అవునా.. పరిశీలిస్తాం.. చూస్తాం..!
ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్), పీఆర్సీ బకాయిలపై ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశం ఎలాంటి నిర్ణయాలూ లేకుండానే ముగిసింది.
మొక్కుబడిగా మారిన ఉద్యోగుల సమస్యలపై చర్చలు
ఈహెచ్ఎస్, పీఆర్సీ బకాయిలపై లభించని స్పష్టత
ఉద్యమం కొనసాగుతుందన్న ఏపీ ఐకాస అమరావతి
ఈనాడు, అమరావతి: ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్), పీఆర్సీ బకాయిలపై ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశం ఎలాంటి నిర్ణయాలూ లేకుండానే ముగిసింది. ఈహెచ్ఎస్కు ఉద్యోగులు చెల్లిస్తున్న వాటా, ప్రభుత్వ వాటాను కలిపి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు పంపిస్తామనే హామీ తప్ప.. సమస్యలపై అధికారులు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో అధికారుల నుంచి ఉద్యోగులకు ఎలాంటి హామీ లభించలేదు. పీఆర్సీ బకాయిలు, పేస్కేళ్లపై ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పింది వినడం తప్ప అధికారులు ఏమీ చెప్పలేదు. ఛాయ్, బిస్కెట్ చర్చలుగానే ముగిశాయి. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు ఈనెల 31తో ముగియనున్నందున దీనిని మరో ఏడాది పొడిగించాలన్న ఉద్యోగుల సంఘాల వినతిపై ఆర్థిక శాఖ వద్ద దస్త్రం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ బిల్లులపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, కార్యదర్శి సత్యనారాయణ వివరాలు తెలిపారు. ‘ఉద్యోగుల సమస్యలపై నాయకులను చర్చలకు పిలవడం.. వారు చెప్పింది వినడం.. అనంతరం పరిశీలిస్తామని చెప్పడం ఇటీవల కాలంలో ప్రభుత్వానికి సాధారణంగా మారిపోయింది. చర్చల సందర్భంగా నాయకులు చెప్పే సమస్యల్లో నుంచి ఒక్కోసారి ఒక్కో దాన్ని పరిష్కరించినా ఇప్పటికే దాదాపుగా అన్నింటికీ మోక్షం లభించేది. చర్చల పేరుతో హడావుడి చేయడం.. ఆ తర్వాత ఏం ఉపయోగం లేదని సంఘాల నాయకులు బయటకు వచ్చి ప్రకటించడం గత కొంతకాలంగా పరిపాటిగా మారింది. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, డీఏలు, పీఆర్సీ బకాయిలు ఎంత ఉన్నాయో ప్రభుత్వం వద్ద లెక్కలున్నాయి. కానీ, వీటిని పట్టించుకోకుండా ప్రతిసారీ నాయకులను చర్చలకు పిలవడం.. వాటిని కొత్తగా వింటున్నట్లు చెప్పడం.. సమావేశం సుదీర్ఘంగా నిర్వహించడం..ఇదే జరుగుతోంది’ అని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
దేనిపైనా స్పష్టత ఇవ్వలేదు
బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఛైర్మన్, ఏపీ ఐకాస అమరావతి
పీఆర్సీ బకాయిలు, ఆరోగ్య కార్డులపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఈ సమస్యలను కొత్తగా వింటున్నట్లు అధికారులు కనిపించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి(ఈహెచ్ఎస్) ఉద్యోగుల వాటాగా జమ చేస్తున్న డబ్బును ఆరోగ్యశ్రీ ట్రస్టుకు చెల్లించే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఉద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తే మా బాధలు ఎవరికి చెప్పాలి. న్యాయమైన మా డిమాండ్ల పరిష్కారంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. బకాయిలు చెల్లించడంలోనూ, ఆర్థికేతర అంశాల పరిష్కారంలోనూ ఎందుకు నిర్లక్ష్య ధోరణితో ఉన్నారో అర్థం కావడం లేదు. పీఆర్సీ బకాయిలపైనా స్పష్టత ఇవ్వలేదు. బకాయిలు ఎంత ఉన్నాయని అడిగితే ఇంకా లెక్కలు వేయలేదని చెప్పారు. ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ నిర్ణయించిన పేస్కేళ్లు ఇవ్వడం లేదు. పీఆర్సీ బకాయిలను పదవీవిరమణ తర్వాత చెల్లించేందుకు ఎప్పుడూ అంగీకరించలేదు. ఏపీ ఐకాస అమరావతి తరపున ఇచ్చిన డిమాండ్లపై ఇంతవరకు దృష్టి పెట్టలేదు. ఉద్యమం యథావిధిగా కొనసాగుతుంది. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరామర్శ కార్యక్రమం 27న నిర్వహిస్తాం. ఏప్రిల్ 5న మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తాం.
ఆర్జిత సెలవు బకాయిలు చెల్లించాలని కోరాం
బండి శ్రీనివాసరావు, ఛైర్మన్, ఏపీ ఐకాస
ఉద్యోగులందరికీ ఒకసారి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరాం. 50ఏళ్లు దాటిన ఉద్యోగులకు ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయాలని చెప్పాం. సీపీఎస్లో పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని కోరాం. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, టీఏ, ఆర్జిత సెలవుల పెండింగ్ బిల్లుల్లో రూ.1,984 కోట్లు చెల్లించినట్లు ఆర్థికశాఖ అధికారులు చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్జిత సెలవు బకాయిలు చెల్లించాలని కోరాం. ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి గతంలో ఇచ్చిన డిమాండ్లపై ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
జీపీఎఫ్ నుంచి డ్రా చేసిన డబ్బు జమ కాలేదు
సూర్యనారాయణ, అధ్యక్షుడు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
ఉద్యోగులకు ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్స అందించాలని కోరాం. వైద్య, ఆరోగ్య శాఖలో పోస్టుల హేతుబద్ధీకరణ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. జీపీఎఫ్ ఖాతాల నుంచి విత్డ్రా చేసిన మొత్తాన్ని మర్నాడే డిపాజిట్ చేశామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పినది తప్పని చెప్పాం. అక్టోబరు నుంచి ఏపీజీఎల్ఐ క్రెడిట్ కాలేదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.
ఈనెలాఖరుకు సీపీఎస్ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తామన్నారు
వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య
సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగులు, ప్రభుత్వ కంట్రిబ్యూషన్ మొత్తం రూ.1,554 కోట్లను ఈ నెలాఖరు లోపు చెల్లిస్తామని చెప్పారు. డీఏ మంజూరుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరాం. దీర్ఘకాలిక వ్యాధులున్న ఉద్యోగులకు ఓపీ సేవలు, అవసరమైన మందులు అందించడం కోసం ప్రతి జిల్లాలో ఆసుపత్రిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!