Passbook: ఒకే సర్వే నంబరుకు పది పాస్‌ పుస్తకాలు!

ఒక సర్వే నంబరులోని భూమికి ఏకంగా పది పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ అయిన విచిత్ర ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గురువారం వెలుగుచూసింది.

Updated : 28 Apr 2023 08:29 IST

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ఒక సర్వే నంబరులోని భూమికి ఏకంగా పది పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ అయిన విచిత్ర ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గురువారం వెలుగుచూసింది. పట్టణానికి చెందిన బూరుగుపల్లి రవీంద్ర భార్య శ్యామలకు టి.నరసాపురం మండలం బండివారిగూడెంలో సర్వే నంబరు 558లో 3.90 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించిన టైటిల్‌ డీడ్‌, ఈ-పాస్‌ పుస్తకం వారం రోజుల కిందట పోస్టు ద్వారా అందింది. తెరిచి చూస్తే అందులో ఏకంగా పది పాస్‌ పుస్తకాలు ఉన్నాయి. ఈ విషయాన్ని టి.నరసాపురం తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు శ్యామల భర్త రవీంద్ర తెలిపారు. భూములకు సంబంధించిన పాస్‌ పుస్తకాలు చెన్నైలో ముద్రిస్తారు. నేరుగా రైతు చిరునామాకు వాటిని పంపుతారు. ముద్రణాలయంలో పొరపాటువల్లే పది  పుస్తకాలు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ‘ఒకటే పాస్‌ పుస్తకం రావాలి. ఇలాఎందుకు జరిగిందో విచారిస్తాం’ అని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఝాన్సీరాణి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని