Tejasvi kattimani: యాభై పైసల కూలీ.. ‘ఆదర్శ ఉపకులపతిగా!’
‘నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వ లేదయ్యో.. నా సంకన మేడితో సాలిరువాలు దున్నినానయో..’ అనే గీతంలో చిన్నారి పడే యాతనే విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ఉప కులపతి తేజస్వి కట్టీమని తన బాల్యంలో ఎదుర్కొన్నారు.
స్ఫూర్తినింపుతున్న గిరిజన విశ్వవిద్యాలయ ఉపకులపతి కట్టీమని ప్రస్థానం
నూతన జాతీయ విద్యా విధాన రూపకల్పన కమిటీలో సభ్యుడిగా రాణింపు
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే
‘నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వ లేదయ్యో.. నా సంకన మేడితో సాలిరువాలు దున్నినానయో..’ అనే గీతంలో చిన్నారి పడే యాతనే విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ఉప కులపతి తేజస్వి కట్టీమని తన బాల్యంలో ఎదుర్కొన్నారు. కానీ, ఆ కష్టాలను నెమరు వేస్తూ ఆయన కూర్చోలేదు. తన లక్ష్యం కోసం పని, చదువును సమన్వయం చేసుకుంటూ నేడు జాతీయ విద్యా విధానంలో సూచనలు చేసే స్థాయికి ఎదిగారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నదానికి చక్కని నిదర్శనం కట్టీమని. గిరిజన గూడెం నుంచి ఉపకులపతి స్థాయి వరకు ఎదిగారు. తినడానికి తిండి లేని పరిస్థితుల నుంచి నేడు ఎంతో మంది విద్యార్థుల ఆకలి తీర్చుతున్నారు. చదువు కోసం ఇంటి నుంచి పారిపోయి దొరికిన పనల్లా చేసిన అతనే తనలాగా ఎవరూ బాధపడొద్దని దిక్సూచీగా మారారు. కష్టాలు ఎదురొడ్డితే అద్భుతాలు సృష్టించగలమని తన అనుభవాలకు సాహిత్యాన్ని జోడించి అక్షర యజ్ఞం చేస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాసి నేటి తరంలో స్ఫూర్తి నింపుతున్నారు.
కట్టీమని.. 1955లో కర్ణాటకలోని కొప్పళ జిల్లా అళవండిలో జన్మించారు. తల్లి సంగవ్వ, తండ్రి యంకప్ప తలారి. వ్యవసాయ కూలీ పనులే వీరి జీవనాధారం. ముగ్గురన్నదమ్ముల్లో కట్టీమని తప్ప మిగతా ఇద్దరూ నిరక్షరాస్యులే.చిన్నతనం నుంచే ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని కలలుగన్నారు. కానీ..ఇంట్లో పరిస్థితులు అనుకూలించక బాల్యంలో పశువులు మేపడంతో పాటు రోజుకు 50 పైసలకు పొలంలో కూలీ పనికి వెళ్లారు. అయినా.. చదువుపై మనసు చంపుకోలేక కొన్నాళ్లకు ఉపాధ్యాయుల ఇంట్లో రాత్రిళ్లు పనులు చేస్తూ సొంతూరిలో ఏడో తరగతి పూర్తి చేశారు. ఇక చాలని కట్టీమనిని తండ్రి చదువు మాన్పించి, కిరాణా కొట్టులో పనికి పెట్టారు. ధ్యాసంతా చదువుపైనే ఉండటంతో కట్టీమని 60కి.మీ దూరంలో ఉన్న అమ్మమ్మ ఊరైన గదగ్కు పారిపోయారు. ఆమె ప్రోత్సాహంతో ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ ఎనిమిదో తరగతిలో చేరి ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత కూడా హాస్టల్లో మకాం, సెలవుల్లో నూనె మిల్లులో, హోటల్లో పని, గ్రంథాలయాల్లో చదువుతో డిగ్రీ వరకు నెట్టుకొచ్చారు.
చదువును వదల్లేదు..
‘ఎన్ని కష్టాలు ఎదురైనా చదువును వదల్లేదు. అదే నేడు నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చింది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రులతోనూ భేటీ అయ్యే అవకాశం కల్పించింది’ అని కట్టీమని గర్వంగా చెబుతున్నారు. డిగ్రీ చదువుతున్నప్పుడు తండ్రి మరణించడంతో కుటుంబ భారం కట్టీమనిపై పడింది. దాంతో.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అటెండర్గా పని చేస్తూనే చదువు కొనసాగించారు. కర్ణాటక విశ్వవిద్యాలయంలో ఎంఏ హిందీలో ప్రథమస్థానం సాధించారు. పీజీ పూర్తి చేసిన కొన్ని రోజులకే నెలకు రూ.745 జీతంతో విశ్వవిద్యాలయంలో ఒప్పంద అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. 1982లో శాశ్వత అధ్యాపకుడిగా ఎంపికై హైదరాబాద్ మౌలానా అబుల్కలాం ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా, 2014లో మధ్యప్రదేశ్లోని అమరకంటకలో ఆరేళ్లు ఉపకులపతిగా పనిచేశారు. 2020 నుంచి విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా కొనసాగుతున్నారు.
అక్షర యజ్ఞంలో.. సేవా నేస్తం
కవి, రచయిత, అనువాదకుడిగా కట్టీమని గుర్తింపు పొందారు.
* 1983లో కన్నడంలో ‘ముంగారు మతై’ కవితా సంకలనం ప్రచురించారు.
* సాహిత్యం, గిరిజన హక్కుల ఉద్యమాలు, దేవదాసీ విధానం రద్దు కోసం పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు.
* రెండు కవితా సంకలనాలు, వ్యాస సంకలనాలు ప్రచురించారు.
* మండల్ నివేదిక గురించి కట్టీమని రాసిన పుస్తకం ఎంతగానో పేరు తెచ్చింది.
* 2016లో కర్ణాటక ప్రభుత్వం రాజోత్సవ పురస్కారం, ఉత్తర్ప్రదేశ్ ప్రతిష్ఠాత్మక పురస్కారం, భారత ప్రభుత్వం గంగాశరణ్ సింహా పురస్కారాలు లభించాయి.
* ‘జంగ్లీ కులపతి’ ఇటీవలే తెలుగు, కన్నడ భాషల్లో ప్రచురితమైంది. ఈ పుస్తకం విశ్వవిద్యాలయ ఆత్మకథగా ఆయన అభివర్ణించారు.
* గిరిజన పిల్లలు చదువు వైపు మళ్లేలా ధార్వాడ్లో నాయక్ హాస్టల్ని ప్రారంభించారు.
నూతన విద్యా విధానంతో దృక్పథం మారింది: కట్టీమని
నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)తో నా ఆలోచనా దృక్పథం మారింది. ఏదో ఒక నైపుణ్యంతో ఏ వ్యక్తి రాణించలేరు. రాబోయే కాలంలో మల్టీ డిసిప్లీనరీ విద్యావిధానం వైపు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో అవగాహన కలిగి ఉండాలి. వేలసంఖ్యలో అవకాశాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకునేలా బహుళ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. కష్టాలు అనుభవించనిదే సుఖాలు పొందలేరన్న విషయాన్ని తెలుసుకోవాలి. బాల్యంలో జొన్నరొట్టే నా ఆహారం. వరి అన్నం తినడం గొప్పగా భావించేవాళ్లు. అటెండర్గా ఉద్యోగంలో చేరినప్పుడు తొలి జీతంతో బియ్యం కొని, అన్నం వండుకుని తినాలనుకున్నా సాధ్యపడలేదు. ప్రస్తుతం అన్నీ అందుబాటులో ఉన్నాయి. అధిక నైపుణ్యాలు నేర్చుకోవడంలో యువత దృష్టి పెట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం