పొదుపు సంఘాల వృద్ధిలో దేశానికే ఆదర్శం
రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు ఏడాదికి రూ.30 వేల కోట్లు రుణాలుగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి చెప్పారు.
99.55 శాతం రుణాలు సకాలంలో తిరిగి చెల్లింపు
మూడో విడత ‘ఆసరా’ సాయం విడుదల కార్యక్రమంలో సీఎం జగన్
ఈనాడు డిజిటల్, ఏలూరు: రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు ఏడాదికి రూ.30 వేల కోట్లు రుణాలుగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి చెప్పారు. ఈ సంఘాల సభ్యులు తీసుకున్న రుణాల్లో 99.55 శాతం సకాలంలో తిరిగి చెల్లించి దేశంలోని పొదుపు సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడి పొదుపు సంఘాల పురోగతిని చూస్తున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారత సాధించేందుకు కృషి చేస్తున్నామని, దేశంలో స్త్రీల సంక్షేమంపై దృష్టి పెట్టిన ఏకైక ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వైకాపాది మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన ‘వైఎస్ఆర్ ఆసరా’ మూడో విడత ఆర్థిక సాయం విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి, నిధులు విడుదల చేశారు. తొలుత దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆయన ఆవిష్కరించారు. ఆసరా లబ్ధిదారులతో ముచ్చటించి, వారితో ఫొటో దిగారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించిన అనంతరం సభలో మాట్లాడారు.
మహిళా సాధికారతకే ఆసరా
‘పొదుపు సంఘాలకు బాసటగా నిలుస్తామని నా పాదయాత్ర సమయంలోనే వాగ్దానం చేశా. రాష్ట్రంలోని దాదాపు 79 లక్షల మందికి రెండు విడతల్లో రూ.12.8 వేల కోట్లు ఇచ్చాం. మూడో విడత సాయంగా ఈ రోజు నుంచి 10 రోజుల వ్యవధిలో మరో రూ.6,420 కోట్లు వివక్ష, లంచాలకు అవకాశం లేకుండా నేరుగా వారి ఖాతాలో జమవుతాయి. ఈ నగదుతో ఇప్పటికే చాలా మంది మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు. వీరికి మరింత చేయూతనిచ్చేందుకు 9.86 లక్షల మంది మహిళలకు బ్యాంకుల ద్వారా రూ.4,355 కోట్లు ఇచ్చేందుకు అనుసంధాన ప్రక్రియ పూర్తి చేశాం. మహిళా సాధికారత కోసమే ఆసరా రూపంలో సాయం అందిస్తున్నాం.
వడ్డీ మరింత తగ్గించేందుకు కృషి
గత ప్రభుత్వ హయాంలో పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలుగా ఏటా సగటున రూ.14 వేలు మాత్రమే ఇచ్చేవారు. మన ప్రభుత్వం ఏటా రూ.30 వేలు ఇస్తోంది. గత ప్రభుత్వం రుణ మాఫీ చేస్తామని మహిళలను మభ్యపెట్టి ఎన్నికల తర్వాత ఆ హామీని గాలికొదిలేసింది. సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని పునరుద్ధరించి రూ.3,036 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాం. పొదుపు సంఘాలకు గతంలో రూ.3 లక్షల రుణానికి 13 శాతంగా ఉన్న వడ్డీని 7 శాతానికి, రూ.5 లక్షల రుణానికి 13 నుంచి 9.5 శాతానికి తగ్గించాం. మరింత తగ్గించేందుకు కృషి చేస్తాం. అమ్మఒడి ద్వారా 44.48 లక్షల మంది తల్లులకు రూ.20 వేల కోట్లు, వైఎస్ఆర్ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14.2 వేల కోట్లు, కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1518 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 4 లక్షల మందికి రూ.596 కోట్లు అందించాం. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. ఈ పథకం ద్వారా రూ.2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల వరకూ లబ్ధి చేకూరనుంది. మహిళా రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్ను 1.17 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బటన్ నొక్కితే పోలీసులు వచ్చి చేయూతనిస్తారు. ఇప్పటి వరకూ 26 వేల మంది ఈ యాప్ ద్వారా సాయం పొందారు’ అని ముఖ్యమంత్రి వివరించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. మహిళల పురోభివృద్ధికి జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలే కారణమని కొనియాడారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఇద్దరు ఆసరా లబ్ధిదారులు మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్