Polavaram: పోలవరానికి మళ్లీ కేంద్రం షాక్!
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం రాష్ట్రానికి మళ్లీ షాక్ ఇచ్చింది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తూ.. ఇక ఈ ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులు రూ.1,249 కోట్లే అని వెల్లడించింది.
ఇక ఇచ్చేది రూ.1,249 కోట్లేనట
తాజాగా రూ.826 కోట్లు విడుదల చేస్తూ మళ్లీ పాతపాటే
సీఎం జగన్ ప్రయత్నాలు నిష్ప్రయోజనమేనా?
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం రాష్ట్రానికి మళ్లీ షాక్ ఇచ్చింది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తూ.. ఇక ఈ ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులు రూ.1,249 కోట్లే అని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే మరో రూ.30 వేల కోట్లకు పైగా నిధులు కావాలి. ఆ విషయాన్ని ఎటూ తేల్చకుండా 2020 అక్టోబరులో కేంద్ర ఆర్థికశాఖ చెప్పిన మాటలకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు తాజా ఉత్తర్వుల్లోనూ పేర్కొనడం గమనార్హం. కొత్త డీపీఆర్ ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వాలని ఆంధ్రప్రదేశ్ కోరుతున్నా, తాము నిధులు తెస్తామని ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్నా, దిల్లీ వెళ్లి అడుగుతూనే ఉన్నామని ప్రకటనలపై ప్రకటనలు విడుదల చేస్తున్నా రెండేళ్లుగా సాధించిందేమీ లేదని రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద తాజాగా రూ.826.18 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) 2020 నవంబరు 2న నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను 2013-14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లకు ఆమోదించాం. దాని ప్రకారం 2014కు ముందు రూ.4,730.71 కోట్లు పోను నీటిపారుదల విభాగం కింద వ్యయమయ్యే మిగిలిన నిధులిస్తామన్నాం. ఆ మేరకు ఇప్పటి వరకు ప్రాజెక్టుకు రూ.13,592.22 కోట్లు ఇచ్చాం. మిగిలిన నిధులు రూ.2,075.68 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందులో ప్రస్తుతం రూ.828.16 కోట్లు విడుదల చేస్తున్నాం’ అని లేఖలో తెలియజేసింది. ఈ నిధులు మినహాయిస్తే ఇక పోలవరానికి ఇచ్చేది రూ.1,249 కోట్లేనని మరోసారి స్పష్టం చేసినట్లయింది.
పీపీఏ మరో సిఫార్సు చేసినా...
పోలవరానికి ఇక రమారమి రూ.4000 కోట్లే ఇస్తామంటూ 2021 అక్టోబరులో కేంద్ర ఆర్థికశాఖ రాసిన లేఖ కలకలం సృష్టించింది. ఆ ఏడాది నవంబరు 2న పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) 2013-14 సవరించిన అంచనాలు రూ.20,398.61 కోట్లకు ఆమోదం తెలియజేసింది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈ నిధులు సరిపోవని, 2017-18 ధరలతో రివైజ్డ్ కాస్ట్ కమిటీ సిఫార్సు చేసిన రూ.47,725.74 కోట్లకు కూడా ఆమోదం తెలియజేయాలని అదే సమావేశంలో సిఫార్సు చేసింది.
పాత పాటే పాడిన మంత్రి
కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం తాజా ఉత్తర్వుల ప్రకారం కూడా పోలవరం అథారిటీ 2013-14 సవరించిన ధరలను పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నదే తప్ప రూ.47,725 కోట్ల అంచనాలను పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. కేంద్ర జలవనరులశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కూడా ఇలాగే మాట దాటేశారు. 2017-18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిందని తెలిపారు. తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ రూ.47,725.87 కోట్లకు ఆమోదించిందన్నారు. అంతే తప్ప పోలవరానికి ఆ నిధులు ఇచ్చేలా కేంద్రం ఏ చర్యలు తీసుకుంటోందో వెల్లడించనేలేదు. మరో వైపు కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికీ రూ.20,398.61 కోట్లకే కట్టుబడి ఉన్నట్లు పేర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్ రెండేళ్లుగా పోలవరం నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతూనే ఉన్నా సాధించింది ఏమీ లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి