Jogi Ramesh: ఏయ్‌... అవతలికి పో.. బందరు డీఎస్పీని కసురుకున్న మంత్రి జోగి రమేష్‌

కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆర్కే రోజా మచిలీపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ ఓ డీఎస్పీతో వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది.

Updated : 29 Apr 2023 10:57 IST

మచిలీపట్నం(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆర్కే రోజా మచిలీపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ ఓ డీఎస్పీతో వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. మచిలీపట్నం డీఎస్పీ మాసుంబాషాను ఏయ్‌... అవతలికి పో అంటూ కసురుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రహదారులు, భవనాల శాఖ అతిథిగృహానికి శుక్రవారం ఉదయం పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చారు. మంత్రి రోజా వచ్చిన వెంటనే ప్రొటోకాల్‌లో భాగంగా కలెక్టర్‌ రాజబాబు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అదే సమయంలో మంత్రిని కలిసేందుకు అక్కడికి వచ్చిన జిల్లా ఎస్పీ పి.జాషువాకు దారి ఇచ్చేందుకు సబార్డినేట్‌ అధికారిగా డీఎస్పీ మాసుంబాషా హడావుడిగా కలెక్టర్‌కు అతి చేరువగా వెళ్లి ఆయన పక్కనే ఉన్న జోగి రమేష్‌తో ఎస్పీ గారు వస్తున్నారంటూ చెప్పారు. దీంతో ఆగ్రహించిన మంత్రి జోగి రమేష్‌ కోపంగా ఏయ్‌.. అవతలికి పో అంటూ డీఎస్పీని విసుక్కోవడంతో ఆయన ఖిన్నులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని