ముఖ్యమంత్రి జగన్‌తో నూతన ఎమ్మెల్సీల భేటీ

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా తరఫున గెలిచిన మర్రి రాజశేఖర్‌, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయిల్‌, పెనుమత్స వీవీ సూర్యనారాయణరాజు, జయమంగళ వెంకటరమణ శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు.

Published : 25 Mar 2023 04:56 IST

ఈనాడు, అమరావతి: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా తరఫున గెలిచిన మర్రి రాజశేఖర్‌, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయిల్‌, పెనుమత్స వీవీ సూర్యనారాయణరాజు, జయమంగళ వెంకటరమణ శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. వారితోపాటు అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎస్‌.మంగమ్మ కూడా ఉన్నారు. అసెంబ్లీలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన వీరు తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని