CBI - YSRCP - AP Police: సీబీఐయే.. బిక్కచచ్చిపోయేలా వైకాపా ప్రభుత్వ వ్యవహారశైలి
వారంతా అతి సామాన్యులు, సాధారణ పౌరులు. ప్రభుత్వ వైఫల్యాలపై ఆవేదనతో సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెడితే చాలు ఆగమేఘాలపై వారింట్లో పోలీసులు ప్రత్యక్షమైపోతారు.
అవినాష్రెడ్డిని కాపాడేందుకు అడ్డగోలుగా ముందుకు
ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలపై మాత్రం చిన్నవిషయానికీ ఉక్కుపాదం
నాలుగేళ్లుగా సామాన్యులను వెంటాడుతూ వేధిస్తూ..
వారంతా అతి సామాన్యులు, సాధారణ పౌరులు. ప్రభుత్వ వైఫల్యాలపై ఆవేదనతో సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెడితే చాలు ఆగమేఘాలపై వారింట్లో పోలీసులు ప్రత్యక్షమైపోతారు. బలవంతంగా వారిని ఎత్తుకెళ్లిపోతారు. ఎక్కడికి, ఎందుకు తీసుకెళ్తున్నారనేది కనీస సమాచారమివ్వరు. అసలు వారు నిజంగా పోలీసులేనా? ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నంత అరాచకంగా వ్యవహరిస్తారు. సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన ప్రభుత్వ వైఫల్యాల్ని తూర్పారపడుతూ పోరాడే ప్రతిపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలపై కేసులు బనాయించి... అర్ధరాత్రీ, అపరాత్రీ అని చూడకుండా వారిపై దండయాత్రకు వెళ్తారు. ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసినట్లుగా వందల మంది పోలీసులను మోహరించి.. వారి గ్రామాల్ని, ఇంటిని దిగ్బంధిస్తారు. గోడలు దూకుతారు, ఇళ్లల్లోకి చొరబడతారు. తలుపులు విరగ్గొడతారు. పడకగదిలోకి సైతం చొచ్చుకెళ్లి మరీ అదుపులోకి తీసుకుంటారు. ఘోరమైన నేరానికి పాల్పడ్డ వారిలా క్షణాల్లో అరెస్టు చేసి తీసుకెళ్లిపోతారు.
- గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో తరచూ కనిపిస్తున్న దృశ్యాలివి. జగన్ కనుసన్నలతో ఆంధ్రప్రదేశ్ సివిల్ పోలీసులు, సీఐడీ, ఏసీబీ అధికారుల నిర్వాకమిది.
* బాధితులు: సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు, సామాజిక వేత్తలు, ప్రజావేగులు.
ఇప్పుడు సీబీఐనే ముప్పుతిప్పలు పెడుతూ..
మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సొంత బాబాయ్ వివేకానందరెడ్డి అత్యంత కిరాతకంగా హత్యకు గురై నాలుగేళ్లు దాటిపోయింది. పలు సిట్లు ఏర్పాటు చేసినా నిజాలు నిగ్గు తేల్చలేకపోయాయి. మూడేళ్ల కిందట రంగంలోకి దిగిన సీబీఐ కేసులో ఒక్కో చిక్కుముడినీ విప్పుతూ.. తీగ లాగుతూ పలువుర్ని అరెస్టు చేసింది. డొంకంతా కదిల్చి కడప ఎంపీ వై.ఎస్.అవినాష్రెడ్డి దగ్గరకు వచ్చింది. ఈ కేసులో నిందితుడైన ఆయన్ను అరెస్టు చేస్తామని న్యాయస్థానాలకు నివేదించింది. ఈ నేపథ్యంలో సీబీఐని.. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు కలిసి ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా అవినాష్ను అరెస్టు చేయటానికి కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్దకు వెళ్లేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నించగా వారిని నిందితుడి దరిదాపుల్లోకి కూడా రానీయకుండా వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, వందల మంది మోహరించి దౌర్జన్యానికి తెగబడి, వీరంగం సృష్టించారు. తరిమికొట్టాల్సిన రాష్ట్ర పోలీసులే వారికి వత్తాసు పలుకుతున్నారు.
- గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో కనిపిస్తున్న పరిణామాలకు ఈ తాజా ఘటనలు పరాకాష్ఠ.
* బాధితులు: సీబీఐ, ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్న వివేకా కుమార్తె సునీత
ఈనాడు - అమరావతి: వివేకా హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని అరెస్టు చేయటానికి వచ్చిన సీబీఐనే ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. అవినాష్రెడ్డిని అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్లాలంటే మీకు ఎన్ని గుండెలు ఉండాలి? ఎంత ధైర్యం కావాలి? అన్నట్లుగా తన చర్యల ద్వారా సీబీఐకే సవాల్ విసరుతోంది. అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే సీబీఐపై ఎంతటికైనా తెగిస్తామంటూ తన తాజా చర్యల ద్వారా తీవ్రంగా హెచ్చరిస్తోంది. దేశవ్యాప్తంగా నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సీబీఐ.. ఏపీలో మాత్రం రాష్ట్ర పోలీసులు, ఏపీ ప్రభుత్వ అరాచక చర్యలతో బిక్కచచ్చిపోయింది.
రఘురామకు వేధింపులు.. అవినాష్కు వత్తాసు
అవినాష్రెడ్డి, రఘురామకృష్ణరాజు.. ఇద్దరూ వైకాపా ఎంపీలే. అవినాష్ ముఖ్యమంత్రి జగన్కు సమీప బంధువు. రఘురామకృష్ణరాజు వైకాపా ప్రభుత్వ విధానాల్లోని లోపాల్ని ఎత్తి చూపుతూ, వైఫల్యాల్ని ప్రస్తావిస్తూ సునిశిత విమర్శలు చేస్తుంటారు. అందుకే ఆయనపై ఏకంగా రాజద్రోహం కేసు పెట్టి మరీ అరెస్టు చేశారు. రాత్రంతా నిర్బంధంలో ఉంచి చిత్రహింసలు పెట్టారు. రాష్ట్రంలోని వివిధ పోలీసుస్టేషన్లలో ప్రభుత్వం ఆయనపై లెక్కలేనన్ని కేసులు నమోదు చేసింది. తనపై ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి కల్పించింది. ఆయన్ను రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా చేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే తన సొంత పార్టీ ఎంపీని అంతలా హింసించిన జగన్ ప్రభుత్వం.. హత్య కేసులో నిందితుడిగా తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్రెడ్డికి అన్ని రకాలుగా కొమ్ముకాస్తుండటం కావాల్సిన వారు ఎన్ని తప్పులు చేసినా వారిని కాపాడటానికి ఎంతకు తెగించడానికైనా వెనుకాడని ప్రభుత్వ తీరుకు నిదర్శనం.
రక్తస్రావమవుతున్నా వదల్లేదే?
* తెదేపా నాయకుడు, మాజీ మంత్రి పి.నారాయణ తన కుమారుడు నిషిత్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు భార్యతో కలిసి కారులో వెళ్తుండగా మఫ్టీలో ఉన్న చిత్తూరు పోలీసులు హైదరాబాద్లోని మాదాపూర్ వద్ద అడ్డగించారు. నారాయణ సతీమణిని కిందకు దించేసి, అదే కారులో ఆయన్ను తీసుకెళ్లిపోయారు. కుమారుడి వర్ధంతి కార్యక్రమం ముగించుకుని వస్తానని చెప్పినా వినకుండా ఆయన్ను కక్ష కట్టినట్లు లాక్కెళ్లారు.
* తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు మొలల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఇటీవలే శస్త్రచికిత్స జరిగిందని, మందులు వేసుకుని వస్తానని చెప్పినా సమయమివ్వలేదు. శ్రీకాకుళం నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని విజయవాడకు రోడ్డు మార్గంలో ఆయన్ను తీసుకొచ్చారు. దారి పొడవునా రక్తస్రావమవుతున్నా కనికరించలేదు.
* తెదేపా నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర ఇంటిని దాదాపు 300 మంది పోలీసులు చుట్టిముట్టి ఆయన్ను అరెస్టు చేశారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్డిలోకి వెళ్లిన ఆయన్ను తలుపులు కొట్టి మరీ బయటకు రప్పించారు.
* తెదేపా నాయకుడు కూన రవికుమార్ను ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులు అరెస్టు చేశారు.
* అధికార పార్టీ నాయకుల్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఫార్వర్డ్ చేశారంటూ తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడైన 70 ఏళ్ల వృద్ధుడు నలంద కిశోర్ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆరోగ్యం సరిగ్గా లేదని, ఉదయం వస్తానని చెప్పినా వినకుండా విశాఖపట్నం నుంచి కర్నూలు వరకూ రోడ్డు మార్గంలో తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన మరణించారు.
* తెదేపా నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులను కనీసం చొక్కా వేసుకోవటానికి కూడా సమయం ఇవ్వకుండా అరెస్టు చేశారు.
* తెదేపా నాయకుడు చింతకాయల విజయ్కు నోటీసులివ్వటానికి హైదరాబాద్ వెళ్లిన సీఐడీ పోలీసులు.. అక్కడ ఆయన అందుబాటులో లేకపోవటంతో చిన్న పిల్లయిన విజయ్ కుమార్తెను బెదిరించారు.
ఇలా ఎవరైనా ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే లేనిపోని కేసులు బనాయించి అరెస్టులు పేరిట వేధిస్తారు కానీ.. హత్య కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నా అరెస్టు చేయకూడదా? ఇలా వ్యవహరించే జగన్ ప్రభుత్వానిది చట్టబద్ధ పాలన ఎలా అవుతుంది?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.