బడ్జెట్ కేటాయింపులు లేకుండానే ఖర్చులు
ఏపీలో బడ్జెట్ తయారీ, నిర్వహణ తీరు తెన్నులను కాగ్ తప్పుబట్టింది. సరైన ముందస్తు అంచనాలు లేకపోవడం, కొన్నింటిలో నిధులు మిగిలిపోతే, మరికొన్నింటిలో నిధులు చాలకపోవడం, చివర్లో నిధులను సరెండర్ చేయడం, బడ్జెట్లో కేటాయింపుల్లేకుండా ఖర్చు చేయడం.. ఇలా అనేక లోపాలను బయటపెట్టింది.
పర్యవేక్షణ, నియంత్రణలో లోపాలు
164 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ వినియోగం
వివిధ పథకాలకు నిధులిచ్చినా వినియోగించుకోని వైనం
రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించిన కాగ్
ఈనాడు - అమరావతి
ఏపీలో బడ్జెట్ తయారీ, నిర్వహణ తీరు తెన్నులను కాగ్ తప్పుబట్టింది. సరైన ముందస్తు అంచనాలు లేకపోవడం, కొన్నింటిలో నిధులు మిగిలిపోతే, మరికొన్నింటిలో నిధులు చాలకపోవడం, చివర్లో నిధులను సరెండర్ చేయడం, బడ్జెట్లో కేటాయింపుల్లేకుండా ఖర్చు చేయడం.. ఇలా అనేక లోపాలను బయటపెట్టింది. పటిష్ఠ బడ్జెట్ నిర్వహణకు రాబడులు, ఖర్చుల ముందస్తు ప్రణాళిక, కచ్చితమైన అంచనాలు అవసరమని, అయితే కొన్నిచోట్ల కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు పెట్టారని, మరికొన్నిచోట్ల కేటాయింపులను ఖర్చుపెట్టక పోయేసరికి నిధులు మిగిలిపోయాయని తేల్చింది. ఇది ఖర్చుల పర్యవేక్షణ, నియంత్రణ లోపాలను సూచిస్తోందని పేర్కొంది.
కేటాయింపులు, ఖర్చులకు మధ్య వ్యత్యాసాలకు కారణాలను సంబంధిత నియంత్రణాధికారులు వివరించలేదని తెలిపింది. ఇది ప్రభుత్వంలోని జవాబుదారీతనానికి సంబంధించిన యంత్రాంగంపై ప్రభావాన్ని చూపుతుందని, ప్రజాధనం వినియోగంపై విధానపరమైన నియంత్రణను బలహీన పరుస్తుందని ఆక్షేపించింది. ఇందులో పలు అంశాలను ప్రస్తావించింది.
* రాష్ట్ర ప్రభుత్వం 2021-22లో ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండా రూ.2,812.79 కోట్లు ఖర్చు చేసింది. అంతకు ముందు 2020-21లో ఇదేవిధంగా ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండా రూ.741.66 కోట్లు(వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు సహా) వెచ్చించిన విషయంలో రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఆమోదయోగ్యంగా లేదని కాగ్ పేర్కొంది. ఆడిట్ పరిశీలనను పరిగణనలోకి తీసుకుంటూ, భవిష్యత్లో ఇటువంటివి పునరావృతం కానివ్వబోమని రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చినట్లు స్పష్టంచేసింది.
నగదు సామర్థ్యం... పేలవం
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్(డబ్ల్యూఎంఏ) అనేది రాబడులు, వ్యయాల మధ్య తాత్కాలిక అసమతూకాన్ని ఆపే సదుపాయమని, రాబడుల్లో అంతరాన్ని తీర్చేందుకు రాష్ట్రానికి సహాయపడుతుందని కాగ్ పేర్కొంది. అయితే 2021-22లో రాష్ట్ర ప్రభుత్వం 139 రోజులపాటు డబ్ల్యూఎంఏను ఆశ్రయించిందని, 164 రోజులపాటు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించిందని, ఇది పేలవమైన నగదు నిర్వహణ సామర్థ్యాన్ని.. రాబడులు, వ్యయాల అవాస్తవ అంచనాలను సూచిస్తోందని కాగ్ ఆక్షేపించింది. 2021-22లో రూ.2,34,657.40 కోట్ల వాస్తవ కేటాయింపులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,37,788.47 కోట్ల అనుబంధ కేటాయింపులు చేసింది. ఈ అనుబంధ కేటాయింపుల్లో రూ.1,06,205.59 కోట్లు(సప్లిమెంటరీ ప్రొవిజన్లో 77 శాతం) మొత్తం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ల చెల్లింపుల కోసం కేటాయించినట్లు పేర్కొంది.
అభివృద్ధి అంశాలకు తక్కువ...
వాస్తవికంగా లేని ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు ఉండటం, పేలవమైన వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ, పథకాలు అమలు పరచడంలో బలహీనమైన నియంత్రణల వల్ల... అభివృద్ధి కారక అంశాలకు అవసరమైన దానికంటే తక్కువ కేటాయింపులు జరుగుతున్నట్లు కాగ్ పేర్కొంది. కొన్ని శాఖల్లో అధికంగా మిగుళ్లు ఏర్పడటంతో, నిధులు అవసరమున్న ఇతర శాఖలు వాటిని పొందలేకపోతున్నాయని ఆక్షేపించింది.
నోడల్ ఖాతాకు బదిలీ లేదు
కేంద్ర ప్రాయోజిత పథకమైన జాతీయ తృతీయ ఆరోగ్య సంరక్షణ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.250 కోట్లిచ్చారు. వీటిలో ఏమీ ఖర్చుచేయలేదు. ఈ పథకానికి వచ్చిన రూ.250 కోట్లను సింగిల్ నోడల్ ఖాతాకు బదిలీ చేయలేదని కాగ్ ఆడిటింగ్లో గుర్తించింది.
* 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రంలో ఆరోగ్య రంగం మెరుగుకు(సెక్టార్ నిర్దిష్ట గ్రాంట్లు) సంబంధించి కేంద్రం నుంచి రూ.488.15 కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి 2021, నవంబరులో వచ్చాయి. వీటిని 2022, ఫిబ్రవరిలో వైద్య, ఆరోగ్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ నిధుల బదిలీలో జాప్యం కారణంగా 2021-22లో ఉద్దేశించిన ప్రయోజనానికి నిధులు ఖర్చు చేయలేక పోయారు. రాష్ట్రప్రభుత్వం ఈ నిధులను సంవత్సరాంతంలో రాష్ట్ర సంచిత నిధికి లాప్స్ చేసినట్లు కాగ్ గుర్తించింది. ఇలా సెక్టార్ నిర్దిష్ట గ్రాంట్లను మురిగిపోయేలా చేయడం వల్ల ఆరోగ్య సేవలు అందించడంపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని, పథకాల లక్ష్యాలను సాధించలేక పోవచ్చని కాగ్ పేర్కొంది.
చివరిరోజు రూ.3,776.69 కోట్లు సరెండర్
బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో.. పూర్తికాకుండా, మిగుళ్లు ఉంటాయని ముందుగానే గమనించి, వాటి అవసరం లేదని తెలిస్తే... వెంటనే ఆర్థికశాఖకు సరెండర్ చేయాలి. కానీ రూ.3,776.69 కోట్లను ఆర్థిక సంవత్సరం చివరి రోజైన 2022, మార్చి 31న సరెండర్ చేశారు. ఇది బడ్జెట్ మాన్యువల్ ఉల్లంఘన అవుతుందని, బడ్జెట్ అంచనాలను తప్పుగా వేయడాన్ని సూచిస్తున్నట్లు తెలిపింది.
కేంద్ర నిధులనూ ఖర్చు చేయని వైనం
వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పథకాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను తక్కువగా వినియోగించడం వల్ల ఆయా పథకాలపై ప్రభావం పడినట్లు పేర్కొంది.
* జాతీయ ఆరోగ్య మిషన్(ఆయుష్) వైద్యశాలలకు అవసరమైన అత్యవసర మందులు, వైద్య సేవ, విద్యను బలోపేతం చేసేందుకు రూ.73.62 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే, ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ నిర్వహణ యూనిట్ను ఏర్పాటు చేయలేదని పేర్కొంది.
* జాతీయ ఆరోగ్య మిషన్(ఏపీ వైద్య విధాన పరిషత్) కొవిడ్-18 కట్టడి, నియంత్రణ, నివారణకు కేంద్రం రూ.27.50 కోట్లు కేటాయిస్తే, ఈ నిధుల్ని వెచ్చించలేదు. ఇందుకు కారణాలేమిటో అధికారులు చెప్పలేదని కాగ్ తెలిపింది.
* ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద రూ.556.22 కోట్లు కేటాయించగా, ఇందులో రూ.473.59 కోట్లు ఖర్చుకాగా, రూ.82.63 కోట్లు మిగిలిపోయాయి. దీనికి కారణాల్ని అధికారులు తెలపలేదని కాగ్ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?