CBI-Supreme Court: న్యాయశాస్త్రంలో ఇది 8వ వింత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి లొంగిపోవాలని చెబుతూనే.. ఆయన్ను జులై 1న విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 27న జారీ చేసిన ఉత్తర్వులు 8వ వింతను తలపిస్తున్నాయని సీబీఐ పేర్కొంది.
గంగిరెడ్డిని జులై 1న విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సీబీఐ వ్యాఖ్య
తదుపరి విచారణ రేపటికి వాయిదా
ఈనాడు, దిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి లొంగిపోవాలని చెబుతూనే.. ఆయన్ను జులై 1న విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 27న జారీ చేసిన ఉత్తర్వులు 8వ వింతను తలపిస్తున్నాయని సీబీఐ పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ బుధవారం జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ పంకజ్ మిత్తల్లతో కూడిన వేసవి సెలవుల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) సంజయ్ జైన్ వాదనలు వినిపిస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్ను తాము సమర్థిస్తున్నామన్నారు. దీనిపై గురువారం కల్లా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. గంగిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదిస్తూ తాము కూడా బెయిల్ రద్దును సవాలు చేస్తూ ఒక ఎస్ఎల్పీ దాఖలు చేశామన్నారు. అది ఇంకా లిస్ట్ కావాల్సి ఉన్నందున దాన్ని కూడా కలిపి విచారించాలని కోరారు. దాంతో జస్టిస్ నరసింహ రెండు కేసులనూ శుక్రవారానికి వాయిదా వేశారు. బుధవారం విచారణ ప్రారంభమైన వెంటనే సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ బెయిల్ రద్దు చేసే సమయంలో మళ్లీ బెయిల్ ఎలా ఇస్తారు? విజ్ఞప్తి లేకుండానే ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. జస్టిస్ నరసింహ స్పందిస్తూ ఆ ఉత్తర్వులను తాము చూశామన్నారు. కౌంటర్స్ పేరుతో విషయాన్ని సంక్లిష్టం చేయడానికి బదులు ఈ పిటిషన్పై అభిప్రాయం చెప్పడానికి అడ్డంకి ఏముందని సీబీఐ న్యాయవాదిని ప్రశ్నించారు. ఏఎస్జీ జైన్ స్పందిస్తూ ఈ ఉత్తర్వు బెయిల్ న్యాయశాస్త్రంలో 8వ వింతలా కనిపిస్తోందని, ఇలాంటిది తామెప్పుడూ వినలేదని పేర్కొన్నారు. ఒకవైపు బెయిల్ రద్దు చేస్తూనే మరోవైపు బెయిల్ ఇవ్వడం ఎలా సాధ్యమని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వుల్లోనే పరస్పర వైరుద్ధ్యం ఉందని పేర్కొన్నారు. జస్టిస్ నరసింహ జోక్యం చేసుకుంటూ ‘మేం సమతుల్యమైన ఉత్తర్వులు జారీ చేస్తాం. ఆయన బెయిల్ కోరుతూ దరఖాస్తు చేసుకోకుండా అడ్డంకులు కల్పించం. రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకోవచ్చు. హైకోర్టు ఎన్నో కారణాలు చెప్పి బెయిల్ రద్దు చేసిన తర్వాత మళ్లీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తూ ఉత్తర్వుల్లోని చివరి భాగంలో చెప్పింది. వాస్తవంగా ఇది బెయిల్ రద్దుకు సంబంధించిన అంశం’ అని పేర్కొన్నారు. మొత్తం ఉత్తర్వుల్లో అదే కీలకాంశమని, ఆ భాగమే మొత్తాన్ని దెబ్బతీసిందని సీబీఐ న్యాయవాది వ్యాఖ్యానించారు.
100 సార్లు సీబీఐ విచారణకు హాజరు..
హైకోర్టు ఉత్తర్వులపై ప్రతివాది తరఫు న్యాయవాది ఏమంటారని జస్టిస్ నరసింహ ప్రశ్నించారు. గంగిరెడ్డికి ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్ లభించిన తర్వాత దాదాపు 100 సార్లు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మీ బెయిల్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎస్ఎల్పీ ఏమైనా వేశారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా అవునని చెప్పారు. జస్టిస్ నరసింహ స్పందిస్తూ బెయిల్ రద్దు విధానాన్ని మీరు సవాల్ చేసినప్పుడు దాన్ని వినాల్సి ఉంటుందన్నారు. ఈ రోజు ఆ ఉత్తర్వులను తోసిపుచ్చి, రేపు మీ పిటిషన్ను తీసుకోవడం బాగుండదని వ్యాఖ్యానించారు. అందువల్ల రెండు కేసులను కలిపి శుక్రవారం వింటామంటూ ఉత్తర్వులు జారీచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి