Kakinada: ఆరో తరగతి విద్యార్థినికి పదిలో 488 మార్కులు
కాకినాడ జిల్లా గాంధీనగర్ మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని ముప్పల హేమశ్రీ పదో తరగతి పరీక్షల్లో సత్తాచాటింది.
వెంకట్నగర్(కాకినాడ), న్యూస్టుడే: కాకినాడ జిల్లా గాంధీనగర్ మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థిని ముప్పల హేమశ్రీ పదో తరగతి పరీక్షల్లో సత్తాచాటింది. ఈ చిన్నారి అసమాన ప్రతిభను ఇక్కడి ఉపాధ్యాయులు కొన్నాళ్ల కిందట ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మార్చి 27న విజయవాడ సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్ హేమశ్రీ తెలివితేటల్ని పరీక్షించారు. ఆమె ప్రతిభకు మెచ్చి గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు రాసేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. శనివారం ప్రకటించిన ఫలితాల్లో ఆమె 488 మార్కులు సాధించింది. తల్లి మణి గృహిణి, తండ్రి సురేష్ ప్రైవేటు ఉద్యోగి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!