Tirumala: సర్వదర్శనానికి 36 గంటలు.. తిరుమలలో అకస్మాత్తుగా పెరిగిన రద్దీ

శ్రీవారి దర్శనానికి తిరుమల వస్తున్న భక్తుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. వేసవి సెలవులు ప్రారంభమయ్యాక రెండు, మూడు రోజులుగా భక్తులు పెద్దఎత్తున తిరుమల చేరుకుంటున్నారు.

Updated : 19 May 2023 06:57 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనానికి తిరుమల వస్తున్న భక్తుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. వేసవి సెలవులు ప్రారంభమయ్యాక రెండు, మూడు రోజులుగా భక్తులు పెద్దఎత్తున తిరుమల చేరుకుంటున్నారు. గురువారం శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు... వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్‌రోడ్డులోని శిలాతోరణం దాకా దాదాపు రెండు కిలోమీటర్లు బారులు తీరారు. వీరికి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతోందని తితిదే అధికారులు తెలిపారు. మధ్యాహ్నం గంటకు పైగా వర్షం కురవడంతో రహదారులు, శ్రీవారి ఆలయ మాడవీధుల్లో వర్షపు నీరు ప్రవహించింది. బుధవారం శ్రీవారిని 79,207 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.19 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని