ఇవేం ధరలు కృష్ణ!
ఓ ప్రైవేట్ సంస్థ అధిక ధరలకు ప్రాణాధార మందులను పంపిణీ చేస్తుండటంతో ప్రభుత్వాసుపత్రుల నిధులు కరిగిపోతున్నాయి.
ఇలాగైతే ప్రాణాధార మందులు కొనలేం
3 నెలల బిల్లులు ఒక్క మాసంలోనే పూర్తి
ప్రభుత్వాసుపత్రుల పర్యవేక్షణ అధికారుల ఆందోళన
అదనపు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి
ఈనాడు, అమరావతి: ఓ ప్రైవేట్ సంస్థ అధిక ధరలకు ప్రాణాధార మందులను పంపిణీ చేస్తుండటంతో ప్రభుత్వాసుపత్రుల నిధులు కరిగిపోతున్నాయి. మూడు, నాలుగు నెలల అవసరాలకు సరిపడా మందుల కొనుగోలుకు వెచ్చించే డబ్బు..ప్రస్తుతం నెల, నెలన్నర సమయంలోనే ఖర్చయిపోతోంది. విశాఖలోని కేజీహెచ్ గత అక్టోబరు నుంచి ఈ ఏడాది జనవరి మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసిన శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ ద్వారా రూ.36,42,568 వ్యయంతో మందులను కొనుగోలుచేసింది. స్థానిక కొనుగోళ్ల విధానంలో ఈ మందులను 2020లో రూ.15,24,469 కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. కేంద్రీకృత విధానంలో శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్కు అదనంగా బిల్లు అయినట్లు వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై పరిశీలన జరుగుతోంది. నిధులు సరిపోయే పరిస్థితులు లేనందున..మందుల కొనుగోలుకు అదనపు మొత్తం కేటాయించాలని ప్రభుత్వాసుపత్రుల వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎమ్మార్పీలోనే కిరికిరి
రాష్ట్రంలోని బోధనాసుత్రులు, ఇతర ఆసుపత్రుల వారీగా మందుల అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. ఈ నిధుల్లో 80% మొత్తానికి రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ తయారీదారుల నుంచి కొనుగోలు చేసిన మందులను ఆసుపత్రులకు పంపిణీ చేస్తోంది. మిగిలిన 20% నిధుల నుంచి అత్యవసర మందులు ఆసుపత్రుల సూపరింటెండెంట్లు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీల ద్వారా స్థానికంగానే కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే..అత్యవసర మందుల కొనుగోలు వ్యవహారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండడంలేదన్న ఉద్దేశంతో ఒకే సంస్థ ద్వారా బోధనాసుపత్రులు, ఇతర ఆసుపత్రులకు మందుల పంపిణీ కోసం వైద్య ఆరోగ్య శాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదన మేరకు రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కిందటేడు టెండరు పిలిచింది. దీని ప్రకారం. ఎల్1గా వచ్చిన శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ సంస్థకు అత్యవసర మందుల పంపిణీ బాధ్యతను అప్పగించింది. ఈ సంస్థ నిర్దేశించిన ఎం.ఆర్.పి.లో 35.6% రాయితీతో మందులు పంపిణీ చేయాలన్న నిబంధనతో టెండరు దక్కించుకుంది. సరఫరా చేయాల్సిన జాబితాలో జనరిక్తోపాటు బ్రాండెడ్ మందులూ ఉన్నాయి. ఈ సంస్థ ఆసుపత్రులకు మందుల పంపిణీ ప్రారంభించింది. అయితే..ఈ సంస్థ కోట్చేసిన ధరకు..హోల్సేల్/రిటైల్ మార్కెట్లో ఉన్న ధరల్లోని వ్యత్యాసం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. హోల్సేల్లో జనరిక్ మందులు ఉన్న ధరపై 70% నుంచి 85% వరకు తగ్గిస్తున్నాయి. బ్రాండెడ్ మందుల్లోనూ కంపెనీ స్థాయి నుంచి ధరల్లో విపరీతమైన వ్యత్యాసాలు ఉన్నాయి. శ్రీకృష్ణ సంస్థ ఆసుపత్రులకు సరఫరా చేస్తున్న మందుల, తయారీ కంపెనీల ప్రాధాన్యం, ఎమ్మార్పీలో ఉన్న మతలబుల గురించి ఎవరూ పట్టించుకోవడంలేదన్న విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ సంస్థ నుంచి త్వరగా మందుల సరఫరా కూడా జరగడంలేదని ప్రభుత్వాసుపత్రులు పేర్కొంటున్నాయి.
స్థానిక కొనుగోళ్లతో నిధుల ఆదా!
స్పెషాల్టీ, సూపర్ స్పెషాల్టీ మందుల ధరల్లో వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ రోగులకు అందించిన చికిత్స కింద ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో సూపర్ స్పెషాల్టీ, స్పెషాల్టీ మందులను స్థానిక కొనుగోళ్లకు అవకాశాన్ని కల్పించాలని విశాఖలోని కేజీహెచ్ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రీకృత విధానంలో మందుల కొనుగోలు చేసే పక్షంలో నిధులు సరిపోవని ఆసుపత్రుల వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విశాఖ కేజీహెచ్కు శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ సంస్థ సరఫరా చేసిన మందులు ధరలు... అంతకుముందు సరఫరా జరిగిన మందుల ధరల మధ్య ఉన్న వ్యత్యాస పట్టిక.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్