తెలుగు దీనస్థితికి మనమూ కారణమే: వెంకయ్యనాయుడు
తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని, ఈ దీన స్థితికి మనమూ కారణమేనని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
నారాయణగూడ, న్యూస్టుడే: తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని, ఈ దీన స్థితికి మనమూ కారణమేనని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వేదికలపై, చట్టసభల్లో అభ్యంతరకరమైన భాష వాడుకభాషగా మారడం దురదృష్టకరమన్నారు. మనం పోలింగ్ ‘బూత్’కు వెళ్లి.. ‘బూతు’ మాట్లాడేవారికి ఓటుతో సమాధానం చెప్పాలని సూచించారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్-నృత్యకిన్నెరల ఆధ్వర్యంలో గురువారం జరిగిన దివంగత ముఖ్యమంత్రి డా.ఎన్.టి.రామారావు శతజయంతి మహోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏపీ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్కు ‘కిన్నెర-ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారం ప్రదానం చేశారు. ఈ సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... నియంతృత్వాన్ని ఎదిరించిన ధీరోదాత్తుడు, ప్రజల మనిషి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన్ను పదవీచ్యుతుడిని చేసి ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడవడాన్ని సహించలేకపోయానన్నారు.
ఆయనకు మద్దతుగా అప్పుడు తాను, జైపాల్రెడ్డి తదితరులమంతా నిలబడి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నామన్నారు. అప్పుడు ‘మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా నాకు చాలా సహాయం చేశారు. మీరు నా మంత్రివర్గంలో చేరాలి’ అని ఎన్టీఆర్ ఆహ్వానించారని గుర్తు చేసుకున్నారు. సినీరంగంతోపాటు రాజకీయాల్లోనూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. భాష విషయానికి వస్తే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పంచాయతీ వరకు ప్రతి విషయం తెలుగులోనే జరిగేలా చూడటం మనందరి కర్తవ్యం అనేవారన్నారు.ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్, ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సాహితీవేత్త వోలేటి పార్వతీశంలు మాట్లాడారు. మండలి బుద్ధప్రసాద్ స్పందించారు. కిన్నెర కార్యదర్శి మద్దాళి రఘురామ్ స్వాగతం పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
సంక్షిప్త వార్తలు
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
చెరలోనే అనుమానితులు!
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులు ఇంకా పోలీసుల చెరలోనే ఉన్నారు. వారి ఆచూకీ గురించి చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
సెలవుపై వెళ్లిన గృహనిర్మాణ సంస్థ ఎండీ
గృహనిర్మాణ సంస్థ ఎండీ వెంకటరమణారెడ్డి నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆరోగ్యపరమైన కారణాలతో సెలవు కోసం ఆయన దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం అనుమతించింది. -
ఇదేనా బైబిల్కిచ్చే గౌరవం?
మ్యానిఫెస్టో అత్యంత పవిత్రమైంది... మాకది బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానం! ఇందులో ఇస్తున్న ప్రతి హామీని నెరవేర్చి తీరుతా... అమలు చేయలేని హామీని ఇవ్వను... ఇచ్చిన వాటిని మరెవ్వరికీ సాధ్యం కానట్లుగా అమలు చేస్తా... 2019 ఎన్నికలప్పుడు జగన్ ఊరూరా ఊదరగొట్టిన మాటలివి!!
తాజా వార్తలు (Latest News)
-
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’