నిరసన తెలపడానికే రాయి విసిరారు..
భాజపా నేత సత్యకుమార్ కాన్వాయ్పై శుక్రవారం గుంటూరు జిల్లా తుళ్లూరు సమీపంలో జరిగిన దాడి సంఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.
సత్యకుమార్పై దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసులు
నిఘా విభాగం సమాచారం మేరకే బందోబస్తు ఏర్పాట్లు
గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడి
ఈనాడు, అమరావతి-గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే: భాజపా నేత సత్యకుమార్ కాన్వాయ్పై శుక్రవారం గుంటూరు జిల్లా తుళ్లూరు సమీపంలో జరిగిన దాడి సంఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి వెళుతున్న సత్యకుమార్, ఇతర నేతలు.. మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటుచేసిన శిబిరం వద్దకు చేరుకునేసరికి దాడి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భాజపా వారి కాన్వాయ్పై రాయితో దాడి చేసిన నితిన్ను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. సత్యకుమార్పై దాడి చేయాలనే ఉద్దేశంతో కాకుండా నిరసన తెలపాలని అతడు రాయి విసిరాడని తెలిపారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. సీఎంను దూషించిన కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఏఎస్పీ అనిల్ మాట్లాడారు. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు వైరల్ కావడంతో మూడు రాజధానుల శిబిరం వద్ద ఉత్కంఠ నెలకొన్నట్లు సమాచారం వచ్చిందని.. తాను, డీఎస్పీ పోతురాజు, పోలీసులు అక్కడికి చేరుకున్నామని తెలిపారు. అప్పటికే అక్కడికి వస్తున్న భాజపావారి వాహనాల ఎదురుగా రోడ్డుపైకి వచ్చి మూడు రాజధానుల శిబిరంలోని వారు బైఠాయించారని తెలిపారు. అప్పుడు జైఅమరావతి అన్న నినాదాలు వినిపించడంతో మూడు రాజధానులవారు స్పందించారని, దీంతో తోపులాట చోటుచేసుకుందని వివరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు రక్షణతో భాజపా నాయకులున్న కాన్వాయ్ను పంపించామన్నారు. ఇంతలో గుర్తుతెలియని వ్యక్తి కాన్వాయ్లోని చివరి వాహనంపై రాయి విసిరారని, ఆయన్ను నితిన్గా గుర్తించామని తెలిపారు. దాడికి గురయిన కారులో సత్యకుమార్ లేరని వివరించారు. కాన్వాయ్లో భాజపా నేత సత్యకుమార్ ఉన్నట్లు తమకు తెలియదని అన్నారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు పోలీసు ఉన్నతాధికారులు సమాధానమిచ్చారు. భాజపా కార్యకర్త, చొక్కా చిరిగిన సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్పీ తెలిపారు. బాపట్ల ఎంపీపై ఫిర్యాదు చేయలేదని, వైకాపా వాళ్లని పేర్కొన్నారని తెలిపారు. వైకాపాతో సంబంధం లేకుండా సంఘటనలో ఎంతమంది పాత్ర ఉంటే అందరిపైనా చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. ఈ దాడికి జగన్ పథక రచనతో పాటు పోలీసుల సహకారమూ ఉందన్న సత్యకుమార్ ఆరోపణలపై ఏఎస్పీ స్పందించారు. పోలీసులెలా సంరక్షించి కాన్వాయ్లో పంపించారనేది అన్ని మీడియాల్లో చూశారని వెల్లడించారు. దాడి చేయాలని మూడు రాజధానుల శిబిరం వారు పథకం రూపొందించుకున్నారా? అని ప్రశ్నించగా.. ఇది విచారణలో తేలుతుందని, తమ ఆలోచన హైకోర్టుకు వెళ్లే మార్గంలో ఎలాంటి సంఘటనలు జరగకూడదేనని వెల్లడించారు. ముందుగానే మూడు రాజధానుల శిబిరంలోని వారిని పంపించేస్తే ఈ సంఘటన జరిగేది కాదు కదా? అన్న విలేకరుల ప్రశ్నకు డీఎస్పీ పోతురాజు సమాధానమిచ్చారు. ‘భాజపావాళ్లు ముందు మందడం శిబిరానికి వెళ్లారు. అక్కడినుంచి తుళ్లూరు మీదుగా ఆదినారాయణరెడ్డితో పాటు ఇతరుల వాహనాలు వెళ్లిపోయాయి. తుళ్లూరులో భాజపా కార్యకర్తను పరామర్శించడానికి సత్యకుమార్ వెళ్లి అక్కడినుంచి విజయవాడ వెళ్లటానికి రివర్స్లో సీడ్యాక్సెస్ రోడ్డు వైపు వచ్చారు. కాన్వాయ్ వెనక్కురావడంతో మా సిబ్బందినుంచి సమాచారం రాగానే వెళ్లేప్పటికి ఈ సంఘటన చోటుచేసుకుంది’ అని వివరించారు. భాజపా జాతీయస్థాయి నాయకుల పర్యటన సమయంలో నిఘా విభాగమిచ్చే సమాచారంబట్టే బందోబస్తు ఏర్పాటు చేశామని, కాకపోతే వాళ్లు మార్గం మార్చుకోవడంతో ఇలా జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై మధ్యాహ్నం ఫిర్యాదు రావడంతో తొలుత కేసు నమోదు చేశామని, ఆ తర్వాతి పరిణామాలపై తదనుగుణంగా చర్యలు తీసుకున్నామని డీఎస్పీ వివరించారు. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యల వీడియోలను మీకు పంపుతానని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘మూడు రాజధానుల శిబిరం మీదుగా మేము వెళ్లేటప్పుడు ఎవరూ లేరు? మళ్లీ అటుగా వస్తున్నామని తెలుసుకొని దాడికి వచ్చారని భాజపావారు ఆరోపిస్తున్నారని ప్రశ్నించగా.. అది వాస్తవం కాదని, సీసీ కెమెరాలున్నాయని.. కావాలంటే ఫుటేజీలు పరిశీలించుకోవచ్చని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు