Chandrababu - Rajinikanth: చంద్రబాబు విజన్ అమలైతే.. దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు ఒక దీర్ఘదర్శి అని, న్యూయార్క్ నగరాన్ని తలపించేలా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎంతో ఉందని సూపర్స్టార్ రజనీకాంత్ కొనియాడారు.
ఆ శక్తి ఆయనకు ఇవ్వాలని దేవుణ్ని కోరుకుంటున్నా
న్యూయార్క్ను తలపించేలా హైదరాబాద్ను తీర్చిదిద్దారు
లక్షల మంది ఐటీలో పనిచేస్తున్నారంటే ఆయన ఘనతే
చంద్రబాబుపై రజనీకాంత్ ప్రశంసల జల్లు
ఈనాడు, అమరావతి: చంద్రబాబు ఒక దీర్ఘదర్శి అని, న్యూయార్క్ నగరాన్ని తలపించేలా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎంతో ఉందని సూపర్స్టార్ రజనీకాంత్ కొనియాడారు. ఇప్పుడు లక్షల మంది తెలుగువారు దేశవిదేశాల్లో ఐటీ రంగంలో పనిచేస్తూ విలాసవంతంగా జీవిస్తున్నారంటే చంద్రబాబే కారణమని ప్రశంసించారు. చంద్రబాబు రూపొందించిన విజన్ 2047 ఒక అద్భుతమని, అది అమలైతే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. ఆయన ప్రణాళికలు అమలు కావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ని కోరుకుంటున్నానన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘ఆయనకు 24 గంటలూ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే. దేశ రాజకీయాలే కాదు, అంతర్జాతీయ రాజకీయాలూ తెలుసు.. ఆయన ఒక విజనరీ.. ఇది నేను చెప్పేది కాదు. ఆయన ఘనత, ప్రతిభ గురించి దేశంలోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు తెలుసు. ఇక్కడున్న వారి కంటే బయటి వారికే చంద్రబాబు గొప్పతనం తెలుస్తుంది’ అని వివరించారు. ‘1996-97లోనే ఆయన విజన్ 2020 అని చెప్పారు. ఐటీకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో అంచనా వేశారు. ఆయన చెప్పిన డిజిటల్ వరల్డ్ను అప్పుడు ఎవరూ ఊహించలేదు. తర్వాత హైదరాబాద్ను హైటెక్ సిటీగా మార్చారు. బిల్గేట్స్ లాంటి దిగ్గజాలు వచ్చి ఇక్కడ కంపెనీలు ప్రారంభించారు’ అని పేర్కొన్నారు.
ఏపీకి ఏం చేయాలో ఆలోచిస్తున్నారు..
‘పదవిలో ఉన్నా, లేకున్నా ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా చంద్రబాబు కాదనరు. నేను విదేశాల్లో ఉన్నా ఫోన్ చేసి పుట్టినరోజున శుభాకాంక్షలు చెబుతారు’ అని రజనీకాంత్ చెప్పారు. ‘నాలుగు నెలల కిందట ఆయనతో మాట్లాడే అవకాశం లభించింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఈ తీరిక సమయంలో.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఏమేం చేయాలో ఆయన ఆలోచిస్తున్నారు. 2047 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ ప్రాజెక్టు అమలైతే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఎక్కడికో వెళ్లిపోతుంది. అవన్నీ జరగాలని, అందుకు తగ్గ శక్తిని దేవుడు ఇవ్వాలని.. ఎన్టీఆర్ ఆత్మ ఆయనతో ఉండి అదంతా జరిగేలా చూడాలని ఆప్తమిత్రుడిగా కోరుకుంటున్నా’ అని ఆకాంక్షించారు.
ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్లో ఉన్నానా?
‘ఇటీవల జైలర్ సినిమా షూటింగ్ సమయంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్కు వెళ్లాను. 20, 22 సంవత్సరాల తర్వాత రాత్రి సమయంలో అటు వెళ్లి చూస్తే.. నేను ఇండియాలో ఉన్నానో, న్యూయార్క్లో ఉన్నానో అర్థం కాలేదు. ఇండియాలోనే హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఆర్థికంగా బలంగా నిలిచింది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు కూడా ఇదే విషయం చెప్పారు’ అని వివరించారు.
చంద్రబాబు ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడకపోతే ఎలా?
‘ఏం మాట్లాడాలో జ్ఞానం, బుద్ధి చెబుతుంది. ఎలా మాట్లాడాలో సమర్థత చెబుతుంది. ఎంతసేపు మాట్లాడాలో సభ చెబుతుంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో అనుభవం చెబుతుంది. ఇంత పెద్ద సభను చూస్తే రాజకీయం మాట్లాడాలనిపిస్తున్నా.. వద్దురా రజనీ, జాగ్రత్త, రాజకీయం ఇక్కడ మాట్లాడొద్దని అనుభవం చెబుతుంది. కానీ ఆప్తమిత్రుడు, రాజకీయ నేత చంద్రబాబు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన గురించి కొద్దిగా అయినా రాజకీయం మాట్లాడకపోతే అది సభా సంస్కారం కాదు’ అంటూ రజనీకాంత్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘చంద్రబాబు 30 ఏళ్లుగా నా మిత్రులు. నా మిత్రుడు మోహన్బాబు ఆయన్ను పరిచయం చేస్తూ పెద్ద నాయకుడు అవుతారని చెప్పారు. హైదరాబాద్ వెళ్లినప్పుడు చంద్రబాబును కలిసి మాట్లాడేవాణ్ని. అలా మాట్లాడితే నా జ్ఞానం పెరిగింది’ అని కొనియాడారు.
బాలయ్య చేస్తేనే అంగీకరిస్తారు
‘చూపుతోనే చంపేస్తాను అనే నా మిత్రుడు బాలకృష్ణ.. ఆయన ఒక తన్ను తంతే జీపు 20 నుంచి 30 అడుగులు పోతుంది.. అలా రజనీకాంత్, అమితాబ్బచ్చన్, షారుఖ్ఖాన్, సల్మాన్ఖాన్ ఎవరు చేసినా జనం అంగీకరించరు. బాలయ్య చేస్తేనే చూస్తారు. తెలుగు ప్రజలు బాలయ్యలో ఎన్టీఆర్ను చూస్తున్నారు. ఆయన ఇంకా చాలాకాలం రాజకీయాలు, సినిమాల్లో ఉండాలని దేవుణ్ని కోరుకుంటున్నా’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!