ఏడాదిలో 3%లోపు పనులే
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు 2.86% పనులే చేసినట్లు అధికారిక గణాంకాలే పేర్కొంటున్నాయి.
ఇలా అయితే... ఎప్పటికీ పోల‘వరం’?
కేంద్రం నుంచి నిధులు సాధించలేని పరిస్థితి
ఈనాడు - అమరావతి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు 2.86% పనులే చేసినట్లు అధికారిక గణాంకాలే పేర్కొంటున్నాయి. ప్రాజెక్టును మార్చి ప్రారంభంలో డ్యాం డిజైన్ రివ్యూకమిటీ (డీడీఆర్సీ) నిపుణులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు, కేంద్ర జలసంఘం అధికారులు సందర్శించారు. కీలకాంశాలపై సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అధికారులు ఏడాది కాలంలో జరిగిన పనులపై నివేదిక ఇచ్చారు. ఆ గణాంకాల ప్రకారమే ఇక్కడ పనులు అంతంతమాత్రంగా జరిగాయని తేటతెల్లమవుతోంది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు కల సాకారమయ్యేది ఎప్పటికన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతీ లేదు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రివర్స్ టెండర్ల పేరుతో మళ్లీ టెండర్లు పిలిచారు. మేఘా ఇంజినీరింగు సంస్థ ఈ పనులు చేపట్టింది. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ప్రధాన డ్యాం నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఎడమ కాలువ పనులకు, పునరావాస పనులకు వేర్వేరు గుత్తేదారులున్నారు. పనులు ఆలస్యం కావడానికి కొన్నాళ్లు కరోనా, తర్వాత వేరే కారణాలు చెప్పారు. నిర్మాణంతో సంబంధం లేని పునరావాసం పనులూ పూర్తి చేయడం లేదు. ఎడమ కాలువ పనులూ ముందుకు సాగడం లేదు. ప్రధాన డ్యాంతో అనుబంధంగా ఉన్న అనుసంధాన పనులూ అంతంతమాత్రంగా ఉన్నాయి. డయాఫ్రం వాల్ భవితవ్యం తేల్చి ఆ పనులు పూర్తిచేసేవరకూ ఒక ప్రధాన డ్యాం నిర్మాణం ప్రారంభించడంలో ఆలస్యం కావడానికి అంతో ఇంతో కారణం ఉందేమో తప్ప.. కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, అనుబంధ పనులు, పునరావాస పనుల పూర్తికి ఏ ఇబ్బందులూ లేకపోయినా పోలవరం ముందుకు సాగడం లేదు.
ప్రధాని నరేంద్రమోదీతో తనకు రాజకీయాలకు అతీతమైన బంధముందని సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. ఎన్నోసార్లు దిల్లీ వెళ్తూ.. పోలవరం నిధుల కోసం ప్రతిసారీ అడుగుతూనే ఉన్నామంటున్నారు. 22 మంది లోక్సభ సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో ఒకానొక దశలో వైకాపా మద్దతు లేకపోతే గట్టెక్కలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర ఎంపీల అవసరం కేంద్రానికి ఏర్పడ్డ సందర్భంలోనూ సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేరిన దాఖలాలు లేవు. ఒకవైపు పోలవరంపై రాష్ట్రం ఖర్చుచేసిన దాదాపు రూ.2,600 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాలి. ఆ నిధుల్లో తాజాగా రూ.826 కోట్లే వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.1,671 కోట్లే వచ్చాయి. కేంద్రం నియమించిన రివైజ్డు కాస్ట్కమిటీ ఆమోదించిన ప్రకారం ప్రాజెక్టుకు రూ.47,725 కోట్లు అవసరం. విద్యుత్ కేంద్రం నిధులు, ఇంతవరకు కేంద్రం ఇచ్చిన నిధులు మినహాయిస్తే, ఇంతవరకు కేంద్రం ఇచ్చిన నిధులూ మినహాయిస్తే ఇంకా మరో రూ.25 వేల కోట్లకు పైగా నిధులు కేంద్రం నుంచి రావాలి. ఇలా ఏడాదికి కేంద్రం నుంచి సగటున రూ.1,600 కోట్లే వస్తుంటే.. ఇక ఎప్పటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే అంచనాలు ఏ స్థాయిలో పెరిగి మరింత భారంగా మారతాయనే అంశమూ చర్చనీయాంశమవుతోంది.
గడచిన ఆర్థిక సంవత్సరంలో..
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు తాజాగా గణాంకాలు తయారుచేశారు. వైఎస్ హయాంతో పాటు ఆ తర్వాత 2014 జూన్ వరకు ఎంతమేర పోలవరం పనులు జరిగాయో, ఆ పై చంద్రబాబు హయాంలో ఎంతమేర పనులు జరిగాయో.. జగన్ ప్రభుత్వంలో 2023 జనవరి వరకు ఎంత పని జరిగిందో లెక్కలు తయారుచేశారు. ఆ రకంగా చూసినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంతో పోలిస్తే జగన్ ప్రభుత్వ హయాంలోనే పనులు చాలా మందకొడిగా ఉన్నాయని ఆ గణాంకాలు తెలియజేస్తున్నాయి. తాజాగా 2022 మార్చి నెలాఖరు నుంచి 2023 ఫిబ్రవరి నెలాఖరు వరకు పోలవరంలో పురోగతిని జలవనరులశాఖ అధికారులే లెక్కించారు. ఆ ప్రకారం కొన్నిచోట్ల పనులే ముందుకు కదల్లేదని అవగతమవుతోంది.
* సీఎం జగన్ గతేడాది వరదల సమయంలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. తొలిదశ పునరావాసం సెప్టెంబరు, అక్టోబరు కల్లా పూర్తి చేస్తామన్నారు. ఈ సంవత్సరంలో భూసేకరణ, పునరావాసంలో జరిగిన పని పురోగతి 1.97% మాత్రమే. ఇంకా తొలిదశ నిర్వాసితులను అనేక మందిని ఇంకా తరలించనేలేదు. సీఎం హామీ నెరవేరలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.