Seediri Appalaraju: మంత్రి అప్పలరాజుకు సీఎంఓ పిలుపు
ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి పిలుపు అందడంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం నుంచి హడావుడిగా బయల్దేరి శుక్రవారం ఉదయమే విజయవాడకు చేరుకున్నారు.
ఒకేరోజు రెండుసార్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిన మంత్రి
కేబినెట్లో ఉన్నా లేకపోయినా నేను మంత్రినే
మార్పుల గురించి నాకు సమాచారం లేదు: అప్పలరాజు
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి పిలుపు అందడంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం నుంచి హడావుడిగా బయల్దేరి శుక్రవారం ఉదయమే విజయవాడకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం మరోసారి సీఎంఓకు వెళ్లివచ్చారు. ఆయన వెంట పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ కూడా వెళ్లినట్లు తెలిసింది. పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకుడు డాక్టర్ అచ్చెన్న హత్యపై చర్చించేందుకు తాను సీఎంఓకు వెళ్లినట్లు మంత్రి అప్పలరాజు చెప్పారు. దళిత అధికారి అయిన అచ్చెన్న హత్య, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంపై ఆ శాఖ ఉద్యోగులు, దళిత ఉద్యోగసంఘాల ప్రతినిధులు, ఎమ్మార్పీఎస్, కులవివక్ష వ్యతిరేక పోరాటసమితి వంటి సంస్థలు, అఖిలపక్షాలు ఆందోళనలకు దిగాయి. ఈ కేసులో అసలు దోషి పశుసంవర్ధక శాఖలో ఉన్నతాధికారి అని, ఆయన్ను సస్పెండ్ చేసి అరెస్టు చేయాలంటూ అ శాఖ డైరెక్టరేట్ను ఉద్యోగులు శుక్రవారం ముట్టడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇరుకున పడింది. అందువల్లే ఈ కేసుపై సీఎంఓ జోక్యం చేసుకుని మంత్రిని పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. అచ్చెన్న హత్యకు దారితీసిన అంశాలేంటి? శాఖాపరంగా ఉద్యోగుల అభిప్రాయం ఏంటి? మంత్రిగా ఆయన దృష్టికి వచ్చిన ఇలాంటి విషయాలు ఇంకేమైనా ఉన్నాయా... వంటి పలు అంశాలపై అప్పలరాజు నుంచి సీఎంఓ అధికారులు వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఒక ఉన్నతాధికారి చుట్టూ కేసు ఎందుకు తిరుగుతోందనే అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం.
మంత్రివర్గంలో మార్పుల చేర్పుల నేపథ్యంలోనే: మంత్రి అప్పలరాజును హడావుడిగా సీఎంఓకు పిలిపించడంతో.. మంత్రిమండలిలో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయని శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగింది. మరోవైపు శాసనసభాపతి తమ్మినేని సీతారాం సైతం సీఎం జగన్ను శుక్రవారం మధ్యాహ్నం కలిశారు. దీంతో అప్పలరాజు బయటకు, సీతారాం మంత్రిమండలిలోకి అని కూడా ప్రచారం జరిగింది.
జగన్ దృష్టిలో అందరూ మంత్రులే
‘మంత్రివర్గంలో ఉన్నా, లేకపోయినా నేను మంత్రినే. ఎందుకంటే మాకున్న 151మంది ఎమ్మెల్యేలు, మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యులంతా సీఎం జగన్ దృష్టిలో మంత్రులే’ అని మంత్రి అప్పలరాజు అన్నారు. విజయవాడలో ఆయన్ను మీడియా ప్రతినిధులు కలిసి అడగ్గా మంత్రి స్పందిస్తూ.. ‘నన్నేదో సీఎంఓ పిలిపించింది, మంత్రివర్గంలో మార్పులు చేస్తున్నారంటూ టీవీల్లోనే చూశాను. సీఎం నన్ను మంత్రిపదవి నుంచి మార్చినా నాకేమీ ఇబ్బంది లేదు. పదవి లేకపోయినా నేనేమీ బాధపడను. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు ఏదైనా మంచి జరగాలంటే ఈ ప్రభుత్వం నాలుగు కాలాలు ఉండాలని నమ్మేవాడిని. జగన్ నాలుగైదుసార్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని స్థాపించగలమని నమ్మే వ్యక్తిని నేను’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
హామీలకు శిలువ!
గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్. దాన్ని బైబిల్తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్ వంచించారు. -
అక్రమాల కిరణం!
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్