ISIS drug - Tramadol: నరసరావుపేటలో ‘ఐసిస్ డ్రగ్’ తయారీ!
ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్, బోకోహరామ్ వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే, ‘ఐసిస్ డ్రగ్’గా పేరొందిన ‘ట్రెమడాల్’ అనే సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ (మాదకద్రవ్యం)ను మాత్రల రూపంలో విదేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యవహారంలో పల్నాడు జిల్లా నరసరావుపేటకు సమీపంలోని సేఫ్ ఫార్ములేషన్స్ ఔషధ కంపెనీ యజమాని శనగల శ్రీధర్రెడ్డిని ముంబయి కస్టమ్స్ అధికారులు ఇటీవల అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
సేఫ్ ఫార్ములేషన్ కంపెనీలో ట్రెమడాల్ మాత్రల ఉత్పత్తి
కాల్షియం మాత్రల పేరుతో ఎగుమతి
పట్టుకున్న ముంబయి కస్టమ్స్ అధికారులు
అనుమతుల్లేకుండా విదేశాలకు ఎగుమతి చేస్తున్న బెంగళూరు సంస్థ
సేఫ్ ఫార్ములేషన్ కంపెనీ డైరెక్టర్ శనగల శ్రీధర్రెడ్డి అరెస్ట్
కోడెల కుటుంబానికి చెందిన ఆ కంపెనీ ఇప్పుడు వైకాపా సన్నిహితుల చేతుల్లో..
ఈనాడు, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్, బోకోహరామ్ వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే, ‘ఐసిస్ డ్రగ్’గా పేరొందిన ‘ట్రెమడాల్’ అనే సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ (మాదకద్రవ్యం)ను మాత్రల రూపంలో విదేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యవహారంలో పల్నాడు జిల్లా నరసరావుపేటకు సమీపంలోని సేఫ్ ఫార్ములేషన్స్ ఔషధ కంపెనీ యజమాని శనగల శ్రీధర్రెడ్డిని ముంబయి కస్టమ్స్ అధికారులు ఇటీవల అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆ ఔషధ కంపెనీని స్థాపించింది తెదేపా నేత దివంగత కోడెల శివప్రసాద్రావు కావడం, వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీ అధికార పార్టీ నాయకులకు సన్నిహితులుగా భావిస్తున్న వారి స్వాధీనంలోకి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశం చర్చనీయాంశమైంది. బెంగళూరుకు చెందిన ఫస్ట్వెల్త్ సొల్యూషన్స్ అనే సంస్థ ముంబయి నుంచి దక్షిణ సూడాన్ రాజధాని జుబాకు కాల్షియం కార్బొనేట్ మాత్రల (టామోల్-ఎక్స్-225) పేరుతో ఎగుమతి చేస్తున్న భారీ కన్సైన్మెంట్ను ఫిబ్రవరి 28న కస్టమ్స్ అధికారులు అనుమానంతో పరిశీలించగా వాటిలో ఉన్నవి ట్రెమడాల్ మాత్రలని తేలింది. సుమారు 10 లక్షల మాత్రల్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి తయారైంది సేఫ్ ఫార్ములేషన్స్లో అని తేలడంతో, ఆ వ్యవహారంలో ప్రమేయం ఉందన్న అనుమానంతో శ్రీధర్రెడ్డిని అరెస్ట్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా..
బెంగళూరుకు చెందిన ఫస్ట్ వెల్త్ సొల్యూషన్స్ సంస్థ కాల్షియం కార్బొనేట్ మాత్రల పేరిట ట్రెమడాల్ మాత్రలను దక్షిణ సూడాన్కు ఎగుమతి చేస్తుండగా ముంబయి కస్టమ్స్ అధికారులు పట్టుకుని, మార్చి నెలలో కేసు నమోదు చేశారు. ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బెంగళూరు వాసి గుడిపాటి సుబ్రమణ్యాన్ని మార్చి 12న అరెస్టు చేశారు. ఆయన్ను విచారించగా.. నరసరావుపేటలోని సేఫ్ ఫార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వాటిని తయారు చేసి, తమకు సరఫరా చేసిందని చెప్పారు. దీంతో ఆ సంస్థ డైరెక్టర్ శనగల శ్రీధర్రెడ్డిని అరెస్టు చేశారు. అంతకు ముందు బెంగళూరు కేంద్రంగా ఉన్న ఐరిస్ హెల్త్ గ్లోబల్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కూడా సేఫ్ ఫార్ములేషన్స్ పెద్ద ఎత్తున ట్రెమడాల్ మాత్రలు సరఫరా చేసినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
మాత్ర కాదు.. మాదకద్రవ్యమే
నొప్పి నివారణ మాత్రలైన ట్రెమడాల్ తయారీ, వినియోగంపై 2018 ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు, నియంత్రణలు విధించింది. ఎన్డీపీఎస్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి సైకోట్రాపిక్ సబ్స్టాన్స్ (మాదకద్రవ్యం)గా గుర్తిస్తూ 2018 ఏప్రిల్ 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రెమడాల్ మాత్రల్ని దేశంలో వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతించిన పరిమాణంలో, కాంబినేషన్స్లో మాత్రమే తయారు చేయాలి. వేరే కాంబినేషన్లో తయారుచేసి, విదేశాలకు ఎగుమతి చేయాలంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అనుమతి పొందాలి. ట్రెమడాల్ను మాదకద్రవ్యంగా విపరీతంగా వినియోగిస్తుండటంతో ప్రభుత్వం ఈ ఆంక్షలు పెట్టింది. అలసట రాకుండా ఉండటానికి, ఎక్కువ సమయం ఉత్తేజంగా పని చేయడానికి ఐసిస్, బోకోహరామ్ వంటి సంస్థల ఉగ్రవాదులు ఆ మాత్రలు వాడుతుంటారు. ఫస్ట్వెల్త్ సొల్యూషన్స్ సంస్థ దక్షిణ సూడాన్కు ట్రెమడాల్ మాత్రల ఎగుమతికి ఎన్సీబీ అనుమతి తీసుకోలేదు సరికదా, కాల్షియం కార్బొనేట్ మాత్రల ముసుగులో వాటిని ఎగుమతి చేయాలని ప్రయత్నిస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. ఆ సంస్థ గతంలోనూ అనుమతులు లేకుండా ట్రెమడాల్ను ఎగుమతి చేసినట్టుగా కస్టమ్స్ విభాగం గుర్తించింది.
అనుమతులు ఎలా ఇచ్చారు?
ట్రెమడాల్ మాత్రలు పట్టుబడటం, శ్రీధర్రెడ్డి అరెస్ట్ వంటి పరిణామాలపై సేఫ్ ఫార్ములేషన్స్ కంపెనీకి చెందిన స్థానిక ప్రతినిధిని ‘ఈనాడు’ సంప్రదించింది. తాము రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అనుమతి తీసుకునే ట్రెమడాల్ మాత్రలు తయారు చేశామని, ట్రెమడాల్ పేరుతోనే ప్యాకింగ్ కూడా చేశామని, తేడా ఎక్కడ జరిగిందో తమకు తెలియదని బదులిచ్చారు. ఏదైనా సంస్థ తనకు ఎగుమతి ఆర్డర్ వచ్చిందని, ట్రెమడాల్ మాత్రల్ని తయారు చేసివ్వమని మీ కంపెనీని కోరితే... ఎగుమతి ఆర్డర్ చూపించమని అడగరా? రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎగుమతి ఆర్డర్ను కూడా జతచేయరా? అన్న ప్రశ్నలకు.. ఎగుమతి ఆర్డర్ ఉందో లేదో తాము చూడమని, వర్క్ఆర్డర్ను బట్టి మాత్రలు సరఫరా చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థకు చేసే దరఖాస్తులో కూడా వర్క్ఆర్డర్నే పొందుపరుస్తామన్నారు. మాదకద్రవ్యంగా గుర్తించి, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పుడు, ఎగుమతి చేయాలంటే అనేక షరతులు పెట్టినప్పుడు.. బాధ్యతగల రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ అంత ఉదాసీనంగా ఎలా అనుమతులిచ్చేస్తుంది? ట్రెమడాల్ తయారీకి అనుమతి కోసం ఏదైనా కంపెనీ దరఖాస్తు చేసుకుంటే ఎగుమతి ఆర్డర్ ఉందో లేదో చూడరా? ఫస్ట్వెల్త్ సొల్యూషన్స్కి ట్రెమడాల్ మాత్రల సరఫరాకు సేఫ్ ఫార్ములేషన్స్ సంస్థకు అనుమతిచ్చినట్లు ముంబయి కస్టమ్స్ విభాగం అదనపు కమిషనర్కు రాసిన లేఖలో.. రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ ఎస్.రవిశంకర్ నారాయణ్ ధ్రువీకరించారు. ఫస్ట్వెల్త్ సొల్యూషన్స్కు నిజంగానే ఎగుమతి ఆర్డర్ ఉంటే.. ఎన్సీబీ నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదు? కాల్షియం మాత్రల పేరుతో ట్రెమడాల్ ఎందుకు ఎగుమతి చేస్తోంది? ఆ సంస్థకు ఎన్సీబీ అనుమతి ఉందో లేదో రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం ఎందుకు చూడలేదు? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని వెనుక భారీ గూడుపుఠాణీ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనాలో భారీగా ఆర్డర్లు
సేఫ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దఎత్తున మందులు, సర్జికల్ పరికరాలను సరఫరా చేస్తోంది. కొవిడ్ ఉద్ధృతంగా ఉన్నప్పుడు కరోనా రోగులకు వాడేందుకు వినియోగించే వివిధ మందుల్ని, సామగ్రిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు పొందినట్టు సమాచారం.
కంపెనీ చేతులు మారింది ఇలా..!
సత్తెనపల్లి-నరసరావుపేట మార్గంలో ముప్పాళ్లకు సమీపంలోని గోళ్లపాడు వద్ద కోడెల శివప్రసాదరావు 1985లోనే సెలైన్ సీసాలతయారీ కంపెనీని ప్రారంభించారు. తర్వాత దాన్ని సేఫ్ పేరెంటల్స్ కంపెనీగా మార్చారు. అనంతరం అదే ప్రాంగణంలో సేఫ్ ఫార్ములేషన్స్ కంపెనీని నెలకొల్పారు. వైకాపా అధికారంలోకి వచ్చేవరకు ఆ రెండు కంపెనీలు కోడెల కుటుంబ నిర్వహణలోనే ఉన్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబంపై రకరకాలుగా ఒత్తిడి తెచ్చి ఈ కంపెనీలను స్వాధీనం చేసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. సేఫ్ ఫార్ములేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 2020 మే 13న శనగల శ్రీధర్రెడ్డి, గాదె కనిగిరి డైరెక్టర్లుగా చేరారు. 2022 ఫిబ్రవరి 14న బాలినేని అరుణ, బాలినేని గోవిందరెడ్డి అదనపు డైరెక్టర్లుగా చేరారు. వీరిలో శ్రీధర్రెడ్డి ఆథరైజ్డ్ సిగ్నేటరీగా వ్యవహరిస్తున్నారు. సేఫ్ పేరెంటల్స్ (సేఫ్ ఫార్మా)లోనూ శ్రీధర్రెడ్డి, గాదె కనిగిరి డైరెక్టర్లుగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?