కదలిరండి.. కదలిరండి రైతన్నలారా!
అమరావతి ఉద్యమం 1,250వ రోజుకు చేరిన సందర్భంగా తుళ్లూరు శిబిరంలో శనివారం ఆర్-5 జోన్కు వ్యతిరేకంగా ప్రత్యేక ఉద్యమ గీతాన్ని ఆవిష్కరించారు.
ఆర్-5 జోన్కు వ్యతిరేకంగా ఉద్యమ గీతం ఆవిష్కరణ
తుళ్లూరు, న్యూస్టుడే: అమరావతి ఉద్యమం 1,250వ రోజుకు చేరిన సందర్భంగా తుళ్లూరు శిబిరంలో శనివారం ఆర్-5 జోన్కు వ్యతిరేకంగా ప్రత్యేక ఉద్యమ గీతాన్ని ఆవిష్కరించారు. అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత డీఎస్పీ బొప్పన విజయ్కుమార్ తన సతీమణి విజయకుమారి జ్ఞాపకార్థం ఈ గీతాన్ని సమర్పించారు. గాయకుడు రమణ బృందం ఆలపించింది. భారతీయత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు, అమరావతి సమన్వయ కమిటీ సభ్యుడు పువ్వాడ సుధాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులు, మహిళలతో కలసి గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ అమరావతిపై ప్రభుత్వం కక్షకట్టి ఆర్-5 జోన్ పేరుతో విధ్వంసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు, రైతులకు మధ్య చిచ్చు పెట్టాలనే రాజధానిలో సెంటు భూమి పంపిణీకి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. అమరావతి బృహత్ ప్రణాళిక ప్రకారం ఆర్-3 జోన్లో రైతులతో పాటు, పేదల కోసం 5 శాతం నివాస భూములున్నప్పటికీ ప్రభుత్వం కావాలనే పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం కేటాయించిన భూముల్లో ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి పట్టాల పంపిణీకి సిద్ధమైందని మండిపడ్డారు. రాజధాని విధ్వంసం వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది.. రైతులు ఈ విషయాన్ని గ్రహించి వేలాదిగా తరలివచ్చి శాంతియుత నిరసనల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు న్యాయవాది రవీంద్రబాబు మాట్లాడుతూ రైతులందరూ కలసికట్టుగా ఆర్-5 జోన్కు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో అమరావతి వ్యతిరేక శక్తులను తుదముట్టించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఆర్డీఏ చట్టం, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించిన విషయాలతో కూడిన కరపత్రాలను శిబిరంలో అన్నదాతలకు పంచారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు కూలీలు మహిళలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా