లాం.. సలాం
స్వాతంత్య్రానికి పూర్వమే వ్యవసాయ పరిశోధన కోసం ఏర్పాటైన తొలి సంస్థ లాంఫామ్. వర్షాధార ప్రాంతాల్లో అత్తెసరు దిగుబడులతో నెట్టుకొస్తున్న అన్నదాతలకు ఆసరాగా నిలిచింది.
వందేళ్లుగా రైతుల సేవలో పరిశోధన కేంద్రం
ఈనాడు, అమరావతి: స్వాతంత్య్రానికి పూర్వమే వ్యవసాయ పరిశోధన కోసం ఏర్పాటైన తొలి సంస్థ లాంఫామ్. వర్షాధార ప్రాంతాల్లో అత్తెసరు దిగుబడులతో నెట్టుకొస్తున్న అన్నదాతలకు ఆసరాగా నిలిచింది. చిరుధాన్యాల దిగుబడుల పెంపు ప్రయోగాలతో మొదలై పశు పరిశోధన, ఆహార, వాణిజ్య పంటల పరిశోధనలకు చుక్కానిలా నిలిచింది. మెరుగైన వ్యవసాయ విధానాలు, కొత్తరకం వంగడాల ఆవిష్కరణలకు జాతీయస్థాయిలో వేదికగా మారింది. బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటై.. నేటికీ సాగుఫలాలకు ఊతమిస్తున్న గుంటూరు లాంఫామ్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం వంద వసంతాలు పూర్తిచేసుకుంది. నేడు శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న వేళ ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.
గుంటూరు-అమరావతి ప్రధానమార్గంలో లాంఫామ్ ఉంది. 2వేల ఏళ్ల క్రితం బౌద్ధ భిక్షువులు నివసించిన ప్రాంతం కావడంతో ఈ గ్రామానికి లాం అనే పేరు వచ్చింది. పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో వాడుకలో లాంఫామ్గా స్థిరపడింది. 1922లో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం పేరిట 300 ఎకరాల విస్తీర్ణంలో బ్రిటిష్ పాలకులు దీన్ని ఏర్పాటుచేశారు. మొదట్లో మెట్ట పంటలకు ఈ కేంద్రం ఆసరాగా నిలిచింది. నాటి నుంచి స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు, పశుపోషణ ప్రయోగాలకు కేంద్రమైంది. 1964-65లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తయి సాగునీరు అందుబాటులోకి వచ్చాక పంటల సరళి మారింది. దీంతో చిరుధాన్యాల నుంచి పొగాకు, అపరాలు, మిరప, పత్తి తదితర పంటలపై ఇక్కడ పరిశోధనలు జరిగాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి, ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతుల వ్యవసాయ అవసరాలకు అనువైన పరిశోధనలు జరిగాయి. ఒంగోలు జాతి పశువుల పరిరక్షణ, అభివృద్ధిపైనా ఈ కేంద్రం పనిచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యాక లాంఫామ్ను దాని పరిధిలోకి తెచ్చారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఉన్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర విభజన అనంతరం లాంఫామ్ పరిశోధన కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటుచేశారు.
నూతన వంగడాలకు ప్రాణప్రతిష్ఠ
లాంఫామ్లో వందేళ్లలో జరిగిన పరిశోధనలు ఎన్నో కొత్త వంగడాలకు పురుడు పోశాయి. వరిలో జాతీయస్థాయిలో పేరుగాంచిన సాంబమసూరి, స్వర్ణ రకాలు ఇక్కడివే. దేశంలో మూడోవంతు సాగయ్యే వరి రకాలు మనవేనని శాస్త్రవేత్తలు ఘనంగా చెబుతున్నారు. మిరపలో గుంటూరు సన్నాలు, 334 పేరుతో వచ్చిన వంగడాలు రైతుల ఆదరణ పొందాయి. పత్తిలో దేశీ కాటన్, ఎంసీయూ-5, కందిలో ఎల్ఆర్జీ-30, 41, 52 రకాలు, మినుములో ఎల్బీజీ-17, 752, పెసరలో ఎల్జీజీ-460 బాగా సాగులోకి వచ్చాయి. పత్తిలో కాండానికి మందు పూత ప్రయోగం ఇక్కడే జరిగింది. వరిలో వెదపద్ధతి విధానాన్ని ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టి ఫలితాలు సాధించి విస్తృతం చేశారు. వరి మాగాణుల్లో పెసర, మినుము పంటలను రెండోపంటగా సాగులోకి తీసుకొచ్చిన పరిజ్ఞానం ఇక్కడ విజయవంతమై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకూ విస్తరించింది. వివిధ పంటల్లో 76 రకాల విత్తనాలను ఈ పరిశోధన కేంద్రం నుంచి విడుదల చేశారు. తాజాగా కిసాన్ డ్రోన్ శిక్షణకు డీజీసీఏ నుంచి అనుమతి పొందిన ఏకైక కేంద్రంగా లాం గుర్తింపు పొందింది. డిజిటల్ వ్యవసాయ కార్యకలాపాలూ ఇక్కడ ప్రారంభమయ్యాయి.
రైతులకు వరం
వర్షాధార ప్రాంతాలుగా ఉన్న గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో వ్యవసాయ ముఖచిత్రం మారడానికి లాం పరిశోధన స్థానం ఎంతగానో దోహదపడింది. కేవలం వర్షాలపై ఆధారపడి జొన్న, సజ్జ, రాగుల్లాంటి చిరుధాన్యాలను పండిస్తున్న పరిస్థితి నుంచి వరి, అపరాల వంటి ఆహార పంటలు, మిరప, పత్తి వంటి వాణిజ్య పంటలు సాగుచేసే స్థాయికి రైతులు ఎదిగారు. ఇక్కడి పరిశోధనల కారణంగా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయంలో బలమైన పునాదులు వేయడంలో లాంఫామ్ తనదైన ముద్ర వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు