ఈబీసీ నేస్తం విధివిధానాలు సరళతరం చేయాలి
ఈబీసీ నేస్తం అమలులో విధివిధానాలను మరింత సరళతరం చేయాలని గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా సభ్యులు కోరారు.
ఈనాడు, అమరావతి: ఈబీసీ నేస్తం అమలులో విధివిధానాలను మరింత సరళతరం చేయాలని గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా సభ్యులు కోరారు. ఈబీసీ నేస్తంపై అధికారపక్ష సభ్యులు పుప్పాల శ్రీనివాసరావు, పర్వతి శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, శ్రీనివాసనాయుడు అడిగిన ప్రశ్నలకు ఆ శాఖ మంత్రి తరఫున వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సమాధానమిచ్చారు. పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నిబంధనలు సరళతరం చేస్తే ఎక్కువ మందికి లబ్ధి కలుగుతుందన్నారు. మరో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సచివాలయాల్లో చిన్న చిన్న కారణాలతో దరఖాస్తులను పెండింగులో ఉంచుతున్నారన్నారు. 26 జిల్లాల్లో ఎన్ని దరఖాస్తులు పెండింగులో ఉన్నాయో చెప్పాలని కోరారు. ఈ పథకం ధ్రువీకరణ పత్రాలు స్థానిక ప్రజాప్రతినిధులతోనే ఇప్పించాలన్నారు. మంత్రి కాకాణి సమాధానం ఇస్తూ ఈ కార్యక్రమం స్థానిక ప్రజాప్రతినిధులు, సభ్యులతోనే నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తులు పెండింగు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని తిరస్కరించినా మళ్లీ పరిశీలించి తదుపరి వారికి లబ్ధి కల్పిస్తూనే ఉన్నామని చెప్పారు.
కల్యాణమస్తు నిబంధనలు సడలించాలి
రాష్ట్రంలో కల్యాణమస్తు పథకం అమలులో నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందని వైకాపా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో వధువు, వరుడు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉండేది కాదన్నారు. తాజాగా ఈ నిబంధన విధించారని, అది మంచిదే అయినా గిరిజన ప్రాంతాల్లో దీని వల్ల ఇబ్బంది ఎదురవుతోందన్నారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ కల్యాణమస్తులో ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చామన్నారు. తెదేపా హయాంలో గడువు దాటితే మళ్లీ దరఖాస్తుకు అవకాశం ఉండేది కాదన్నారు.
జులై నాటికి అంబేడ్కర్ విగ్రహం సిద్ధం
విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం 2023 జులై నాటికి సిద్ధమవుతుందని మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఈ విగ్రహం పురోగతిపై అధికారపక్ష సభ్యులు కైలే అనిల్కుమార్, టీజేఆర్ సుధాకర్బాబు, గొల్ల బాబూరావు, కంబాల జోగులు, ఉండవల్లి శ్రీదేవి, అలజంగి జోగారావు లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆపై సభ్యులు అనుబంధ ప్రశ్నలు అడగగా మంత్రి స్పందించారు. ఈ విగ్రహ ఏర్పాటుకు సుమారు రూ.400 కోట్లు ఖర్చవుతుందన్నారు. దాదాపు 18.5 ఎకరాల స్థలాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఈ విగ్రహ ఏర్పాటు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ పని చేస్తున్నందుకు ముఖ్యమంత్రి జగన్కు సభలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ శుక్రవారం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని మంత్రి నాగార్జునను ఆదేశించారు.
మైనారిటీల సంక్షేమానికి ఎంతో చేస్తున్నాం
రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వ హయాంలో ఇంతవరకు రూ.21,756 కోట్లు ఖర్చు చేసినట్లు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అంజాద్బాషా వెల్లడించారు. ప్రభుత్వం మైనారిటీలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఏమిటో తెలియజేయాలని వైకాపా సభ్యులు అబ్దుల్ హఫీజ్ ఖాన్, షేక్ మహ్మద్ ముస్తఫా షేక్, ఎం.నవాజ్బాషా, పి.వి.సిద్ధారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఏలేరు రిజర్వాయర్ ఆధునికీకరణ పనులకు భూసేకరణ పూర్తి కావాలి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ ఆధునికీకరణలో మొదటి దశ పనులు పురోగతిలో ఉన్నాయని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు గురువారం శాసనసభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. తెదేపా సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తెదేపా సభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగు నేపథ్యంలో ఆ సమయంలో సభలో లేకపోవడంతో లిఖిత పూర్వక సమాధానంతో సరిపెట్టారు. అనుబంధ ప్రశ్నలకు, సమాధానాలకు ఆస్కారం లేకపోయింది. మొదటి దశ పనులు 59.81శాతం పూర్తయినట్లు మంత్రి చెప్పారు. మిగిలినవి భూసేకరణ సమస్య వల్ల పెండింగులో ఉన్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్