YS Avinash Reddy: విశ్వభారతి వీధిలో ‘అధికార’ పెత్తనం
కర్నూలు గాయత్రి ఎస్టేట్ ప్రాంతంలో విశ్వభారతి ఆసుపత్రి ఉన్న వీధిలో గత వారం రోజులుగా ఎంపీ అవినాష్రెడ్డి అనుచరుల పెత్తనం సాగుతోంది. ఆ వీధిలో అనధికార ఆంక్షలు కొనసాగుతున్నాయి.
తిష్ఠ వేసిన అవినాష్రెడ్డి అనుచరులు
అడుగడుగునా నిఘా.. సమాచార సేకరణ
రహస్య ప్రదేశంలో సీబీఐ బృందం
ఈనాడు, కర్నూలు, కర్నూలు వైద్యాలయం, న్యూస్టుడే: కర్నూలు గాయత్రి ఎస్టేట్ ప్రాంతంలో విశ్వభారతి ఆసుపత్రి ఉన్న వీధిలో గత వారం రోజులుగా ఎంపీ అవినాష్రెడ్డి అనుచరుల పెత్తనం సాగుతోంది. ఆ వీధిలో అనధికార ఆంక్షలు కొనసాగుతున్నాయి. అవినాష్రెడ్డికి మద్దతుగా పులివెందుల నుంచి పలువురు మహిళలు గురువారం ఇక్కడికి తరలివచ్చారు. వారు విశ్వభారతి ఆసుపత్రి ముందు బైఠాయించి ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. వీధి ప్రారంభం నుంచి చివరి వరకు.. ఆ వీధికి అనుకుని ఉన్న ఇతర మార్గాలు.. ప్రధాన రహదారి కలిసే అడ్డరోడ్లలో వైకాపా నాయకులు పహారా కాస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఓ సీఐ అభ్యంతరకరంగా మాట్లాడారంటూ ఆయన్ను అందరి ముందూ ఓ నేత అసభ్య పదజాలంతో దూషించడంతో పోలీసులూ బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి తలెత్తింది. మూడు రోజుల కిందటే బదిలీపై వచ్చిన ఆయన బుధవారం నాటి ఘటనతో తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు సమాచారం. గురువారం ఆయనకు ఆసుపత్రి వద్ద బందోబస్తు బాధ్యతలు అప్పగించకుండా దూరం పెట్టారు. బదిలీ చేస్తే పార్టీకి నష్టమని పలువురు చెప్పడంతో ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారని తెలుస్తోంది. అవినాష్రెడ్డి గురువారం తనను కలిసిన పలువురు అనుచరులతో మాట్లాడారు.
వ్యాపారాలు లేక విలవిల
గాయత్రి ఎస్టేట్ పరిసరాలన్నీ వైకాపా నాయకులతో నిండిపోయాయి. అయిదు రోజులుగా ఆ ప్రాంతంలో పోలీసుల బందోబస్తు పెరగడం.. అధికార పార్టీ నేతలు తిష్ట వేయడంతో సామాన్య జనం అటు వెళ్లడం లేదు. ఈ పరిసరాల్లో ఎన్నో ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్లు, క్లీనిక్ సెంటర్లు ఉన్నాయి. ఔషధ దుకాణాల్లో వ్యాపారాలు జరగక యజమానులు దిగులు చెందుతున్నారు. విశ్వభారతి ఆసుపత్రికి పక్కనే ఉన్న ఔషధ దుకాణంలో నిత్యం రూ.10 వేల వరకూ వ్యాపారం జరిగేది.. రోగులెవరూ రాకపోవడంతో మంచినీటి సీసాలు, శీతలపానీయాలు మాత్రమే అమ్ముతున్నారు. మధుమేహం రోగులకు చికిత్స అందించే ఓ వైద్యుడి వద్దకు నిత్యం కనీసం 30 మంది వచ్చేవారు.. ఇప్పుడు 10 మంది రావడమే గగనమవుతోందని ఆ వైద్యుడు తెలిపారు.
కోలుకొంటున్న శ్రీలక్ష్మి
అవినాష్రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యులు హెల్త్ బులెటిన్లో గురువారం ప్రకటించారు. ‘గత మూడురోజుల్లో ఆమెలో గణనీయమైన పురోగతి కనిపించింది’ అని తెలిపారు.
బుగ్గన ఎందుకు రాలేదో
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి గురువారం నగరానికి వచ్చారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అక్కడికి కూతవేటు దూరంలోనే విశ్వభారతి ఆసుపత్రి ఉన్నప్పటికీ ఆయన అక్కడికి వెళ్లి అవినాష్రెడ్డి తల్లిని పరామర్శించలేదు. ఉమ్మడి జిల్లాలోని పలువురు వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లి అవినాష్రెడ్డితో మాట్లాడారు. మంత్రి బుగ్గన ఆసుపత్రికి వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది.
వాహనాలన్నీ మొబైల్ బార్లే
కర్నూలులో మద్యం విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. ఎంపీ అవినాష్రెడ్డి మద్దతుగా వైయస్ఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వైకాపా నేతలు తరలొస్తున్నారు. రాత్రింబవళ్లు గాయత్రి ఎస్టేట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్నారు. లాడ్జీలన్నీ కిటకిటలాడుతున్నాయి. వైకాపా నాయకులు, కార్యకర్తలూ కేసులకొద్దీ మద్యం కొనుగోలు చేసి లాడ్జీలకు తీసుకు వెళుతున్నారు. పలువురు నాయకులు తమ వాహనాలను మొబైల్ బార్లుగా మార్చేసుకున్నారు. కర్నూలులో ఉన్న 23 మద్యం దుకాణాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి 24 వరకు రూ.3.14 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గాయత్రి ఎస్టేట్ సమీపంలోని బుధవారపేట మద్యం దుకాణంలోనే రూ. 22.59 లక్షల మద్యం, మద్దూర్నగర్లోని దుకాణంలో రూ.15.09 లక్షల విలువగల మద్యం విక్రయాలు జరిగాయి.
రహస్య ప్రదేశంలో సీబీఐ అధికారులు
అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై గురువారం తీర్పు వెలువడుతుందన్న ఉద్దేశంతో తదుపరి చర్యల కోసం సీబీఐ అధికారులు మళ్లీ కర్నూలు వచ్చారు. అనూహ్యంగా పిటిషన్ విచారణ శుక్రవారానికి వాయిదా పడడంతో వారు నగరంలోని ఆ రహస్య ప్రదేశంలోనే ఉన్నట్లు సమాచారం.
రోగుల్లో అసహనం
కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో ఎంపీ అవినాష్రెడ్డి తల్లి శ్రీలక్ష్మి చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన అనుచరులు పెద్దఎత్తున ఆసుపత్రికి చేరుతున్నారు. వీధిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం.. ఆసుపత్రికి చెందిన అంబులెన్సులను వేరేదారిలో మళ్లిస్తుండటంతో రోగులు, వారి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్సులూ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నాయి.
ఈనాడు, కర్నూలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి