బడ్జెట్ ఫ్యాన్సీ నంబరు కాదు.. రియల్ నంబర్
బడ్జెట్ సంఖ్య మ్యాజిక్ ఫిగర్ కాదు. రియల్ ఫిగర్ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. 2023-24 వార్షిక బడ్జెట్పై పలువురు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై మంత్రి బుగ్గన మండలిలో వివరణ ఇచ్చారు.
మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి
ఈనాడు, అమరావతి: బడ్జెట్ సంఖ్య మ్యాజిక్ ఫిగర్ కాదు. రియల్ ఫిగర్ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. 2023-24 వార్షిక బడ్జెట్పై పలువురు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై మంత్రి బుగ్గన మండలిలో వివరణ ఇచ్చారు. ‘బడ్జెట్ రూ.2,79,279 కోట్లు ఎలా వచ్చిందని సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఖ్య కావాలనే తెచ్చాం. రూ.280 ఖర్చవుతుందనుకుంటే.. అందులో ఒక రూపాయి తగ్గిస్తే రూ.279 వస్తుంది. అలాగే లెక్కలను సర్దుబాటు చేసి ఈ సంఖ్యను తీసుకొచ్చాం.’ అని పేర్కొన్నారు. నాలుగేళ్లలో సంక్షేమానికి భారీగా ఖర్చు చేసినట్లు గణాంకాలతో వివరించారు. సంక్షేమం వద్దని ప్రతిపక్ష పార్టీలు చెబుతాయా? అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అమలయ్యే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పీహెచ్సీ స్థాయిలో అందుబాటులోకి తెచ్చామన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి భారీ మొత్తాన్ని ఖర్చు చేశామన్నారు. వ్యవసాయ రంగంలో సౌకర్యాల ఏర్పాటుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని.. ఇందులో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్, విత్తనాలు, యంత్రాలు, రాయితీలు వంటి సదుపాయాలను కల్పించామని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు వెళ్లడాన్ని నియంత్రించేలా ఐటీఐ, పాలిటెక్నిక్, నైపుణ్యాభివృద్ధి సంస్థలను రీ డిజైన్ చేసినట్లు తెలిపారు. పాలిటెక్నిక్ పూర్తవగానే ఉపాధి కల్పించేలా ప్రత్యేక కోర్సులు, పరిశ్రమలతో అనుసంధానం చేసినట్లు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిలో నైపుణ్యాభివృద్ధి కోసం 192 స్కిల్ హబ్లను ఏర్పాటు చేశామన్నారు.
అంతకుముందు తెదేపా ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ.. ‘ఆర్థిక మంత్రి చాలా గొప్పగా లెక్కలు చెప్పారు. అప్పట్లో ప్రభుత్వ ఆదాయం ఎంత? ఇప్పుడు ఎంత వస్తోంది? ఇవన్నీ బేరీజు వేసుకుని సంక్షేమ పథకాల కోసం చేసిన ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. మేం గొప్పగా ఖర్చు చేశామని చెబితే ఎలా? ప్రభుత్వం చేసిన అప్పులు రూ.4.19 లక్షల కోట్లు, కార్పొరేషన్లపై తెచ్చిన అప్పులు రూ.1.28 లక్షల కోట్లు.. ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చేసిన అప్పులు కోట్లల్లో, ఏపీ మారిటైం బోర్డు నుంచి తెచ్చిన అప్పులు భారీగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతుండగా మంత్రి బుగ్గన జోక్యం చేసుకుని మారిటైం బోర్డు ఇటీవలే ఏర్పాటు చేశామని.. రూ.5 వేల కోట్లు అప్పులు తెచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే తెదేపా ఎమ్మెల్సీలకు మైక్ కట్ చేసిన ఛైర్మన్.. బిల్లులు ప్రవేశపెట్టాలంటూ మంత్రి బొత్సకు అవకాశమిచ్చారు. దీనిపై తెదేపా ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. చర్చకు అవకాశం కల్పించకపోతే సభను బహిష్కరిస్తామన్నారు. పొండి.. బయటకు వెళ్లండి అని మంత్రి, ఛైర్మన్ అనడంతో తెదేపా ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. గురువారం ఉదయం సమావేశాలు ప్రారంభమైన వెంటనే మహిళల రక్షణ చర్యలపై తెదేపా ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఛైర్మన్ తిరస్కరించి, ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.
దిశ చట్టం లేదు
రాష్ట్రంలో దిశ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. తెదేపా ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టం బిల్లులో కొన్ని లోపాలున్నాయని కేంద్రం తిప్పి పంపిందని, వాటిని సరిచేసి మళ్లీ పంపుతామని చెప్పారు. మహిళల రక్షణ కోసం చట్టంలో ప్రస్తావించిన విధంగా దిశ పోలీస్స్టేషన్లు, వాహనాలు, సిబ్బందిని కేటాయించడంతో పాటు యాప్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. దిశ చట్టమే లేదని మంత్రి సభలో చెబుతుంటే.. ఆ పార్టీ వాళ్లు మాత్రం చట్టం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్రెడ్డి విమర్శించారు. దిశ బిల్లు సభలో ఆమోదించి మూడేళ్లు పూర్తయిందని.. ఆ బిల్లు తెచ్చిన సీఎం జగన్ గన్లో బుల్లెట్లు ఏమయ్యాయని తెదేపా ఎమ్మెల్సీ ఫరూక్ ఎద్దేవా చేశారు.
10 బిల్లులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ విద్య, పౌర గ్రంథాలయాలు, ధార్మిక హిందూ మత సంస్థల ధర్మాదాయాలు, అల్పసంఖ్యాక వర్గాల కమిషన్, రిజిస్ట్రేషన్, అబ్కారీ, మద్యనిషేధం, న్యాయవాదుల సంక్షేమ నిధి, అనుసూచిత కులాలు, తెగలు కాని వెనుకబడిన తరగతుల కోసం ఆంధ్రప్రదేశ్ కమిషన్ సవరణ బిల్లులతోపాటు పాలసేకరణ (రైతుల సంరక్షణ), పాల సురక్షిత ప్రమాణాల అమలు బిల్లు 2023లను మండలి ఆమోదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!