Saint Lukes - YS Vimala Reddy: చర్చి వెలిసింది... ఆసుపత్రి ఏమైంది?
సేవ చేస్తామని చెప్పి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గుప్పిట్లో పెట్టుకున్నారు. అధికారపార్టీ కీలకనేత కుటుంబం ఆశీస్సులతో నెట్టుకొస్తున్నారు.
లక్ష్యం నెరవేరకున్నా రూ.కోట్ల విలువైన భూమి గుప్పిట్లోనే
సెయింట్ లూక్స్ సంస్థకు 7.35 ఎకరాల కేటాయింపు
ఏళ్లు గడుస్తున్నా కానరాని పేదల ఆసుపత్రి భవనం
దరఖాస్తులో లేని ప్రార్థనా మందిరం మాత్రం నిర్మించారు
ఈ చర్చితో వైఎస్ విమలారెడ్డికి అనుబంధం!
ఈనాడు, విశాఖపట్నం: సేవ చేస్తామని చెప్పి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గుప్పిట్లో పెట్టుకున్నారు. అధికారపార్టీ కీలకనేత కుటుంబం ఆశీస్సులతో నెట్టుకొస్తున్నారు. లక్ష్యాన్ని పక్కనపెట్టి భూ వినియోగంలో నిబంధనలకు పాతరేశారు. ఆసుపత్రి కట్టాలంటే సవాలక్ష సాకులు చెబుతున్న నిర్వాహకులు.. అక్కడ ఓ ప్రార్థన మందిరాన్ని మాత్రం ఎప్పుడో నిర్మించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తప్పేమీ చేసి ఉండకపోవచ్చంటూ కితాబిచ్చిన ఆయన అత్త వైఎస్ విమలారెడ్డి... తరచు ఈ ప్రార్థన మందిరానికి వచ్చి మతపరమైన సందేశాలు ఇస్తుంటారట! విశాఖ సాగర తీరంలో రూ.300 కోట్ల విలువైన భూమి చుట్టూ నడుస్తున్న తతంగమిది!! అంతేనా... వైకాపా అధికారంలోకి రాగానే నిబంధనల ఉల్లంఘన పేరుతో తెదేపా నేతల ఆస్తులపై ఉక్కుపాదం మోపింది. ఇక్కడ భూ వినియోగం లక్ష్యానికి విరుద్ధంగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదు.
ఇలా చెప్పి చక్కబెట్టారు
‘సెయింట్ లూక్స్ మైనారిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ విశాఖ కేంద్రంగా పనిచేస్తోంది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. క్రిస్టియన్ కమ్యూనిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల సాధికారిత కోసం నర్సింగ్ శిక్షణ ఇస్తాం. దీనికి అవసరమైన స్థలం కేటాయించాలి. ఆసుపత్రి నిర్మాణం, మౌలిక వసతులు, శిక్షణ తరగతులకు అనుగుణంగా నిర్మించాల్సి ఉన్నందున తక్కువ ధరకు భూమిని ఇవ్వాలి. పేదల వైద్య అవసరాలు తీర్చేలా మిషనరీ ఆసుపత్రి నడిపి సమీప గ్రామాలు, పునరావాస కేంద్రాల్లో మందుల పంపిణీ, వైద్య శిబిరాల వంటివి నిర్వహిస్తాం’ - ఇదీ సెయింట్ లూక్స్ సంస్థ 2004లో చేసిన దరఖాస్తు సారాంశం. 2009 ఫిబ్రవరి 20న స్థలం కేటాయిస్తూ అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విచిత్రమేమంటే 2004లో దరఖాస్తు చేయగా, 2006లో కేబినెట్ ఈ తీర్మానాన్ని తిరస్కరించింది. అయినా వైఎస్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండటంతోనే దస్త్రం ముందుకు కదిలి విలువైన భూమిని కేటాయించినట్లు అప్పట్లో విమర్శలొచ్చాయి.
వెనక్కి తీసుకోవాలని సూచించినా..
ఓ లక్ష్యంతో ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమి వినియోగంలో నిబంధనలకు పాతరేశారు. కేటాయించిన భూమిలో కొంత రోడ్డు విస్తరణకు పోగా, 6 ఎకరాలకు పైగా సంస్థ ఆధీనంలో ఉంది. ఇందులో కొంత భాగంలో మూడు రేకుల షెడ్లు నిర్మించి నర్సింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఇటీవలే నర్సింగ్ విద్యార్థినులకు వసతిగృహం ఏర్పాటుచేశారు. తాజాగా మ్యూజిక్, యోగ శిక్షణ ఇచ్చేందుకు ఏయూతో కలిసి అడుగులు పడ్డాయి. అయితే, ఆసుపత్రి భవనం నిర్మించి ఉచిత వైద్యసేవలు అందిస్తామన్న మాటను మాత్రం గాలికొదిలేశారు. భూమి కేటాయించిన తర్వాత నిర్దేశిత సమయంలో సేవలు అందుబాటులోకి తేవాలి. పద్నాలుగేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో లక్ష్యం నెరవేరకపోగా, విలువైన భూములను ఖాళీగా ఉంచి చేతుల్లో పెట్టుకోవడం గమనార్హం. ఇదే విషయంపై కొన్నేళ్ల క్రితం వేసిన కమిటీ... ఖాళీ భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే వైఎస్ కుటుంబసభ్యులతో సంబంధాలు ఉండటంతో.. దీనిపై దృష్టి పెట్టలేదన్న ఆరోపణలున్నాయి.
విమలారెడ్డి పర్యటనలు
పేదల కోసం ఆసుపత్రి ఎందుకు కట్టలేదంటే.. ఇక్కడ మట్టి స్వభావం అందుకు అనుగుణంగా లేదని సంస్థ నిర్వాహకులు సాకు చెబుతున్నారు. కానీ, అసలు దరఖాస్తులో చూపించని ప్రార్థన మందిరాన్ని మాత్రం ఎప్పుడో కట్టేశారు! ఇక్కడికి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమలారెడ్డి మత సందేశం ఇవ్వడానికి తరచూ వస్తున్నట్లు సమాచారం. 2019 ఏప్రిల్ 21న చర్చి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు.. మధ్యమధ్యలో సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆసుపత్రి ఆలస్యం.. అందుకే వైద్య శిబిరాలు
ఈ అంశంపై సొసైటీ కరస్పాండెంట్ ప్రీతం లూక్స్ ‘ఈనాడు’తో మాట్లాడుతూ... ఆసుపత్రి, ఇతర భవన నిర్మాణాల అనుమతులకు రెండు, మూడుసార్లు దరఖాస్తు చేసినా అనుమతులు రాకపోవడం వల్లే ఆలస్యమైందన్నారు. అయినా తాత్కాలికంగా వైద్య సేవలు అందిస్తూ, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
సముద్ర తీరానికి అభిముఖంగా..
విశాఖలో విలువైన భూములను దక్కించుకోవాలని ముందునుంచే ప్రణాళిక రచించినట్లు దరఖాస్తు చూస్తే అర్థమవుతుంది. సాగర తీరానికి చేరువలో సముద్రానికి అభిముఖంగా స్థలం ఇవ్వాలని కోరారు. అందుకు అనుగుణంగానే స్థలం గుర్తించారు. ప్రభుత్వం నుంచి రెవెన్యూశాఖకు భూ కేటాయింపుపై దస్త్రం రాగా, దానిపై కలెక్టర్ నివేదిక ఇస్తూ అందులో భూమి అప్పటి మార్కెట్ విలువ ఎకరా రూ.1.50 కోట్లుగా పేర్కొన్నారు. సేవ పేరుతో ఎకరా రూ.25 లక్షలకే కట్టబెట్టారు. భూపరిపాలన శాఖ నిర్ణయం తీసుకుని సొసైటీకి విశాఖ గ్రామీణ మండలం ఎండాడ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 16/1లో 7.35 ఎకరాలు కేటాయించింది. ఈ భూమి జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో దీని విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.300 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో