ఇసుక వ్యాపారం పారదర్శకమేనట!
‘డిపాజిట్ సొమ్ము వెనక్కి ఇవ్వకపోవడంతో ఒత్తిడికి గురై కొవ్వూరుకు చెందిన ఇసుక వ్యాపారి ప్రేమ్రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన సన్నిహితులు, కుటుంబీకులు ఎందుకు చెబుతున్నారు?
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే దుష్ప్రచారమట
‘ఈనాడు’ కథనంపై వివరణ ఇచ్చేందుకు గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి ఆపసోపాలు
కళ్ల ముందే ఇసుక దోపిడీ కనిపిస్తున్నా కప్పిపుచ్చే యత్నం
ఈనాడు - అమరావతి: ‘డిపాజిట్ సొమ్ము వెనక్కి ఇవ్వకపోవడంతో ఒత్తిడికి గురై కొవ్వూరుకు చెందిన ఇసుక వ్యాపారి ప్రేమ్రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన సన్నిహితులు, కుటుంబీకులు ఎందుకు చెబుతున్నారు?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జేపీ సంస్థకు వ్యతిరేకంగా ఎన్జీటీలో తనతో కేసు వేయించిన అధికార పార్టీ ఎమ్మెల్యేయే, ఇప్పుడు ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ అమరావతి మండలం ధరణికోటకు చెందిన నాగేంద్రకుమార్ చేసిన బహిరంగ ఆరోపణలపై గనులశాఖ ఎందుకు స్పందించలేదు?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక వ్యాపారం విషయంలో అధికార పార్టీ నేతల్లో రచ్చ జరిగింది వాస్తవం కాదా?
జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల నుంచి నిత్యం ఇసుక లారీలు హైదరాబాద్కు పరుగులు పెడుతుండటం అబద్ధమా?
రీచ్ల్లో ముద్రిత బిల్లులు ఇస్తూ, కేవలం నగదు మాత్రమే తీసుకోవడంలో ఆంతర్యమేంటి? ఆ సొమ్ము ఎక్కడికి చేరుతోందో అధికారులకు తెలియదా?’..
కానీ ఇవేమీ నిజాలు కాదన్నట్లు గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి వితండవాదన వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక వ్యాపారంలో దోపిడీని కళ్లకు కట్టినట్లు ‘ఈనాడు’లో ప్రచురించారని ఇసుక వ్యాపారులు, రవాణాదారులు చెబుతుంటే.. గనులశాఖ సంచాలకులు మాత్రం అసత్యాలు రాశారని, ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఇసుక పాలసీ అమలు చేస్తోందంటూ పాతపాటే వినిపించారు. ‘దాచుకో.. పంచుకో.. తినుకో’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం ప్రచురితమైన కథనంపై గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డి ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు.
వాస్తవాలను వక్రీకరించారు: సంచాలకులు
‘వాస్తవాలు వక్రీకరించారు. గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంతో ప్రజలను దోచుకుంది. సీఎం జగన్ కొత్త ఇసుక విధానం తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా టెండర్లు నిర్వహించి, ఎంపిక చేసిన జేపీ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ సంస్థ ఎంత ఇసుక తవ్విందో, విక్రయించిందో గనులశాఖకు నివేదిస్తుంది. రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక వెళ్లకుండా గనులశాఖ ప్రాంతీయ స్క్వాడ్, సెబ్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇంత పకడ్బందీగా ఇసుక విధానం ఉంటే, ప్రభుత్వంపై బురదచల్లే ఉద్దేశంతోనే కథనాలు రాస్తున్నారు. అధికార పార్టీ నేతలు సిండికేట్లుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఎలా ఆరోపిస్తారు? ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలతో రూ.765 కోట్లు రెవెన్యూ వస్తుంటే.. రూ.1,800 కోట్లు ఆదాయం వస్తుందని ఎలా చెబుతారు? జిల్లాల వారీగా రేట్లు ఖరారు చేసి, అధికార పార్టీ నేతలకు ఇచ్చారని, వారికి లక్ష్యాలు విధించి ముఖ్యనేతలు రూ.కోట్లలో వసూలు చేస్తున్నారనేదానికి అర్థం ఉందా?’ అని వెంకటరెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవన్నీ నిజాలు కదా?
* ప్రతి జిల్లాలో అధికార పార్టీ నేతలు, ఇసుక వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేస్తున్నది అబద్ధమా? అలాగైతే ఈ కథనం తప్పని, మా పర్యవేక్షణలో ఉప గుత్తేదారు టర్న్కీ ద్వారా మాత్రమే ఇసుక వ్యాపారం కొనసాగుతోందని ప్రధాన గుత్తేదారైన జేపీ సంస్థ ఎందుకు చెప్పలేదు? ఇసుకపై కథనం ప్రచురించిన ప్రతిసారి దాన్ని ఖండిస్తూ గనులశాఖ సంచాలకులు ప్రకటన జారీ చేయడమే తప్ప, జేపీ సంస్థ ఎందుకు స్పందించదు?
* కొవ్వూరుకు చెందిన ప్రేమ్రాజ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక వ్యాపారం కోసం రూ.25 కోట్లు డిపాజిట్ చేశారని, నెలకు రూ.21 కోట్లు చొప్పున చెల్లించాల్సి ఉండగా నష్టపోయారని, ఆయనకు చెందిన రూ.16 కోట్లు ఇవ్వకుండా ఆపేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు, సన్నిహితులు చెప్పింది వాస్తవం కాదా? మార్చి 20న దీనిపై పత్రికల్లో వచ్చినా సమగ్ర విచారణకు ఎందుకు ఆదేశించలేదు?
* ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం భారీగా సాగుతోందంటూ, గతంలో ఆయనతో సన్నిహితంగా ఉన్నవారే బహిరంగంగా విలేకరుల సమావేశం పెట్టి చెబుతుంటే.. అది అభూత కల్పన ఎలా అవుతుంది? ఆ ఆరోపణలు తప్పంటూ అక్కడి గనుల శాఖ అధికారులు, జేపీ సంస్థ ఎందుకు స్పందించలేదు?
* ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొన్నటి వరకు ఇసుక వ్యాపారం నిర్వహించిన ఓ ప్రజాప్రతినిధిని, ఆయన తండ్రిని నందిగామ మండల వైకాపా అధ్యక్షుడు ఇసుక తవ్వకాల్లో గొడవ కారణంగా దుర్భాషలాడిన వీడియో బయటకు రాలేదా? ఆయనతో పార్టీ పదవికి రాజీనామా చేయిస్తే.. మళ్లీ ఆ పార్టీ నియోజకవర్గ నేతలతోనే కలిసి తిరుగుతుండటం వాస్తవం కాదా?
* ఉమ్మడి కడప జిల్లాలో ఓ కార్పొరేషన్ ఛైర్మన్ సోదరుడు, అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాలో కొందరు.. ఇలా ప్రతి జిల్లాలో సిండికేట్లుగా ఏర్పడి ప్రతి నెలా రీచ్ల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తూ ఇసుక వ్యాపారం చేయడం నిజం కాదా?
ఆన్లైన్ బిల్లులపై డైరెక్టర్ స్పందించరే?
రాష్ట్రంలో ఇసుక దందాపై ‘ఈనాడు’లో కథనం వచ్చిన ప్రతిసారి గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించి, వివరణ ఇస్తుంటారు. మంత్రి తరహాలో అనేక అంశాలను ప్రస్తావిస్తుంటారు. కానీ ఇసుక విక్రయాలకు ఆన్లైన్ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు? డిజిటల్ చెల్లింపులు స్వీకరించకుండా నగదు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారో మాత్రం చెప్పరు.
* జేపీ సంస్థ 2021 మే 14 నుంచి ఇసుక వ్యాపారం చేపట్టింది. దానిపేరిట టర్న్కీ ఉపగుత్తేదారుగా విక్రయాలు చేస్తోంది. మరో నెలన్నరలో జేపీ సంస్థతో చేసుకున్న రెండేళ్ల ఒప్పందం పూర్తికానుంది. అయినా ఇంతకాలం జేపీ సంస్థ ఆన్లైన్ వేబిల్లులు జారీ చేయకుండా, ముద్రిత బిల్లులే ఎందుకిస్తోంది? పారదర్శకంగా ఆన్లైన్ బిల్లులు ఇవ్వడానికి గనులశాఖ సాఫ్ట్వేర్ రూపొందించినా దాన్ని ఎందుకు పక్కనపెట్టారో వెంకటరెడ్డి ఏనాడూ చెప్పరు.
* నిత్యం రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నా నగదు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు? ఆన్లైన్, డిజిటల్ చెల్లింపులను రీచ్ల్లో ఎందుకు తీసుకోవడం లేదో? సంచాలకులు ఏనాడూ వివరణ ఇవ్వరు.
* రీచ్లు వారీగా వసూలైన సొమ్మును.. జిల్లా స్థాయిలో సిండికేట్లకు, అక్కడి నుంచి రాష్ట్రస్థాయిలో ముఖ్యులకు చేర్చేందుకే కేవలం నగదు తీసుకుంటారనే ఆరోపణ వాస్తవం కాదా? అలాగైతే ఆన్లైన్ చెల్లింపులు స్వీకరించవచ్చు కదా?
మధ్యలో రెండు సంస్థలు ఎందుకొచ్చాయి?
నిరుడు ఆగస్టులో ఉపగుత్తేదారుగా ఉన్న టర్న్కీని హఠాత్తుగా పంపేశాక బ్రాక్స్టన్ ఇన్ఫ్రా, కేకేఆర్ ఇన్ఫ్రా అనే సంస్థలను రెండు నెలల వ్యవధిలో ఉపగుత్తేదారులుగా చూపలేదా? టర్న్కీ తర్వాత ఇతర సంస్థలను ఉపగుత్తేదారులుగా నియమించుకోలేదని జేపీ సంస్థ గనులశాఖకు లేఖలు ఎందుకు రాసిందో సంచాలకులే చెప్పాలి. రెండు నెలల తర్వాత టర్న్కీ మళ్లీ ఎందుకు వచ్చిందో ఆ సంస్థతో అయినా వివరణ ఇప్పించగలరా?
సంచాలకులు రీచ్కి వెళితే నిజాలు తెలుస్తాయి
ఇసుక కథనాలపై ఇంతలా స్పందించే గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డి ఆకస్మికంగా వెళ్లి ఏదైనా రీచ్లో పరిశీలిస్తే.. అక్కడ టర్న్కీ బదులు, అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో అడ్డగోలుగా సాగుతున్న ఇసుక వ్యాపారమంతా కళ్లకు కడుతుంది. కానీ ఆయన ఎప్పుడూ రీచ్ల్లో తనిఖీలు చేసిన దాఖాలాలే లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా