‘రొయ్య’కు కరెంట్ షాక్
విద్యుత్ కోతలు ఆక్వా రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేళాపాళా లేకుండా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
నెల రోజులుగా విద్యుత్ కోతలతో ఇబ్బందులు
జనరేటర్ నిర్వహణ కోసం భారీగా ఖర్చు
అదనపు భారంతో రైతులకు తప్పని వెతలు
ఈనాడు-అమరావతి
‘గణపవరం మండలం కేశవరం పరిధిలోని మూడు ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నా. వేళాపాళా లేకుండా విధిస్తున్న విద్యుత్ కోతల కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమయంలో జనరేటర్ నిర్వహణ కోసం రోజుకు రూ.3 వేలు ఖర్చు చేస్తున్నా. ఇప్పటికే రొయ్యల ధర ఆశించిన స్థాయిలో లేదు. దీనికితోడు డీజిల్, జనరేటర్ కోసం చేసే ఖర్చు అదనపు భారంగా మారింది’
సప్పా ప్రవీణ్ రైతు, పశ్చిమగోదావరి
‘నిడమర్రు మండలంలో సుమారు 10 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నా. నెల రోజులుగా రోజూ విద్యుత్ కోతలు తప్పడం లేదు. రొయ్యలను కాపాడుకోటానికి నిత్యం జనరేటర్లో డీజిల్ కోసం రూ.4 వేలు ఖర్చు చేస్తున్నా. గతంలో గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం లేదని కోతలు పెట్టారు. ఇప్పుడు ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేసినా సమస్య తీరలేదు’
చనపతి సూరిబాబు, రైతు
విద్యుత్ కోతలు ఆక్వా రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేళాపాళా లేకుండా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాత్రివేళల్లో కనీసం.2, 3 గంటల పాటు విధిస్తున్న విద్యుత్ కోతల వల్ల చెరువుల్లో ఏరియేటర్స్ పనిచేయడం లేదు. రొయ్యను కాపాడుకోడానికి రైతులు జనరేటర్లను వినియోగించాల్సి వస్తోంది. వాటి అద్దె, డీజిల్ కోసం కనీసం రోజుకు రూ.2 నుంచి రూ.3 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.
నెల రోజులుగా కోతలతో ఇబ్బంది
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు. ఇందులో సుమారు 2 లక్షల ఎకరాలు గణపవరం, నిడమర్రు, ఉండి, భీమవరం, పాతకోడేరు, కాళ్ల, ఆకివీడు మండలాల పరిధిలోనే ఉంది. రాష్ట్రంలో ఆక్వా సాగు జరిగే ప్రాంతాల్లోని రైతులకు కోతలు లేకుండా విద్యుత్ అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పగటి వేళల్లో కొద్ది సేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా. సర్దుబాటు చేసుకోడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా రాత్రి వేళల్లో కోతలు పెడుతున్నారు. దీంతో రూ.లక్షల ఖర్చుతో రొయ్యల సాగు చేపట్టిన రైతులు.. దాన్ని కాపాడుకునేందుకు కంటి మీద కునుకు లేకుండా చెరువుల దగ్గర కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ అంతరాయం కారణంగా కనీసం 10 నిమిషాలు ఏరియేటర్స్ పనిచేయడం ఆలస్యమైనా ఆక్సిజన్ అందక రొయ్యకు ఇబ్బంది ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
డీజిల్ భారం రోజుకు రూ.2 వేలు పైనే..
విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో జనరేటర్ వినియోగానికి గంటకు కనీసం 5-6 లీటర్ల డీజిల్ను వినియోగించాల్సి ఉంది. దీనికి రూ.600 వరకూ ఖర్చు అవుతుంది. ఈ లెక్కన రోజుకు 3 గంటల పాటు జనరేటర్ వినియోగానికి రూ.1,800 వంతున రైతులు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పాటు జనరేటర్ సామర్థ్యాన్ని బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు అద్దె రూపేణా చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే రొయ్యకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నామని.. 100 కౌంట్కు రూ.230 ధర మాత్రమే వస్తోందని రైతులు పేర్కొన్నారు. రొయ్య మేత, విద్యుత్ ఛార్జీలు, ఇతర ఖర్చులు పెరగడంతో ఎకరాకు రూ.3-4 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం లాభాల మాట ఎలాగున్నా.. పెట్టుబడి కూడా వెనక్కి రావడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే