హైదరాబాద్ అభివృద్ధికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబు
హైదరాబాద్ అభివృద్ధికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబునాయుడు అని ఏపీ తెదేపా అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
పార్టీ ఆవిర్భావ సభలో నాయకులు
హైదరాబాద్, న్యూస్టుడే: హైదరాబాద్ అభివృద్ధికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబునాయుడు అని ఏపీ తెదేపా అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అట్టహాసంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. అమెరికా, సింగపూర్ దేశాల్లోని పట్టణాలను తలపించేలా హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి చంద్రబాబునాయుడు విజన్ కారణమని అన్నారు. హైదరాబాద్ లాంటి నగరంగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు పూనుకుంటే.. ఒక్క అవకాశమంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రజలు తమకు జరిగిన మోసాన్ని తెలుసుకున్నారనడానికి ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు కలిసి ఉండాలనే లక్ష్యంతో తెదేపా ముందుకు సాగుతుందన్నారు.
నాటి విత్తనాలే నేటి ఫలాలు: కాసాని
‘తెలుగు రాష్ట్రాల్లో పేదలు, బలహీనవర్గాలు, యువత, మహిళల సంక్షేమానికి అంకితభావంతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు అనేక అవకాశాలు కల్పించింది. హైదరాబాద్ అభివృద్ధికి తెదేపా హయాంలో నాటిన విత్తనాలు నేడు పండ్లుగా మారాయి’ అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీని గ్రామగ్రామానికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెదేపా హయాంలో బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించడం వల్ల తనలాంటి అనేకమందికి అవకాశాలొచ్చాయని గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు హయాంలో విజన్-2020 ప్రణాళిక ద్వారా చేపట్టిన అభివృద్ధి తరతరాలకు నిలిచిపోతుందన్నారు.
తెదేపా ఒక శక్తి: రామ్మోహన్నాయుడు
తాను న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కు వచ్చే సమయంలో.. ఇక్కడ కర్ఫ్యూ ఉందా? అని తెలుసుకునేవాడినని పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. అలాంటి హైదరాబాద్ను కరోనాకు వ్యాక్సిన్ కనుగొనే నగరంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. ప్రపంచాన్ని జయించే శక్తిని యువతకు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. తెదేపా అండమాన్ నికోబార్ అధ్యక్షుడు మాణిక్రావు యాదవ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని తెలుగువారంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పారు. మాజీ మంత్రి బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గ పరిపాలన కొనసాగుతోందని, ఆ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్కుమార్గౌడ్, రామానాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నేతలు నన్నూరి నర్సిరెడ్డి, అలీ మస్కతి తదితరులు ప్రసంగించారు. పార్టీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున 17 మంది నేతలను సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు.
ఎన్టీఆర్కు చంద్రబాబు నివాళి
తెదేపా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ను దర్శించుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయులు రామకృష్ణ, బాలకృష్ణ, పార్టీ నేతలు మాగంటి బాబు, కంభంపాటి రామ్మోహన్రావు, చంద్రశేఖర్రెడ్డి, తెతెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పార్టీ ముఖ్యనేతలు ఎన్టీఆర్ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.
తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో తెలంగాణ తమ్ముళ్లలో నూతనోత్సాహం నెలకొంది. సభకు రెండు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే సభా ప్రాంగణానికి వారి రాక మొదలైంది. మంగళవారం పొలిట్బ్యూరో సమావేశం నిర్వహించిన తెదేపా, బుధవారం ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించింది. హైదరాబాద్లో రెండు ముఖ్య కార్యక్రమాల్ని వరుసగా నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సభా ప్రాంగణంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తెదేపా జెండాలు రెపరెపలాడాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సుమారు 70 నిమిషాల పాటు ప్రసంగించారు. తాను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కృషిని, ప్రధానంగా హైదరాబాద్ అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు.
బాలయ్య పద్యాలు, పంచ్ డైలాగ్లు..
తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన వేదికపైకి వచ్చేసరికి సభలో ‘జై బాలయ్య’ నినాదాలు మిన్నంటాయి. బాలకృష్ణ ప్రసంగంలో పద్యాలు, పంచ్ డైలాగ్లతో అదరగొట్టారు. పార్టీని మొదటి నుంచీ భుజస్కంధాలపై మోస్తున్న కార్యకర్తలు అకుంఠిత దీక్షతో శ్రమిస్తున్నారని అభినందించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును దైవాంశ సంభూతుడిగా, తన దైవంగా సంబోధిస్తూ.. ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించిన సేవలను బాలకృష్ణ గుర్తుచేశారు. ఎన్టీఆర్ పేరిట ఉన్న వైద్య విశ్వవిద్యాలయం పేరును మార్చడం దౌర్భాగ్యమన్నారు. చంద్రబాబునాయుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోనే నేడు హైదరాబాద్ కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే స్థాయికి ఎదిగిందని బాలకృష్ణ అన్నారు. ‘చరిత్ర మరిచిన వారు తల్లి పాలు తాగి విషం చిమ్మిన వారితో సమానం’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్