సంక్షిప్త వార్తలు (9)
తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేష్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ సురేష్రెడ్డి
తిరుమల, న్యూస్టుడే: తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేష్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు 22 నుంచి
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఈనెల 22 నుంచి జూన్ 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఆన్లైన్లో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కిందకే ‘బీకాం’
ఈనాడు, అమరావతి: ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం కిందకే బీకాం కోర్సు వస్తుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు బీకాంను ఆర్ట్స్, హ్యుమానిటీస్ కిందే పరిగణిస్తున్నాయని తెలిపింది. బీకాం చదివిన విద్యార్థులూ వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వహించేందుకు అర్హులని పేర్కొంది. ఎనిమిది వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ వి.శ్రీనివాస్తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
37 మంది అదనపు ఎస్పీలకు పోస్టింగులు
ఈనాడు-అమరావతి: డీఎస్పీల నుంచి అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన 37 మంది అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం పోస్టింగులు ఇచ్చింది. పరిపాలన విభాగం అదనపు ఎస్పీలుగా, స్పెషల్ బ్రాంచ్, ఏసీబీ, విజిలెన్స్, సెబ్ తదితర విభాగాల్లో వారికి పోస్టింగులిచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్కుమార్ గుప్తా శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలి
సెబ్ కమిషనర్ రవిప్రకాశ్
ఈనాడు డిజిటల్, అమరావతి: మాదకద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరం చేయాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) కమిషనర్ రవిప్రకాశ్ సూచించారు. కళాశాలలు, విద్యాసంస్థలు, కిరాణా, పాన్ దుకాణాల వద్ద నిఘా ఏర్పాటుచేయాలని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నాటుసారా అరికట్టడానికి జిల్లాల్లో విస్తృతంగా దాడులు చేయాలని తెలిపారు. ‘నాటుసారా తయారీ, గంజాయి సాగుదారులను గుర్తించి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ వినియోగిస్తున్న పరిశ్రమల్లో తనిఖీలు చేసి భద్రతా ప్రమాణాలు పాటించేలా యాజమాన్యాలకు సూచనలివ్వాలి’ అని రవిప్రకాశ్ ఆదేశించారు.
కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్గా రఘునాథరెడ్డి
ఈనాడు, అమరావతి: రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్గా ఒంటెద్దు రఘునాథరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆయన నియామకం జూన్21 నుంచి అమల్లోకి వస్తుందని, అప్పటినుంచి రెండేళ్లు ఈ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది.
గ్రంథాలయాల వేసవి శిక్షణ శిబిరాల సమయాన్ని మార్చాలి: కళ్లేపల్లి
ఈనాడు, అమరావతి: గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల సమయాన్ని మార్పు చేయాలని ఏపీ రాష్ట్ర గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు కోరారు. పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ ఉద్యోగులు..విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, తీసుకురావడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ వేసవి శిబిరాల సమయాన్ని ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకు మాత్రమే ఉంచాలని, శుక్రవారం, రెండో శనివారం, ప్రభుత్వ సెలవుల్లో గ్రంథాలయాలకు సెలవులు ఇవ్వాలని కోరారు. 40రోజులపాటు నిర్వహించే శిక్షణ శిబిరాలకు రూ.10వేల బడ్జెట్ సరిపోవడం లేదని తెలిపారు.
వెబ్సైట్లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్టికెట్లు
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లను జ్ఞానభూమి వెబ్సైట్లో కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్లో ఉంచామని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. ప్రిన్సిపాళ్లు వాటిని డౌన్లోడ్ చేసి, విద్యార్థులకు అందించాలని సూచించారు.
ముగిసిన ఈఏపీసెట్ ఎంపీసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్ష
ఈనాడు, అమరావతి- జేఎన్టీయూ, న్యూస్టుడే: ఈఏపీసెట్ ఎంపీసీ స్ట్రీమ్ ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈనెల 15 నుంచి ప్రారంభమైన పరీక్షలను 9 విడతల్లో నిర్వహించినట్లు కన్వీనర్ శోభాబిందు తెలిపారు. మొత్తం 2,38,180 మంది పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా.. 2,24,724(94.35%)మంది హాజరయ్యారు. ఈనెల 22, 23 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ