అప్పులు తీర్చే దారేది?
ఆంధ్రప్రదేశ్ అప్పులపై, వాటిని రాష్ట్రం చెల్లించే సామర్థ్యం, వ్యూహాలపై రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కానీ ప్రభుత్వం ఆ మాటలను లెక్కపెడుతున్న దాఖలాలే లేవు.
రాబడి పెంచడంపై దృష్టేది?
కాగ్ హెచ్చరిస్తున్నా దిద్దుబాటు చర్యల్లేవు
మూలధన వ్యయం అంతంతమాత్రమే
పెడచెవిన కీలక సలహాలు, సిఫార్సులు
ఈనాడు - అమరావతి
ఆంధ్రప్రదేశ్ అప్పులపై, వాటిని రాష్ట్రం చెల్లించే సామర్థ్యం, వ్యూహాలపై రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కానీ ప్రభుత్వం ఆ మాటలను లెక్కపెడుతున్న దాఖలాలే లేవు. లెక్కకు మిక్కిలిగా అప్పులు చేయడమే కాకుండా బడ్జెట్ పత్రాల్లో చూపని భారాలెన్నో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నాయని కాగ్ పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఈ రాజ్యాంగబద్ధ సంస్థ వరుసగా రెండేళ్లు తన పరిశీలనలను విడుదల చేసింది. 2021 మార్చి నెలాఖరు వరకు ఉన్న పరిస్థితులపై కాగ్ నివేదికలను 2022 సెప్టెంబరులో ప్రభుత్వం శాసనసభలో సమర్పించింది. 2021 మార్చి నుంచి 2022 మార్చి నెలాఖరు వరకు పరిస్థితిపై మరో నివేదికను ప్రస్తుత బడ్జెట్ సమావేశాల ముగింపు వేళ శాసనసభలో వెల్లడించింది. ఈ రెండు నివేదికల్లో కాగ్ ఏం చెప్పింది? ఏం సలహాలు ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం వాటిని పాటిస్తోందా? అప్పుల భారం నుంచి బయటపడి అభివృద్ధి మార్గం వైపు పయనించే చర్యలు ఏమైనా చేపట్టిందా అని విశ్లేషిస్తే ఇప్పటికీ ఆశావహ పరిస్థితి ఏమీ కనిపించడం లేదు.
కాగ్ హెచ్చరిక 1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 మధ్య కాలంలో రూ.3,47,944.64 కోట్ల మేర ప్రభుత్వం రుణం చెల్లించాల్సి రావచ్చు. 2022 మార్చి 31 నాటికి జీఎస్డీపీలో రుణాలు 31 శాతమే ఉన్నట్లు ప్రభుత్వం చూపుతున్నా రాష్ట్ర రుణభారం అంతకంటే ఎక్కువే ఉంది. బడ్జెటేతర రుణాలను ఇతర నిబద్ధ బాధ్యతలను కూడా లెక్కలోకి తీసుకుంటే జీఎస్డీపీలో రుణాల శాతం 42.33. ఇది నిర్దేశిత పరిమితి కన్నా ఏకంగా 6.73 శాతం అదనం. 2024-25 ఆర్థిక సంవత్సరం తర్వాత పరిస్థితి కొంత కుదుటపడే అవకాశం ఉంది. అయితే ఆదాయాలు పెంచుకోకుండా ఏటా ఖర్చుల కోసం కూడా అప్పులపైనే ఆధారపడితే రుణ బాధ్యత సరళి మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు.
ప్రస్తుత పరిస్థితి
* బడ్జెట్లో చూపిన లెక్కలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న కాగ్ వాటిని తీర్చే విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. బడ్జెటేతర రుణాలను కూడా కలిపి జీఎస్డీపీలో 42.33 శాతంగా కాగ్ పేర్కొంటోంది. ఆ లెక్కలకూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అధికారిక గణాంకాలే ప్రాతిపదిక కావడం గమనార్హం. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటున్న రుణాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో వెల్లడించడం లేదు. ఆయా కార్పొరేషన్ల లెక్కలపై ఆడిట్ చేయించి కంపెనీల రిజిస్ట్రార్ వద్ద సమర్పించకపోవడంతో వాటి అసలు అప్పులు బయటపడటం లేదు. కార్పొరేషన్లు తమ ఆడిట్ నివేదికలు సమర్పించి చాలాకాలం అయిందని కూడా కాగ్ నివేదికలో ప్రస్తావించింది. డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర పథకాలకు ఉన్న పెండింగ్ బిల్లులను ప్రభుత్వం బడ్జెట్ లెక్కల్లో చూపడం లేదనీ తప్పు పట్టింది. ప్రభుత్వం చెబుతున్న అప్పుల లెక్కలన్నీ అవాస్తవమేనని, అన్ని అప్పుల గురించీ వెల్లడిస్తున్నామన్న ప్రకటనలూ నిజం కాదంటూ కొట్టిపారేసింది.
* ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా.. ఏడేళ్లు, ఆరేళ్ల వ్యవధిలో తిరిగి చెల్లిస్తామని బహిరంగ మార్కెట్ రుణాలు తీసుకుంటోంది. అంటే రాబోయే పదేళ్ల కాలంలో చెల్లించాల్సిన అప్పులు ఇప్పటికే చాలా పెరిగిపోయాయి. ఇలాగే అప్పులు చేస్తూ పోతే ప్రమాదమేనన్న కాగ్ హెచ్చరికలను ఇది పెడచెవిన పెట్టడమే.
* కార్పొరేషన్ల రుణాలు, వాటిపై వడ్డీలను ప్రభుత్వమే తన బడ్జెట్ నుంచి చెల్లిస్తోంది. ఆ మొత్తాలు కలిపి లెక్కిస్తే భారం ఇంకెంత ఉందో అవగతమవుతుంది.
కాగ్ హెచ్చరిక 2
ఈ రుణభారాన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరులు సమకూర్చుకునేలా చూడటంతో పాటు ఒక వివేచనాత్మక రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాలి. దీనికి ఓ నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యకలాపాల కోసం మిగిలే వనరులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ అప్పులు మూలధన ఆస్తుల సృష్టి (అభివృద్ధి)కి కాకుండా రుణ విమోచనకే ఖర్చు చేస్తున్నట్లు ఆ సరళి తెలియజేస్తోంది. సేకరించిన రుణాలను స్థిరాస్తుల సృష్టికి వినియోగించి ఆదాయ వనరులు పెంచుకోకుండా ఇలా రుణాల చెల్లింపులకే వినియోగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతుంది. రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం.
ప్రస్తుత పరిస్థితి
అదనపు రెవెన్యూ వనరులు సమకూర్చుకునే ప్రయత్నం కాదు కదా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్న దాఖలాలు కూడా లేవు. ఇటీవలి ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆశించినట్లుగా సొంత రాబడులు ఉండటం లేదు. సాధారణంగా ఏటా 15 నుంచి 20 శాతం రాబడులు పెరుగుతాయి. అది పెద్ద పెరుగుదల కాదని, ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా ఉంటుందని నిపుణుల విశ్లేషణ. పెరుగుదల రేటులోనూ ఆశావహ వాతావరణం కనిపించడం లేదు.
* కొత్తగా ఆస్తులు సృష్టించగలిగితేనే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెరిగే ఆస్కారం ఉంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా సాగితేనే రాబడులు పెరుగుతాయి. అభివృద్ధి పనులకే నిధులు ఖర్చు చేయనప్పుడు, ఆస్తులు సృష్టించేలా నిధులు వెచ్చించనప్పుడు రాష్ట్ర రాబడులు ఎక్కడ పెరుగుతాయి?
* రాబడి పెరగాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి కావాలంటే మూలధన వ్యయం రూపంలో ఎక్కువ మొత్తాలు కేటాయించి, ఖర్చు చేయాలి. సగటున ప్రతి రాష్ట్రంలో మూలధన వ్యయం 14.41 శాతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది 9.21 శాతమే ఉందని కాగ్ కుండబద్దలు కొట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7.04 శాతమే మూలధన వ్యయంపై ఖర్చు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10.14 శాతానికి పెరిగినా తర్వాత ఏడాది 8.5 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు అత్యంత దారుణంగా కేవలం 4.10 శాతమే మూలధన వ్యయం కింద రాష్ట్రం ఖర్చు చేసినట్లు కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులోనూ కొంత పేదలకు ఇచ్చే ఇళ్ల పథకాలపై వెచ్చించి, దాన్నీ మూలధన వ్యయంగా చూపే ప్రయత్నాలు జరిగాయని గతంలోనే కాగ్ తప్పు పట్టింది. అప్పులు తెచ్చి రెవెన్యూ ఖర్చులు చేస్తూ, అప్పులతో మళ్లీ అప్పులు తీరుస్తూ, ఉన్న బడ్జెట్ నుంచి ఆస్తులు సృష్టించేందుకు చాలినన్ని నిధులివ్వకపోతే ఇక రాష్ట్రం అప్పులు తీరేదెలా? అభివృద్ధి జరిగేదెలా?
కాగ్ హెచ్చరిక 3
ఆస్తుల కల్పన కోసం ఆర్థికాభివృద్ధిని వేగిరపరచాలి. ఇందుకు అవసరమైన నిధులు వెచ్చించాలి. ప్రాజెక్టుల అమలును నిశితంగా పరిశీలించాలి. నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి.
ప్రస్తుత పరిస్థితి
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణమే కీలకమని కాగ్ సలహా ఇచ్చింది. అప్పుల నుంచి బయటపడాలన్నా, రాబడులు పెరగాలన్నా ప్రాజెక్టులు ఎంతో కీలకమని స్పష్టం చేస్తోంటే ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్లుగా నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురావడం లేదు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చాలినన్ని నిధులూ ఇవ్వడం లేదు.
* రాష్ట్రంలో మొత్తం 54 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, 2024 నాటికి వాటిలో 42 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నాలుగేళ్లలో కేవలం రెండు ప్రాజెక్టుల నిర్మాణాన్ని మాత్రమే కొలిక్కి తీసుకువచ్చింది. మిగిలిన ప్రాజెక్టులు రాబోయే ఏడాదిలో కూడా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే రూ.1,64,815 కోట్లు అవసరమని లెక్కించారు. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం వీటిపై ఖర్చు చేసింది రూ.20 వేల కోట్ల లోపే. దీంతో కీలక ప్రాజెక్టులు పూర్తి చేసే ఆస్కారమే లేదు. ఫలితంగా కాగ్ చెప్పినట్లు అభివృద్ధి అంతంతమాత్రం అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా