Vande Bharat Express: సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ షెడ్యూల్ ఇదే..
సికింద్రాబాద్- తిరుపతి- సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు పూర్తి సమాచారాన్ని ద.మ.రైల్వే ప్రకటించింది.
రాష్ట్రంలో గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో ఆగనున్న రైలు
తిరుపతి(రైల్వే), న్యూస్టుడే: సికింద్రాబాద్- తిరుపతి- సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు పూర్తి సమాచారాన్ని ద.మ.రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే ఈ రైలును ఈనెల 8న ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్లో ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో రైలు నంబర్లు, సమయాలు, నిలిచే స్టేషన్ల వివరాలను ద.మ.రైల్వే విడుదల చేసింది.
సికింద్రాబాద్- తిరుపతి (20701) రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉదయం 6 గంటలకు బయలుదేరి నల్గొండ(07:19), గుంటూరు(9:45), ఒంగోలు(11:09), నెల్లూరు(12:29) మీదుగా తిరుపతికి మధ్యాహ్నం 2:30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుపతి- సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరి నెల్లూరు (5:20), ఒంగోలు (6:30), గుంటూరు (7:45), నల్గొండ (10:10) మీదుగా సికింద్రాబాద్కు రాత్రి 11:45 గంటలకు చేరుకోనుంది. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు రైలు నడవనుంది. తిరుపతి-సికింద్రాబాద్ రైలు ఈ నెల 9న ప్రారంభమవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు ధర్మాసనం నిరాకరణ
-
India News
Sharad Pawar: శరద్ పవార్ను బెదిరిస్తూ.. సుప్రియా సూలేకు వాట్సప్ మెసేజ్
-
Politics News
Ponguleti Srinivasa Reddy: త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తా: పొంగులేటి
-
Crime News
Crime News: శంషాబాద్లో చంపి.. సరూర్నగర్ మ్యాన్హోల్లో పడేశాడు..
-
Crime News
‘ఆమెది ఆత్మహత్య.. శ్రద్ధా ఘటన స్ఫూర్తితో ముక్కలు చేశా’: ముంబయి హత్య కేసులో ట్విస్ట్
-
Sports News
WTC Final: భారత్ గోల్డెన్ అవర్ను చేజార్చుకొంది: పాంటింగ్