ప్రతి నెలా ఇంధన సర్దుబాటు ఛార్జీలు
ఇంధన సర్దుబాటు ఛార్జీలను ఇప్పటి వరకు మూడు నెలలకు ఓసారి వసూలు చేస్తుండగా... ఇకపై ఏ నెలకు ఆ నెల వసూలు చేసేలా డిస్కంలకు అనుమతిస్తూ ఏపీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఆదేశాలు జారీ చేసింది.
యూనిట్కు 40 పైసల వరకు వసూలు చేసుకునేందుకు అనుమతి
రాష్ట్రంలో అన్ని కేటగిరీలకు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు
ఏపీఈఆర్సీ ఆదేశాలు
ఈనాడు, అమరావతి: ఇంధన సర్దుబాటు ఛార్జీలను ఇప్పటి వరకు మూడు నెలలకు ఓసారి వసూలు చేస్తుండగా... ఇకపై ఏ నెలకు ఆ నెల వసూలు చేసేలా డిస్కంలకు అనుమతిస్తూ ఏపీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఆదేశాలు జారీ చేసింది. అన్ని కేటగిరీలకు యూనిట్కు 40 పైసలు చొప్పున వసూళ్లు చేసుకునే ప్రతిపాదనకు డిస్కంలకు అనుమతిస్తూ బుధవారం గెజిట్ ప్రచురించింది. ఈ మేరకు ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ యాక్ట్కు సవరణ చేసింది. ఫిబ్రవరి 10న ముసాయిదా సవరణ ప్రచురించి... అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించింది. రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. ఇంధన, విద్యుత్ కొనుగోళ్ల ఖరీదు సర్దుబాటు (ఎఫ్పీపీసీఏ) ఫార్ములా ప్రకారం ఈ ఛార్జీలు ఉండనున్నాయి. ప్రతి నెలా వసూళ్లు చేసే మొత్తంతో పాటు సంవత్సరం చివరలో ఇంధన సర్దుబాటు ఛార్జీకి మించి ఉంటే.. అదనంగా వసూళ్లు చేయనున్నారు. ఒకవేళ తక్కువ ఉంటే (ట్రూ డౌన్).. దానిని ఆ తర్వాత బిల్లుల్లో సర్దుబాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TCS: భారత్లో అత్యంత విలువైన బ్రాండ్ టీసీఎస్
-
ODI WC 2023: సూర్యకు వన్డేల్లో గొప్ప గణాంకాలు లేవు.. తుది జట్టులో తీవ్ర పోటీ: సన్నీ
-
పైకి లేచిన బ్రిడ్జ్.. కిందికి దిగలేదు: లండన్ ఐకానిక్ వంతెన వద్ద ట్రాఫిక్ జామ్
-
USA: ట్రూడో అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: నిజ్జర్ ఊసెత్తని అమెరికా..!
-
Karnataka Bandh: ‘కావేరీ’ పోరు: స్తంభించిన కర్ణాటక.. 44 విమానాలు రద్దు
-
Salaar release date: ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన టీమ్