ఈసారీ విచారణకు రాలేను
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సహనిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సోమవారం విచారణకు రాలేనంటూ సీˆబీఐకి ఆదివారం లేఖ రాశారు.
సీబీఐకి కడప ఎంపీ అవినాష్రెడ్డి లేఖ
తల్లి అనారోగ్యం గురించి ప్రస్తావన
ఈనాడు డిజిటల్, కడప: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సహనిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సోమవారం విచారణకు రాలేనంటూ సీబీఐకి ఆదివారం లేఖ రాశారు. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ శనివారం ఇచ్చిన నోటీసుకు బదులుగా ఎంపీ లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా గడువు మేరకు విచారణకు హాజరు కాలేనని.. మరింత సమయం కావాలని లేఖలో కోరారు. ప్రస్తుతం తన తల్లి ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. కోలుకుని డిశ్ఛార్జి అయ్యే వరకు విచారణకు రాలేనని లేఖలో వివరించారు. ఆసుపత్రిలో తల్లితో పాటే ఉన్నానని.. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆమెను వదిలి రాలేనన్నారు. తల్లి కోలుకోవడానికి దాదాపు పది రోజుల సమయం పట్టే అవకాశం ఉందని లేఖలో వివరించారు.
అవినాష్రెడ్డి లేఖ విషయంలో సీబీఐ స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవినాష్రెడ్డి లేఖలో పేర్కొన్న మేరకు గడువు ఇస్తుందా... లేక వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో ఇంకేదైనా నిర్ణయానికి వస్తుందా అనే చర్చ సాగుతోంది. వివేకా హత్య కేసులో ఎంపీని అరెస్టు చేయాల్సి ఉందన్న విషయాన్ని న్యాయస్థానంలో విచారణ సందర్భంగా సీబీఐ ప్రస్తావించింది. న్యాయస్థానాల్లో ముందస్తు బెయిల్కు ప్రయత్నించిన ఆయనకు సానుకూల అవకాశాలు కలగలేదు. ఈ పరిస్థితిలో నోటీసిచ్చి విచారణకు పిలిచిన అనంతరం వరుసగా మూడోసారి సైతం గడువు మేరకు హాజరు కాలేనంటూ సీబీఐకి తెలిపారు. అభియోగాలు మోపిన తర్వాత సీబీఐ మినహాయింపులు ఇవ్వడంపై తాజాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అరెస్టు చేస్తారని ప్రచారం
ఈనాడు, కర్నూలు, కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: కర్నూలు నగరంలోని విశ్వభారతి ఆసుపత్రి వద్ద ఆదివారం ఉదయం నుంచి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తమ ఎదుట సోమవారం హాజరుకావాలని సీబీఐ అధికారులు అవినాష్రెడ్డికి తాఖీదులు ఇచ్చిన విషయం తెలిసిందే. తన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తాను రాలేనని ఆయన సమాధానం పంపారు.
ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులే కర్నూలు బయలుదేరినట్లు ఆదివారం ప్రచారం జరిగింది. దీంతో ఆసుపత్రి వద్ద ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అవినాష్రెడ్డి కర్నూలు వచ్చిన తర్వాత కొందరు సీబీఐ అధికారులు కర్నూలు వచ్చి ఇక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అవినాష్రెడ్డి మాత్రం ఆసుపత్రి ప్రాంగణం దాటి బయటకు రాలేదు. తన తల్లి ఉన్న నాలుగో అంతస్తుకు.. తన కోసం వచ్చిన వారితో మాట్లాడేందుకు ఐదు అంతస్తులోకి మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. వాస్తవానికి నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో తన కోసం కొన్ని గదులు తీసుకున్నప్పటికీ ఆయన అక్కడికి వెళ్లిన దాఖలాలు లేవు. అవినాష్రెడ్డి సతీమణి, వైయస్ఆర్ జిల్లా నుంచి కొందరు నాయకులు, కార్యకర్తలు, ఆయన బంధువు డాక్టర్ అభిషేక్రెడ్డి తదితరులు ఆదివారం ఆసుపత్రికి వచ్చారు.
హోటళ్లు, లాడ్జీల కిటకిట
ఎంపీ అవినాష్రెడ్డి కోసం ఆయన అనుచరులు వందల సంఖ్యలో కర్నూలుకు రావడంతో నగరంలోని పలు హోటళ్లు, లాడ్జీలు కిటకిటలాడుతున్నాయి. వారందరికీ నగరంలో నివసిస్తున్న ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ ఎమ్మెల్యే భోజనాలు సమకూరుస్తున్నారు. అవినాష్రెడ్డి తల్లిని చూసేందుకు జిల్లాకు చెందిన పలువురు వైకాపా నేతలు, ఎమ్మెల్యేలు విశ్వభారతి ఆసుపత్రికి తరలివచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు