Army Recruitment: జూన్‌ 3 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతం బొల్లారంలోని 1ఈఎంఈ సెంటర్‌లో జూన్‌ 3వ తేదీ నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ(అగ్నివీర్‌) నిర్వహించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 20 Apr 2023 09:41 IST

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతం బొల్లారంలోని 1ఈఎంఈ సెంటర్‌లో జూన్‌ 3వ తేదీ నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ(అగ్నివీర్‌) నిర్వహించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినవారి కుమారులు, సైనికోద్యోగులు, మాజీ సైనికోద్యోగుల కుమారులు, మాజీ సైనికోద్యోగుల సొంత సోదరుల కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. అగ్నివీర్‌ టెక్నికల్‌ కేటగిరీ (ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, మోటార్‌ వెహికిల్‌ మెకానిక్‌, డీజిల్‌ మెకానిక్‌, రిఫ్రిజిరేషన్‌, ఎయిర్‌ కండీషనర్‌ మెకానిక్‌), అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌, స్టీవార్డ్‌లతోపాటు ఈత, వాలీబాల్‌ రంగాలకు సంబంధించిన క్రీడాకారులకు ఓపెన్‌ కేటగిరీలో ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు. అభ్యర్థులు పదిహేడున్నర నుంచి 21 ఏళ్ల వయస్కులై ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం బొల్లారం, 1ఈఎంఈ సెంటర్‌ హెడ్‌క్వార్టర్స్‌ను గానీ, www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో, 040-27863016 నంబర్లలో గానీ సంప్రదించాలని అధికారులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని