‘బ్రహ్మయ్య అండ్ కొ’లో సోదాలపై యథాతథస్థితి
ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి నమోదైన కేసులో భాగంగా ఆడిట్ కంపెనీ ‘బ్రహ్మయ్య అండ్ కొ’లో ఏపీ సీఐడీ నిర్వహించిన సోదాలు, స్వాధీనం చేసుకున్న సమాచారానికి సంబంధించి తదుపరి విచారణ దాకా యథాతథస్థితిని కొనసాగించాలంటూ బుధవారం తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సోదాలు చట్ట విరుద్ధం..ఏపీ సీఐడీకి పరిధిలేదు
న్యాయస్థానానికి నివేదించిన ‘బ్రహ్మయ్య అండ్ కొ’
ఈనాడు - హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి నమోదైన కేసులో భాగంగా ఆడిట్ కంపెనీ ‘బ్రహ్మయ్య అండ్ కొ’లో ఏపీ సీఐడీ నిర్వహించిన సోదాలు, స్వాధీనం చేసుకున్న సమాచారానికి సంబంధించి తదుపరి విచారణ దాకా యథాతథస్థితిని కొనసాగించాలంటూ బుధవారం తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్లోని పూర్వాపరాలపై పూర్తిస్థాయిలో ఈ నెల 31న మొదటి కేసుగా విచారణ చేపడతామని తెలిపింది. సోదాల నిమిత్తం ఈ నెల 28న ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ.. బ్రహ్మయ్య అండ్ కొ, భాగస్వామి పి.చంద్రమౌళి బుధవారం అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సాయంత్రం జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది బి.నళిన్కుమార్, న్యాయవాది కె.మమతాచౌదరిలు వాదనలు వినిపిస్తూ 28న ఏపీకి చెందిన సీఐడీ డీఎస్పీ రవికుమార్ ఎలాంటి కారణాలు లేకుండా నోటీసులు అందజేసి, వెంటనే సోదాలు చేపట్టారన్నారు. ఉద్యోగులను కదలనివ్వకుండా వారి కంప్యూటర్లలోని సమాచారాన్ని కాపీ చేసుకున్నారని తెలిపారు. తెలంగాణలోని తమ కార్యాలయంలో సోదాలు చేసే అధికార పరిధి ఏపీ సీఐడీకి లేదన్నారు. ఈ నెల 27న సీఐడీ పంపిన మెయిల్ మేరకు తమ కంపెనీ భాగస్వామి కె.శ్రావణ్ మార్గదర్శికి చెందిన సమాచారం ఇవ్వడానికి 28న విజయవాడ సీఐడీ కార్యాలయానికి వెళ్లారన్నారు. శ్రావణ్తోపాటు వెళ్లిన ఉద్యోగులను సీఐడీ కార్యాలయం దాటి వెళ్లకుండా నిర్బంధించారన్నారు. 90 ఏళ్ల చరిత్ర ఉన్న ఆడిట్ కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఏపీ సీఐడీ వ్యవహారం ఉందని చెప్పారు. కంపెనీ నుంచి 7 డెస్క్టాప్లు, 12 లాప్ట్యాప్లు, 2 హార్డ్డిస్క్ల్లోని సమాచారాన్ని కాపీ చేసుకున్నారన్నారు. మార్గదర్శికి చెందిన సమాచారం కాకుండా తమ ఖాతాదారులందరిదీ కాపీ చేసుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వివరించారు. ఏపీ సీఐడీ తరఫు న్యాయవాది పి.గోవిందరెడ్డి వాదనలు వినిపిస్తూ మేజిస్ట్రేట్ అనుమతితో సోదాలు చేపట్టి పూర్తి చేశామని పేర్కొన్నారు. సోదాలను నిలిపివేయాలన్న పిటిషనర్ల అభ్యర్థన చెల్లుబాటుకాదన్నారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోదాలే చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతున్నామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్కు సంబంధించి రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ నంబరు కేటాయించాలని ఆదేశించారు. తదుపరి విచారణ దాకా ‘బ్రహ్మయ్య అండ్ కొ’లో నిర్వహించిన సోదాలు, సేకరించిన సమాచారానికి సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని సీఐడీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
30 మంది అధికారులు.. 30 గంటలపాటు సోదాలు
ఈనాడు, హైదరాబాద్: ప్రముఖ ఆడిటింగ్ సంస్థ ‘బ్రహ్మయ్య అండ్ కొ’లో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు సోదాలు నిర్వహించారు. మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్పై ఆ రాష్ట్రంలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు జరిపారు. మంగళవారం మధ్యాహ్నం ఎర్రమంజిల్లోని గోల్డెన్ గ్రీన్ అపార్ట్మెంట్లో ఉన్న ‘బ్రహ్మయ్య అండ్ కొ’ కార్యాలయానికి డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో దాదాపు 30 మంది వరకు సీఐడీ పోలీసులు వెళ్లారు. వెళ్లగానే అక్కడున్న సీసీ కెమెరాలను నిలిపివేశారు. మళ్లీ పనిచేయకుండా కేబుల్ కూడా కత్తిరించారని వాచ్మెన్ తెలిపారు. అనంతరం సీఐడీ సిబ్బంది నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయానికి వెళ్లారు. సంస్థలో మొత్తం 14 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు మహిళా సిబ్బందిని మాత్రం సాయంత్రం ఇంటికి పంపారు. కార్యాలయం తలుపులు మూసి సోదాలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం మొదలైన ఈ సోదాలు బుధవారం సాయంత్రం 5 గంటల వరకూ దాదాపు 30 గంటలపాటు కొనసాగాయి. గత 8 సంవత్సరాలకు సంబంధించి ఆడిటింగ్ దస్త్రాలను కాపీ చేసుకొని తీసుకెళ్లినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అలాగే కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో ఉన్న సమాచారాన్ని కూడా కాపీ చేసుకొని వెళ్లారని పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆ సంస్థకు చెందిన న్యాయవాది కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సీఐడీ అధికారులు అభ్యంతరం చెప్పారు. ఏ అధికారంతో తనను ఆపుతున్నారని న్యాయవాది ప్రశ్నించడంతో లోనికి అనుమతించారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న దస్త్రాలను దాదాపు 15 సంచుల్లో తీసుకొని వెళ్లిపోయారు. సంస్థకు చెందిన సీనియర్ పార్ట్నర్ కోటేశ్వరరావు వయోభారంతో సతమతమవుతున్నా.. మంగళవారం రాత్రి ఆయనను ఇంటికి వెళ్లేందుకు అనుమతించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన