Viveka Murder Case: నెక్స్ట్ ఎవరు?.. పులివెందులలో సర్వత్రా కలకలం..
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పరిణామాలు ఆది నుంచి సంచలనం.. ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. హత్య కేసులో అరెస్టులు ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యుల వరకు రావని వారి బంధువులు, అనుచరులు గట్టి విశ్వాసంతోనే ఉన్నారు.
కడప, న్యూస్టుడే: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పరిణామాలు ఆది నుంచి సంచలనం.. ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. హత్య కేసులో అరెస్టులు ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యుల వరకు రావని వారి బంధువులు, అనుచరులు గట్టి విశ్వాసంతోనే ఉన్నారు. ఎంపీ అవినాష్రెడ్డి సైతం తన తండ్రిని అరెస్టు చేస్తారని ఊహించలేదని తెలిసింది. అయితే కొత్తగా ఏర్పాటైన సీబీఐ సిట్ బృందం వివేకా హత్య కేసులో దూకుడు పెంచింది. అనూహ్యంగా వైఎస్ భాస్కరరెడ్డిని ఆదివారం అరెస్టు చేసింది.
వివేకా హత్యతో సంబంధం ఉన్నవారిని ఒక్కొక్కరిగా అరెస్టులు చేస్తుండటంతో.. తరవాత వంతు ఎవరిదై ఉండొచ్చనే చర్చ సాగుతోంది. రెండు రోజుల క్రితం అవినాష్రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్కుమార్రెడ్డిని అరెస్టు చేయగా, తాజాగా ఎంపీ తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ దర్యాప్తు మొదలైన నాటి నుంచి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇటీవలే సుప్రీంకోర్టు వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంకెన్నాళ్లు చేస్తారంటూ సీబీఐపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 30 లోపు కేసు విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కొత్తగా ఏర్పాటైన సిట్ బృందం కేసుపై ఓ అవగాహనకు రాగానే ‘కీలక వ్యక్తుల’ పై దృష్టి పెట్టింది. ఆదివారం వేకువ జామునే పులివెందులకు వెళ్లి భాస్కరరెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకువెళ్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరుపరిచింది.
ఈ అరెస్టుకు నిరసనగా కడపలో చేపట్టిన శాంతియుత నిరసన ప్రదర్శనకు అధికార పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, నాయకులు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. కడపలో వైకాపాకు 49 మంది కార్పొరేటర్లు, అయిదుగురు కోఆప్షన్ సభ్యులున్నారు. కానీ ఆదివారం జరిగిన నిరసన ర్యాలీలో సుమారు 15 మంది కార్పొరేటర్లు మాత్రమే పాల్గొనడం గమనార్హం. మిగిలిన వారికి సమాచారం లేదా, సమయాభావం వల్ల రాలేకపోయారా అన్న ప్రశ్నలు వినిపించాయి. మిగిలిన పార్టీ క్యాడర్ సైతం పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమంలో పాల్గొనకపోవడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం