31 వరకు అవినాష్రెడ్డిని అరెస్టు చేయొద్దు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్కు సంబంధించి తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశం
తల్లికి శస్త్రచికిత్స అవాస్తవమైతే చర్యలు
ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి లేదని వ్యాఖ్య
ఈనాడు, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్కు సంబంధించి తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్పై శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు, మళ్లీ శనివారం మధ్యాహ్నం దాకా ఇరుపక్షాల మధ్య కొనసాగిన సుదీర్ఘ వాదనలు పూర్తయ్యాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ కోర్టు ముందున్న విస్తృత సమాచారాన్ని క్రోడీకరించి ఇప్పటికిప్పుడు తుది ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని, 31న తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు. దీనిపై అవినాష్ తరఫు న్యాయవాది ఇ.ఉమామహేశ్వరరావు స్పందిస్తూ పిటిషనర్ తల్లిని కర్నూలు నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. గుండె కవాటాలు మూసుకుపోవడంతో శస్త్రచికిత్సకు చేర్పించారన్నారు. దీనిపై సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ తన్వర్ స్పందిస్తూ అవినాష్రెడ్డి తల్లిని ఆసుపత్రిలో చేర్చించారనడానికి ఎలాంటి మెడికల్ రికార్డు సమర్పించలేదని, అరెస్టును తప్పించుకోవడానికే సాకుగా చెబుతున్నారన్నారు. శస్త్రచికిత్స అవసరమని.. ఆ ప్రక్రియ కొనసాగుతుందని అవినాష్రెడ్డి తరఫు న్యాయవాది చెప్పిన వివరాలను నమోదు చేస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది అవాస్తవమని తేలితే కోర్టు తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కోర్టు ముందున్న విస్తృత సమాచారంతో పాటు ఇంకా అదనపు వివరాలను సీల్డ్ కవర్లో సమర్పిస్తామని సీబీఐ చెబుతోందని, వీటన్నింటి పరిశీలించి తుది ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి ఈ కోర్టుకు లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేగాకుండా అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసిన తర్వాత నమోదు చేసిన వాంగ్మూలాలను కోర్టుకు సమర్పిస్తామని, నిష్పాక్షిక దర్యాప్తు నిమిత్తం వాటిని పిటిషనర్కు ఇవ్వరాదని సీబీఐ న్యాయవాది పేర్కొన్నారన్నారు. దీంతోపాటు పిటిషనర్ తండ్రి ఇప్పటికే జైల్లో ఉన్నారని, ఈ కారణాలన్నింటి దృష్ట్యా పిటిషన్పై తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు అవినాష్రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐని నియంత్రించడానికే ఈ కోర్టు మొగ్గు చూపుతోందన్నారు. అందువల్ల అవినాష్రెడ్డిని అరెస్ట్ చేయరాదని ఆదేశిస్తూ తీర్పు నిమిత్తం పిటిషన్ను ఈ నెల 31కి వాయిదా వేశారు.
న్యాయవాదుల పరస్పర అసహనం
వాదనల సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది, పీపీలు, సునీత తరఫు న్యాయవాదులు ఒకరిపై మరొకరు అసహనం వ్యక్తం చేశారు. వాదనలు వినిపిస్తుండగా ఆవేశంగా అడ్డుకోవడం ప్రారంభించారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని, ఒకరు మాట్లాడేటప్పుడు మరొకరు జోక్యం చేసుకోరాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తప్పుగా వాదనలు వినిపిస్తూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రతి దశలోనూ న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సర్దిచెబుతూ వచ్చారు. న్యాయవాదులు చెప్పేదంతా నిజమేనంటారా అని ప్రశ్నించారు. సహనంగా వాదనలు వినిపించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. -
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
బస్సులు సీఎం సభకు.. కష్టాలు ప్రయాణికులకు
ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి సభకు తరలించడంతో కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రయాణికులు అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
మూడు రాజధానులు ఏర్పాటు చేశాం
‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కరవును కళ్లారా చూడు జగనన్నా
‘ఏడాది ఓపిక పట్టండి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి