగా తడిసింది. ఎకరానికి దాదాపు రూ.10 వేల వరకు నష్టం వస్తుందని వాపోతున్నారు.
* ఏలూరు జిల్లాలోని టి.నరసాపురం, జీలుగుమిల్లి, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర మండలాల్లో మొక్కజొన్న, వర్జీనియా పొగాకు తదితర పంటలు దెబ్బతిన్నాయి.
* గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో జొన్న, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. కండె పాలుపోసుకునే దశలో ఉన్న పంట పూర్తిగా పోయింది. వరి చేలపై వడగళ్ల ధాటికి గింజలు నేలరాలాయి.
* కాకినాడ జిల్లాలో గొల్లప్రోలు, పిఠాపురం, ప్రత్తిపాడు మండలాల్లో వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాల పంటలు దెబ్బతిన్నాయి. నువ్వు చేలు నీట మునిగాయి.
40 ఎకరాల వరి.. నీటిలోనే
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోవూరుపల్లికి చెందిన రైతు మన్నేపల్లి శ్రీనివాసులు అల్లిమడుగు గ్రామంలో ఎకరా రూ.13 వేల చొప్పున కౌలుకు తీసుకుని 35 ఎకరాలు, సొంత పొలం 5 ఎకరాల్లో వరి వేశారు. ఎకరాకు సుమారు రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టారు. రెండు రోజుల్లో కోద్దామనుకుంటుండగా అకాల వర్షాలకు పంటంతా నేలవాలిపోయింది. చేలో భారీగా నిలిచిన నీటిని మూడు రోజులుగా ఇంజిన్లతో బయటకు తోడుతూనే ఉన్నారు. పంట కొంతైనా చేతికొస్తుందో లేదో తెలియడం లేదని, ప్రభుత్వమే ఆదుకోవాలని శ్రీనివాసులు కన్నీటి పర్యంతమయ్యారు.
నెల్లూరులో నేలవాలిన వరి
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు నియోజకవర్గాల్లోని 125 గ్రామాల్లో 9 వేల ఎకరాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతకొచ్చిన వరి పైరు వాలిపోయింది. సెనగ అధికంగా దెబ్బతింది.
* తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట వడగళ్ల వానకు నేలకొరిగింది. ధాన్యం గింజలు నేలరాలాయి. జిల్లావ్యాప్తంగా 60% వరకు కోతలు పూర్తవగా ధాన్యం తడిసిపోయింది.
* అనంతపురం జిల్లాలో 7,500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, కొర్ర తదితర పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.
* ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల్లో పత్తి, మిరప, పొగాకు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి.
* కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మిరప రైతులకు పెద్ద దెబ్బ తగిలింది. మొక్కజొన్న, ఆముదం, సజ్జ, వరి, మినుము, కొర్ర, పొద్దుతిరుగుడు, కంది తదితర పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు 23 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు అంచనా.
* వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో సుమారు 2,500 ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మినుము, కొర్ర, జొన్న, వరి వర్షార్పణమైంది.
పొలాల్లోనే ధాన్యం, మొక్కజొన్న
ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో శ్రీకాకుళం జిల్లాలోనూ ఖరీఫ్ ధాన్యం ఇంకా లక్ష టన్నుల వరకు రైతుల దగ్గరే ఉంది. పొలాల్లో, ఇళ్ల ముందు బస్తాల్లో ఉన్న ధాన్యం తడిసి రంగు మారుతోందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. లావేరు, రణస్థలం, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాల్లో 31 వేల ఎకరాల్లో రబీ మొక్కజొన్నలో 60% మేర పొలాల్లో, కల్లాల్లో నిల్వ చేయగా.. అకాల వర్షంతో తడిసింది. టార్పాలిన్ల కింద ఉన్న పంటకు మొలకలొచ్చి, గింజలు రంగు మారతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
* విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 2,200 ఎకరాల్లో మొక్కజొన్న రైతులకు నష్టమే మిగిలింది.
* అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో లంక పొగాకు, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నాయి.
మరో అయిదు రోజులు వానలే..!
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మరో అయిదు రోజులపాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పిడుగులు పడే ప్రమాదమూ ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు భారీ నష్టం
చాలా చోట్ల వర్షాల కంటే ఈదురుగాలులు, వడగళ్ల వానల వల్లే తీవ్ర నష్టం తలెత్తింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు కోస్తా, రాయలసీమ అంతటా అధిక శాతం జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మొక్కజొన్నకు అపార నష్టం జరిగింది. మొత్తం విస్తీర్ణంలో 75% మేర పంట దెబ్బతినగా అందులో 90% పైగా రైతులు పూర్తి పంటను కోల్పోయినట్లే.
అకాల వర్షాలు ముంచేశాయి
- బావిశెట్టి సూర్యారావు, కౌలు రైతు, వన్నెపూడి, గొల్లప్రోలు మండలం, కాకినాడ జిల్లా
రూ.25 వేలు పెట్టి ఎకరా 20 సెంట్లు కౌలుకు తీసుకున్నా. రూ.35 వేల పెట్టుబడితో మొక్కజొన్న వేశా. పంటను రూ.60 వేలకు అడిగారు. ఇంకా ఎక్కువ ధర వస్తుందని, వారం ఆగుదామనుకున్నా. అకాల వర్షాలు, ఈదురుగాలులకు పంటంతా పోయింది.
అయిదు రోజులుగా నరకయాతన
శ్రీకాకుళం జిల్లా లావేరుకు చెందిన మజ్జి విశ్వనాథం.. రూ.48 వేలు ఖర్చు పెట్టి రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ‘రబీలో మొక్కజొన్న వేసినప్పటి నుంచీ కష్టాలే. సాగునీరందక కొంత దెబ్బతింది. మిగిలిన పంటను ఎలాగోలా కాపాడుకున్నాం. ఇప్పుడు వర్షాలకు చేలో ఉన్న కండెలన్నీ తడిచిపోయాయి. గింజ రంగు మారుతోంది. అయిదు రోజులుగా నరకయాతన పడుతున్నాం. పెట్టుబడి పోయినట్లే’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
మొక్కజొన్న మొలకలొస్తోంది
- మీసాల నారాయణమ్మ, రైతు, వేణుగోపాలపురం, శ్రీకాకుళం జిల్లా
మూడెకరాల్లో మొక్కజొన్న వేశాం. రెండెకరాల్లో పంట తీసి కల్లాలకు తెచ్చే సమయానికి వాన మొదలైంది. ఎకరా పంట పొలంలోనే ఉంది. రోజూ వాన కురుస్తుండటంతో పరదాల కిందనున్న పంట మొలకలు వస్తోంది. రూ.65 వేల వరకు మదుపు పెట్టాం. వర్షం ఆగకపోతే ఆశ వదులుకోవాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్