అమరావతి ఉద్యమానికి 1,200 రోజులు
ఒకటా.. రెండా.. ఏకంగా 1,200 రోజులు. రాజధాని అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న వైకాపా ప్రభుత్వంపై రాజధాని గ్రామాల ప్రజలు, భూములిచ్చిన రైతులు ఉద్యమ బావుటా ఎగరవేసి శుక్రవారానికి పన్నెండు వందల రోజులవుతోంది. ప్రభుత్వ దమననీతిని, పోలీసుల దాడులు, నిర్బంధాలు, ఆంక్షలు, అక్రమ కేసులను తట్టుకుని సామాన్య రైతులు, ప్రజలు ఇన్ని రోజులపాటు ఉద్యమ ప్రస్థానం కొనసాగించడం అసాధారణం.
ఎత్తిన పిడికిలి దించని రాజధాని రైతులు
ప్రభుత్వ దాష్టీకాలపై అలుపెరగని పోరు
నేడు ప్రత్యేక కార్యక్రమాలు
ఈనాడు, అమరావతి: ఒకటా.. రెండా.. ఏకంగా 1,200 రోజులు. రాజధాని అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న వైకాపా ప్రభుత్వంపై రాజధాని గ్రామాల ప్రజలు, భూములిచ్చిన రైతులు ఉద్యమ బావుటా ఎగరవేసి శుక్రవారానికి పన్నెండు వందల రోజులవుతోంది. ప్రభుత్వ దమననీతిని, పోలీసుల దాడులు, నిర్బంధాలు, ఆంక్షలు, అక్రమ కేసులను తట్టుకుని సామాన్య రైతులు, ప్రజలు ఇన్ని రోజులపాటు ఉద్యమ ప్రస్థానం కొనసాగించడం అసాధారణం. 2019 డిసెంబరు 17న ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో మూడు రాజధానుల ప్రస్తావన తేవడంతో.. మర్నాటి నుంచి రాజధాని గ్రామాల్లో ఎగసిన ఉద్యమం.. కొనసాగుతూనే ఉంది. వైకాపా తప్ప అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ వంటి న్యాయకోవిదులు, పలువురు విశ్రాంత ఐఏఎస్లు, మేధావులు, ఎన్ఆర్ఐలు ఉద్యమానికి బాసటగా నిలిచారు.
ప్రభుత్వ ఆంక్షలకు ఎదురొడ్డి..
అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీసుల్ని రాజధాని గ్రామాల్లోకి దింపింది. 144 సెక్షన్, పోలీసు చట్టంలోని సెక్షన్ 30 వంటివి ప్రయోగించి, గ్రామాల్ని అష్టదిగ్బంధం చేసింది. ఇళ్లల్లోకి వెళ్లి అర్ధరాత్రి తనిఖీలు చేశారు. 2020 జనవరిలో విజయవాడ కనక దుర్గమ్మకు పొంగళ్లు సమర్పించి, తమ గోడు వెళ్లబోసుకునేందుకు వెళుతున్న మహిళల్ని అడ్డుకుని లాఠీఛార్జి చేశారు. మర్నాడు మందడంలో దీక్ష చేస్తున్న మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఒక గర్భిణిని పోలీసు అధికారి ఒకరు కాలితో తన్నడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత హైకోర్టు జోక్యం చేసుకుని మందలించడంతో గ్రామాలపై పోలీసుల ఉక్కు పిడికిలిని కొంత సడలించారు. 2020 జనవరి 20న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన రైతులు.. శాసనసభ సమీపానికి చేరుకోవడంతో పోలీసులు లాఠీలు ఝళిపించారు. 2021 మార్చి 8న మహిళా దినోత్సవం రోజున విజయవాడ కనకదుర్గ గుడికి వెళుతున్న మహిళలపై పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు. రాజధాని ఉద్యమంలో పాల్గొంటున్నవారిపై పోలీసులు కొన్ని వందల కేసులు నమోదు చేశారు.
పాదయాత్రపైనా దాష్టీకం..
రాజధాని రైతులు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు 2021 నవంబరు 1న పాదయాత్ర ప్రారంభించారు. దారి పొడవునా అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి విశేషమైన స్పందన, మద్దతు లభించింది. పోలీసులు మాత్రం పాదయాత్ర అమరావతిలో మొదలై తిరుపతి చేరేంత వరకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. రైతులకు ఆశ్రయమిచ్చినవారినీ వేధించారు. రాత్రి బస కోసం రైతులు ముందే కల్యాణ మండపాలు వంటివి బుక్ చేసుకుంటే... స్థానిక వైకాపా నాయకులు అడ్డుకున్న సందర్భాలూ ఉన్నాయి. అమరావతి పరిరక్షణ ఉద్యమం వెయ్యో రోజుకు చేరిన సందర్భంగా.. 2022 సెప్టెంబరు 12 నుంచి రాజధాని రైతులు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈసారి దారి పొడవునా వైకాపా నాయకులే వారికి అడ్డుతగిలారు. రాజధాని రైతులు తమ ప్రాంతానికి ఎలా వస్తారో చూస్తామంటూ.. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, వైకాపా నాయకులూ బెదిరింపులకూ దిగారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రామచంద్రపురం దగ్గరకు వెళ్లేసరికి.. రైతులు పాదయాత్ర నిలిపివేయాల్సి వచ్చింది.
కోర్టు చెప్పినా.. విశాఖ పాటే..!
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గత ఏడాది మార్చి మొదటివారంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. అమరావతి నిర్మాణానికి, రాజధాని రైతులుకు స్థలాలు అభివృద్ధి చేసి ఇచ్చేందుకు, రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల కల్పనకు నిర్దిష్టమైన గడువులూ విధించింది. దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లింది. ఆ కేసు ఇంకా విచారణలో ఉండగానే.. ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే రాజధానిని విశాఖకు మారుస్తామని చెబుతూనే ఉన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా అమరావతిలో స్థలాలు ఇచ్చేందుకు 900కు పైగా ఎకరాలతో ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ రాజధాని మాస్టర్ప్లాన్లో ప్రభుత్వం ఇటీవల అడ్డగోలుగా మార్పులు చేసింది. దాని కోసం సీఆర్డీఏ చట్టాన్నీ సవరించింది. చట్ట సవరణను సవాల్ చేస్తూ దాఖలైన కేసు కోర్టులో విచారణలో ఉండగానే, ప్రభుత్వం మాస్టర్ప్లాన్లో మార్పులు చేసేసింది.
నేడు ప్రత్యేక కార్యక్రమాలు
తుళ్లూరు, న్యూస్టుడే: అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా ‘దగా పడ్డ రైతులు, దోపిడీకి గురవుతున్న ఆంధ్రా పౌరులు’ అనే పేరుతో శుక్రవారం మందడం శిబిరంలో అమరావతి ఐకాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఉదయం 9 నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఉద్యమకారులతో ప్రత్యేక సదస్సు నిర్వహించడానికి ఐకాస శ్రీకారం చుట్టింది. వివిధ పార్టీల నేతలను ఆహ్వానించినట్లు ఐకాస నాయకులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి