NTR - Rajinikanth: యుగపురుషుడు ఎన్టీఆర్
ఎన్టీఆర్ యుగపురుషుడని సూపర్స్టార్ రజనీకాంత్ కొనియాడారు. ‘నటజీవితంలో ఎన్టీఆర్ నాకు స్ఫూర్తి. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. నాకు, ఆయనకు ఎంతో బాంధవ్యం ఉంది’ అని వివరించారు.
ఆయన డైలాగులు వినే తెలుగు నేర్చుకున్నా
టైగర్లో ఆయనతో కలిసి నటించాకే సినిమాలొచ్చాయి
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో సూపర్స్టార్ రజనీకాంత్
ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్ యుగపురుషుడని సూపర్స్టార్ రజనీకాంత్ కొనియాడారు. ‘నటజీవితంలో ఎన్టీఆర్ నాకు స్ఫూర్తి. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. నాకు, ఆయనకు ఎంతో బాంధవ్యం ఉంది’ అని వివరించారు. ‘రాజకీయాల్లోకి వచ్చే నాటికి ఎన్టీఆర్ పారితోషికం సినిమాకు రూ.10 లక్షలు.. 42 ఏళ్ల కిందట రూ.10 లక్షలంటే ఇప్పుడు ఎన్ని కోట్లు? అవన్నీ వదిలేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగు ఆత్మగౌరవం పేరుతో రాష్ట్రమంతా తిరిగారు’ అని పేర్కొన్నారు. ‘తెలుగువారు పాలించాలా? దిల్లీ పాలించాలా? అని ఒకే ప్రశ్న వేశారు. ఫుట్పాత్లపై నిద్రపోయారు. పార్టీ ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే సంచలనం సృష్టించారు. ఆయనో యుగపురుషుడు. ఆయన గురించి ఎంతైనా మాట్లాడుతూ ఉండొచ్చు’ అంటూ గుర్తుచేసుకున్నారు. తన జీవితంలోని ఎన్నో అంశాలు ఎన్టీఆర్తో ముడిపడి ఉన్నాయంటూ.. విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భావోద్వేగంతో ప్రసంగించారు.
పాతాళ భైరవి ఆశీస్సులతోనే
పాతాళభైరవి.. ఆరేడేళ్ల వయసులో నా జీవితంలో చూసిన తొలి సినిమా. అందులోని 20 అడుగుల భైరవి విగ్రహమే నా మనసులో నిలిచింది. ఏ శక్తి విగ్రహం చూసినా.. భైరవే అన్పించేది. అంతగా ముద్ర వేసింది. నా మొదటి సినిమా సమయంలో కెమెరా ముందు మొదటిగా చెప్పిన డైలాగ్ కూడా ‘భైరవి ఇల్లు ఇదేనా?’ అని.. నేను మొదట హీరోగా చేసిన సినిమా భైరవి.. ఇది ఆ జగన్మాత భైరవి ప్రసాదం.
ఎన్టీఆర్తో కలిసి టైగర్లో
ఎన్టీఆర్తో కలిసి టైగర్లో నటించాను. 1977లో నేను రాత్రింబవళ్లు పనిచేయడంతో నిద్ర లేదు. చెడు అలవాట్లతో నరాల బలహీనత.. ఎక్కువ కోపం ఉండేది. అందర్నీ కొట్టేసేవాడ్ని. చేతిలో రెండు, మూడు సినిమాలే ఉన్నాయి. బుక్ చేసిన నిర్మాతలంతా అడ్వాన్సు తిరిగి తీసుకున్నారు. టైగర్ కూడా అలాగే అవుతుందనుకున్నా. అందరూ వద్దని చెప్పినా ఎన్టీఆర్ మాత్రమే మిమ్మల్నే తీసుకోవాలన్నారని డైరెక్టర్ నాతో చెప్పారు. అలా ఎన్టీఆర్ పట్టుబట్టి ఆ సినిమాలో నన్ను నటింపజేశారు. తర్వాతే ఇతర నిర్మాతలు వచ్చి సినిమాలిచ్చారు.
ఎన్టీఆర్.. ఓ ఎనర్జీ
యాక్షన్ సీన్లో ట్రాలీలో కెమెరా వెంబడిస్తుంది. ఇద్దరు ఫైటర్లను కొట్టుకుంటూ స్పీడ్గా వెళ్లాలి. బ్రదర్ నేను స్పీడ్గా వెళ్తాను.. నా వేగానికి అనుగుణంగా మీరు రావాలని ఎన్టీఆర్ చెప్పారు. ‘రజనీకాంత్ అంటే స్పీడ్.. స్పీడ్ అంటే రజనీకాంత్, ఆయన వచ్చి నాకు చెబుతున్నారా’ అనుకుంటూ ఓకే సార్ అన్నా. షాట్ అయ్యాక కెమెరామెన్ కట్ చెబుతుంటే నేను వెనకే ఉన్నా, ఎన్టీఆర్ ముందుకు వెళ్లిపోయారు. ఆయనలో అంత ఎనర్జీ. అప్పుడు ఎన్టీఆర్.. బ్రదర్ నేను కొంచెం నెమ్మదించనా అన్నారు. షూటింగ్ ఉంటే 6.45 గంటలకే ఆయన సిద్ధంగా ఉండేవారు. వ్యక్తిత్వానికి ఆయన ఇచ్చే మర్యాద అది. సినిమాల్లోనే కాదు, బయట కూడా అలాగే జీవించారు.
దుర్యోధనుడి పాత్రలో నటించాలని ప్రయత్నించి..
రాజమండ్రిలో షూటింగ్ చేస్తుంటే ట్రాఫిక్లో వేల మంది ఉన్నారు. ఏంటని చూస్తే దానవీరశూరకర్ణ సినిమా విడుదలైంది. ఆ సినిమా ఎన్నిసార్లు చూశానో నాకు తెలియదు. దాన్ని వీసీడీలో చూశాక ఎలాగైనా దుర్యోధనుడి పాత్రలో నటించాలనుకున్నా. ఒక నిర్మాత, దర్శకుడు అంగీకరించారు. దుర్యోధనుడి డైలాగ్ అలాగే రాయమన్నా. దాన్ని కంఠతా పట్టి స్క్రీన్టెస్ట్కు వెళ్లాను. ఎన్టీఆర్, ఎంజీఆర్కు మేకప్మన్ అయిన పీతాంబరాన్ని పిలిచాం. ‘బాబూ తప్పుగా అనుకోవద్దు.. ఎన్టీఆర్, ఎంజీఆర్ తర్వాత ఎవరికీ మేకప్ వేయలేదు’ అని బొట్టు పెట్టి వెళ్లిపోయారు. తర్వాత దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్ గెటప్లా అదే కిరీటం, అదే శరీరం, మేకప్తో చిత్రీకరించారు. ఫొటోలు వచ్చాక అంతా బాగుందంటున్నా నాకే ఏదోలా అనిపించి వదిలేశాను. తర్వాత 1982లో బొబ్బిలిపులి షూటింగ్ ఏవీఎంలో జరుగుతుంటే పక్కనే మరో షూటింగ్లో ఉన్న నేను అక్కడికి వెళ్లాను. అప్పుడే ఆయన ఆంధ్రప్రదేశ్లో పార్టీ ప్రకటించారు. సెట్లో అంతా నిశ్శబ్దం.. కళ్లుమూసుకుని కూర్చున్న ఎన్టీఆర్ తన చుట్టూ అంతా గమనిస్తూనే ఉన్నారు. ఆ సినిమాలో ఖైదీగా 2 పేజీల డైలాగ్ను భావోద్వేగాలతో ఒకే టేక్లో పూర్తి చేశారు.
రామోజీరావు మద్దతుతోనే ఎన్నికల్లో పెద్ద విజయమని చెప్పారు..
రామోజీరావు మద్దతు లేకుంటే ఎన్నికల్లో తనకు పెద్ద విజయం వచ్చేది కాదని ఎన్టీఆర్ అప్పట్లో నాతో చెప్పారు. రామోజీరావుకు ఎప్పుడూ కృతజ్ఞుడినని అన్నారు. అంతా తనదే అని ఎన్టీఆర్ చెప్పొచ్చు. కానీ అలా చెప్పలేదు. ఎన్టీఆర్, శివాజీ, రాజ్కుమార్.. వీళ్లందరి ఆఖరు రోజుల్లో వారితో గడిపే అవకాశం నాకు లభించింది. ఎవరైనా పొగిడితే వారికి రుచించేది కాదు. ఇతరుల గురించి మాట్లాడరు. ఎన్టీఆర్ యుగపురుషుడు.. ఆయన కుటుంబంతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడాన్ని నాకు లభించిన భాగ్యంగా భావిస్తున్నా అని రజనీకాంత్ భావోద్వేగంగా మాట్లాడారు. అనంతరం చంద్రబాబు ఆయనను ఆలింగనం చేసుకుని అభినందించారు.
నాకే తెలియకుండా ఎగిరి గంతేశా
నా జీవితంలో నాకే తెలియకుండా నేను రెండుసార్లు ఎగిరి గంతేశా. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు, రెండోసారి హిమాలయాలకు వెళ్లి గంగా నదిని చూసినప్పుడు.
శ్రీకృష్ణపాండవీయం చూసి తెలుగు నేర్చుకున్నా
తెరపై చూసిన ఎన్టీఆర్ను 1963లో నిజంగా చూశాను. 13 ఏళ్ల వయసులో మినర్వా థియేటర్కు ఎన్టీఆర్, అంజలి, రేలంగి వచ్చారు. ఎవరో పైకెత్తి చూపించారు. తర్వాత 1966లో శ్రీకృష్ణపాండవీయంలో దుర్యోధన పాత్రలో ఎన్టీఆర్ను చూసి మెస్మరైజ్ అయ్యాను. ఆ డైలాగులతోనే తెలుగు నేర్చుకున్నాను.
ఎన్టీఆర్తో కలిసి పని చేసిన ప్రముఖులకు సత్కారం
ఈనాడు, అమరావతి : నందమూరి తారక రామారావుతో కలిసి పనిచేసిన అయిదుగురు ప్రముఖులను శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కలిసి సన్మానించారు. సన్మానం పొందిన వారిలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు రాంపల్లి నర్సాయమ్మ, గౌడప్రభ పత్రిక సంపాదకుడు వీరంకి నాగేశ్వరరావు, ఎన్టీఆర్కు డిజైనర్గా పనిచేసిన వాలేశ్వరరావు, పూర్ణ పిక్చర్స్ అధినేత గ్రంథి విశ్వనాథ్, ఏపీ ఫిలిం ఛాంబర్స్ మాజీ అధ్యక్షుడు సి.రామచంద్రరావులను దుశ్శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.
ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ
ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎన్టీఆర్ శాసనసభలో, బయట వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలతో ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్, వెబ్సైట్’ కమిటీ రూపొందించిన రెండు పుస్తకాల్ని చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ తదితరులు ఆవిష్కరించారు. కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్, కమిటీలో సభ్యులుగా ఉన్న సీనియర్ పాత్రికేయుడు ఎస్.వెంకటనారాయణ, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, సినీ నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్, అట్లూరి నారాయణరావు, పుస్తకాల్ని ఎడిట్ చేసిన పాత్రికేయుడు పూల విక్రం తదితరుల్నిఆయన అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..