కొనసాగుతున్న కక్ష సాధింపు
మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. నాలుగైదు నెలలుగా దుష్ప్రచారానికి పాల్పడుతూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ మార్గదర్శి విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోంది.
మార్గదర్శి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు
హైకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నప్పటికీ చర్యలు
ఆడిట్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కొలో బలవంతంగా సీఐడీ సోదాలు
ఈనాడు, హైదరాబాద్: మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపును కొనసాగిస్తూనే ఉంది. నాలుగైదు నెలలుగా దుష్ప్రచారానికి పాల్పడుతూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ మార్గదర్శి విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోంది. ఆరు దశాబ్దాలుగా మచ్చలేని సేవలందిస్తున్న మార్గదర్శిపై ప్రతికూల ప్రచారంతో బురద జల్లుతూ ప్రతిష్ఠను, వ్యాపారాన్ని దెబ్బతీయాలన్న దురుద్దేశం కనిపిస్తోంది. అంతేగాకుండా తప్పుడు కేసులతో చందాదారుల్లో భయాందోళనలను కలిగించాలన్న లక్ష్యంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ చందాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోగా, ఒకే రోజు ఒకే ఆరోపణపై కంపెనీకి వ్యతిరేకంగా కేసులు నమోదు చేయడం వెనుక ప్రభుత్వ దురుద్దేశం స్పష్టమవుతోంది. ఏపీ, తెలంగాణ హైకోర్టులు ఏపీ అధికారులను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, మార్గదర్శికి చెందిన సమాచారాన్ని బయటికి వెల్లడిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏపీ సీఐడీ సోదాలు, బ్రాంచ్లతోపాటు ఛైర్మన్, ఎండీలపై నమోదు చేసిన కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉండగానే.. ఏపీ సీఐడీ రకరకాల మార్గాల్లో వేధింపులకు దిగుతోంది. పెండింగ్లో ఉన్న పిటిషన్లు తేలేదాకా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే నమోదైన ఫిర్యాదులతో పాటు ఇలాంటి ఇతర ఫిర్యాదుల్లోనూ మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. చందాదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఈ చర్యలు చేపట్టామని, చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా వసూలు చేసిన సొమ్మును మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి పంపి.. మ్యూచువల్ ఫండ్, ఇతర ప్రభుత్వ సెక్యూరిటీస్లో పెట్టుబడులు పెడుతున్నారన్నది ఏపీ ప్రభుత్వ ప్రధాన వాదన అని, ఒకవేళ చిట్ఫండ్ కంపెనీ పెట్టుబడులు పెట్టిందనుకున్నప్పటికీ ప్రాథమికంగా అది నేరపూరిత దుర్వినియోగం లేదా చందాదారులను మోసగించడం కాదని హైకోర్టు పేర్కొన్న విషయం విదితమే. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో 108 శాఖల ద్వారా లక్షల మంది చందాదారులు, రూ.10 వేల కోట్ల టర్నోవర్తో 60 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నప్పటికీ.. ఒక్క చందాదారు కూడా ఫిర్యాదు చేయకపోవడం గమనార్హమని హైకోర్టు పేర్కొంది. మూడు పిటిషన్లు పెండింగ్లో ఉండటంతో భిన్నమైన ఉత్తర్వులు వెలువడరాదన్న ఉద్దేశంతో అన్నింటినీ కలిపి విచారించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. దీనిపై గత వారం ఉత్తర్వులు ఇవ్వగా.. ఆ పిటిషన్లు తిరిగి విచారణకు రాకముందే మార్గదర్శి ఛైర్మన్, ఎండీలకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని మార్గదర్శి యాజమాన్యం మంగళవారమే సీఐడీకి సమాధానం ఇచ్చింది.
సి.సి.కెమెరాల కనెక్షన్లను కత్తిరించి..
మరోవైపు, మార్గదర్శి వ్యవహారాలను చూసే ప్రముఖ ఆడిట్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కొలో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. మార్గదర్శికి చెందిన సమాచారాన్ని అందజేయాలని సీఐడీ ఈ నెల 27న ఆడిట్ కంపెనీకి ఈమెయిల్ పంపింది. ఈ నెల 28న ఆడిట్ కంపెనీకి చెందిన శ్రావణ్ విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లగా.. ఆయనను, ఆయనతోపాటు ఉన్న ఉద్యోగులను కార్యాలయం దాటివెళ్లకుండా అధికారులు నిర్బంధించారు. కాగా హైదరాబాద్లో ఉన్న బ్రహ్మయ్య అండ్ కొ సోదా నోటీసులను తీసుకోవడానికి నిరాకరించినా బలవంతంగా తనిఖీలు చేపట్టి, సమాచారాన్ని కాపీ చేసుకున్నారు. దాదాపు 30 మంది అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి.. ఇంటర్నెట్, సి.సి.కెమెరాల కనెక్షన్లను కత్తిరించి, సిబ్బంది ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని తెల్లవార్లూ సోదాలు నిర్వహించారు. బ్రహ్మయ్య అండ్ కొ సీనియర్ పార్ట్నర్ 75 ఏళ్ల వయసున్న ఎస్ఎస్ఆర్ కోటేశ్వరరావుని నిర్బంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మార్గదర్శికి చెందినదే కాకుండా ఇతర సంస్థలకు చెందిన సమాచారాన్ని కాపీ చేసుకుని తీసుకెళ్లారు. ఏదైనా కంపెనీకి చెందిన సమాచారాన్ని ఛార్టెడ్ అకౌంటెంట్స్ చట్టం నిబంధనల మేరకే వెల్లడించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా ఆడిట్ కంపెనీ వద్ద ఉన్న ఖాతాదారులకు చెందిన విశ్వసనీయ సమాచారాన్ని సీఐడీ తీసుకెళ్లింది. ఇది సమాచార తస్కరణ కిందికే వస్తుందని న్యాయనిపుణుల అభిప్రాయం. చట్టప్రకారం అడిగిన సమాచారం అందించకపోతే సోదాలకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నోటీసులో అడిగిన సమాచారం బ్రహ్మయ్య అండ్ కొ విజయవాడ వెళ్లి ఇచ్చినప్పటికీ బలవంతంగా సోదాలకు దిగింది. వాస్తవానికి చిట్ఫండ్ కంపెనీల చట్టం కింద నడిచే సంస్థలపై ఏపీ డిపాజిటర్స్ చట్టం కింద చర్యలు చేపట్టడం చెల్లదు. అయినా ఖాతాదారుల పరిరక్షణ పేరుతో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. చట్టాలను తుంగలో తొక్కి.. దర్యాప్తు పేరుతో మార్గదర్శితోపాటు అందులో విధులు నిర్వహించేవారిని, ఖాతాదారులను, దాంతో సంబంధం ఉన్న ఆడిట్ కంపెనీలను వేధింపులకు గురిచేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ