Puttaparthi: అట్టుడికిన పుట్టపర్తి
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెదేపా నాయకుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి పరస్పర విమర్శలతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తల దాడి
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వాహనం ధ్వంసం
పరస్పర సవాళ్లతో వివాదం
తెదేపా నాయకుల గృహనిర్బంధం
నిర్బంధించినా.. పరామర్శ పేరుతో బయటకు వచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి
పుట్టపర్తి - న్యూస్టుడే
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెదేపా నాయకుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి పరస్పర విమర్శలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు తెదేపా శ్రేణులపై రాళ్లు, చెప్పులతో దాడికి దిగడంతో ఓ దశలో రణరంగమైంది. యువగళం పాదయాత్రలో భాగంగా ఇటీవల పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించిన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. పుట్టపర్తిని ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు రావాలని సవాలు విసిరారు. దీనికి రఘునాథరెడ్డి స్పందించి, చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పట్టణంలో పోలీసు-30 చట్టాన్ని అమలు చేశారు.
వైకాపా శ్రేణుల కవ్వింపు చర్యలు
అభివృద్ధిపై చర్చకు స్థానిక సత్యమ్మ ఆలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. శనివారం ఉదయం రఘునాథరెడ్డి తెదేపా కార్యాలయం నుంచి, ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి అక్కడికి బయల్దేరేందుకు సిద్ధంకాగా, ఇద్దరినీ పోలీసులు నిర్బంధించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు తెదేపా నాయకులను పుట్టపర్తికి చేరుకోకుండా గృహనిర్బంధం చేశారు. పట్టణంలోని ఎనుములపల్లిలో వైకాపా నాయకుడు ఒకరు చనిపోయారని, వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తానంటూ ఎమ్మెల్యే పోలీసులకు చెప్పి బయటకు వచ్చారు. ఆ సమయంలో పోలీసులు ఆయన వెంట ఉన్నారు. పరామర్శించాక ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయానికి వెళ్లకుండా, తెదేపా కార్యాలయం మీదుగా దారి మళ్లారు. కాన్వాయ్లో ఉన్న అనుచరులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ కవ్వించినప్పటికీ, పోలీసులు అడ్డుకోలేదు. వారంతా నేరుగా సమీపంలోని హనుమాన్ ఆలయంలోకి చేరుకున్నారు.
ఈ విషయం తెలుసుకొని, పార్టీ కార్యాలయంలో నిర్బంధంలో ఉన్న రఘునాథరెడ్డి భవనంపైకి ఎక్కి కార్యకర్తల సహాయంతో వెనుక భాగం నుంచి కిందకు దిగారు. వాహనంలో హనుమాన్ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ తన వాహనంపైకి ఎక్కారు. పుట్టపర్తి అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకున్నారు. వైకాపా కార్యకర్తలు తమ వెంట తెచ్చుకున్న కర్రలతో పల్లె వాహనాన్ని ధ్వంసం చేశారు. చెప్పులు, టెంకాయలు విసిరారు. రఘునాథరెడ్డిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పోలీసు స్టేషన్ తరలిస్తుండగా, ఆ వాహనాన్ని తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. వారిపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ తెదేపా కార్యకర్తలు ఠాణా ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆలయం నుంచి ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ర్యాలీగా తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయిన తర్వాతే పోలీసులు రఘునాథరెడ్డిని వదిలేశారు. స్టేషన్ నుంచి రఘునాథరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి మళ్లీ సత్యమ్మ ఆలయానికి చేరుకొని, అమ్మవారికి పూజలు చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ప్రమాణం చేశారు.
ఓటమి భయంతోనే వైకాపా దాడులు: చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: పుట్టపర్తిలో మాజీ మంత్రి రఘునాథరెడ్డి వాహనం, తెదేపా కార్యకర్తలపై దాడిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ‘వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం, ఒత్తిడితోనే వైకాపా రౌడీలు దాడులకు పాల్పడుతున్నారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులకు దిగడం సమాధానం కాబోదు’ అని శనివారం ట్వీట్ చేశారు. దాడులకు సంబంధించిన వీడియోను జత చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ‘సీఎం జగన్రెడ్డి అండతోనే వైకాపా రౌడీ మూకలు పేట్రేగిపోతున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రమైన పుట్టపర్తిని ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి అరాచకాలు, అక్రమాలకు నిలయంగా మార్చారు. తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి బడా కాంట్రాక్టర్లు, బిల్డర్ల వరకు ఎవరినీ వదలకుండా బెదిరించి కమీషన్లు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన రఘునాథరెడ్డి సవాలుకు భయపడి చర్చ నుంచి పారిపోయారు. వైకాపా గూండాలతో తెదేపా కార్యకర్తలపై దాడి చేయించారు. పోలీసులు దౌర్జన్యకారులను వదిలేసి బాధితులపైనే లాఠీఛార్జి చేయడం దారుణమ’ని మండిపడ్డారు.
30 యాక్ట్ ఉల్లంఘించిన వారిపై కేసులు
- యశ్వంత్, డీఎస్పీ, పుట్టపర్తి
పుట్టపర్తిలో శాంతి భద్రతలకు విఘాతం కలగరాదని పోలీసు 30 చట్టాన్ని విధించాం. దాన్ని ఉల్లంఘించి ఇరు పార్టీల వారు ఒకరిపై ఒకరు చెప్పులు, కొబ్బరికాయలు విసురుకున్నారు. వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు జీపు అద్దాలు ధ్వంసం చేశారు. వీడియోల ఆధారంగా ప్రతి ఒక్కరిపైనా కేసులు నమోదు చేసి, కఠినంగా వ్యవహరిస్తాం.
చర్చకు ఎప్పుడైనా సిద్ధమే..: శ్రీధర్రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే
నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సమస్యలు పరిష్కరించాం. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. నేను అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. తెదేపా వాళ్లే చర్చకు పిలిచి మా పార్టీ కార్యకర్తలతో గొడవకు దిగారు. వాళ్లే మా వాళ్లపై దాడులకు పాల్పడ్డారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు
- పల్లె రఘునాథరెడ్డి, మాజీ మంత్రి
ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తా. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. తెదేపా కార్యకర్తలపై మాత్రమే లాఠీఛార్జి చేశారు. వైకాపా వాళ్లు దాడులు చేస్తున్నా పట్టించుకోలేదు. వాస్తవాలను ప్రజలు చూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు. -
ఎన్నికల వేళ పురస్కారాల ఎత్తుగడ
పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని గత అయిదేళ్లుగా ప్రతిపక్ష నేతలు, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులతో తీవ్ర నిర్బంధాలు, అణిచివేత అమలుచేస్తున్న జగన్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఆ పోలీసులను తన గుప్పిట్లో ఉంచుకునేందుకు మరో ఎత్తుగడ వేసింది.