విశ్వవిద్యాలయాలపై ఆ ఇద్దరి పెత్తనం
విశ్వవిద్యాలయాల పాలకవర్గ (ఈసీ) సమావేశాల్లో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పెత్తనం పెరిగేలా ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.
ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లేకుండా ఈసీ నిర్వహించకూడదంటూ ఆదేశాలు
ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల పాలకవర్గ (ఈసీ) సమావేశాల్లో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పెత్తనం పెరిగేలా ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ నామినీగా ఈసీలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఉంటారు. గతంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాలకవర్గంలో సభ్యుడిగా ఉండేవారు కాదు. వైకాపా అధికారంలోకొచ్చాక అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈసీ సభ్యుడిగా చేస్తూ చట్టంలో మార్పు చేశారు. ఇప్పుడు వీరిద్దరూ లేకుండా సమావేశాలు నిర్వహించకూడదని, ప్రభుత్వ విధానాలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఏ అంశాల్లోనైనా వీరి అభిప్రాయాలను రికార్డు చేయకుండా తీర్మానాలు చేయకూడదని హెచ్చరించింది. విశ్వవిద్యాలయాల చట్టానికి విరుద్ధంగా ఈ ఆదేశాలు జారీచేసింది. స్వయంప్రతిపత్తి కలిగిన వర్సిటీలపై ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి పెత్తనం పెరిగిపోయిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. పాలకవర్గానికి అధికారాలు లేకుండా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. విశ్వవిద్యాలయాల చట్టానికి ఇది పూర్తిగా ఉల్లంఘనే. ప్రభుత్వ నామినీగా ఉన్న ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ దృష్టికి తీసుకురాకుండా ఏ టేబుల్ ఐటమ్, ధ్రువీకరణ అంశం పెట్టకూడదని హెచ్చరించింది. ఈసీ సమావేశానికి 15రోజుల ముందు ఎజెండాను సభ్యులందరికీ పంపాలని, అన్ని అంశాలపై ప్రభుత్వ నామినీ నుంచి రాతపూర్వక హామీ తీసుకొని, దాన్ని ఈసీలో పెట్టాలని సూచించింది. ప్రభుత్వ విధానాలపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ముఖ్యకార్యదర్శి సలహా, అభిప్రాయం తీసుకోవాలని ఆదేశించింది. న్యాయస్థానాల్లోని కేసులు, పోస్టుల ఉన్నతీకరణ, ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటుతో అమలుచేసే పథకాలు, నిర్దిష్ట విషయాలపై ఎలాంటి తీర్మానం చేయకూడదని, పదోన్నతి, నియామకాలు, ప్రభుత్వంపై భారం పడేలా పోస్టులను సృష్టించడం, కొత్త కోర్సులను రెగ్యులర్, సెల్ఫ్పైనాన్స్గా ప్రారంభించడం తదితర అంశాల్లో ఈ ఇద్దరి రిమార్కులను రాతపూర్వకంగా రికార్డు చేయకుండా ఎలాంటి తీర్మానాలూ చేయకూడదని హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
సీఎస్, డీజీపీలపై.. ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
వైకాపా ఎన్నికల ప్రచారం చేసిన ఆర్టీసీ వైఎస్ఆర్ యూనియన్ నేత!
ఆర్టీసీలోని వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం నేత ఒకరు తన పుట్టినరోజు వేడుక పేరిట కార్యక్రమం నిర్వహించి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. -
సంక్షిప్త వార్తలు
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె