CSE - IT Jobs: సీఎస్ఈనే సర్వస్వం కాదు
‘‘మనిషిలాగా ఆలోచించి శరవేగంగా ఏమైనా చేయగల సాంకేతికత వస్తుందని 2017లో తొలిసారిగా ఓ పరిశోధన పత్రం ప్రచురితమైంది. అది చాట్ జీపీటీ రూపంలో వచ్చేసింది.
వచ్చే పదేళ్లలో ఆ బ్రాంచి విద్యార్థుల కొలువులకు ముప్పు
చాట్ జీపీటీ లాంటి టూల్సే ఉద్యోగుల పనులు చేస్తాయి
కృత్రిమ మేధతో ఎన్నో రంగాలపై ప్రభావం
‘ఈనాడు’ ముఖాముఖిలో వేన్ స్టేట్ యూనివర్సిటీ ఆచార్యుడు రత్నబాబు చిన్నం
ఈనాడు, హైదరాబాద్: ‘‘మనిషిలాగా ఆలోచించి శరవేగంగా ఏమైనా చేయగల సాంకేతికత వస్తుందని 2017లో తొలిసారిగా ఓ పరిశోధన పత్రం ప్రచురితమైంది. అది చాట్ జీపీటీ రూపంలో వచ్చేసింది. గత నవంబరులో విడుదలైన చాట్ జీపీటీ ఇప్పటికే అత్యంత తెలివిగా సమాధానాలు ఇస్తోంది. కొన్ని రకాల సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కోడ్లను కూడా బాగా రాస్తోంది. వచ్చే పదేళ్లలో ఇది ఎలా మారుతుంది? మనిషికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తుంది? అని ఊహిస్తే కొంత ఆందోళన కలగకమానదు’’ అని అంటున్నారు కృత్రిమ మేధ, బిగ్డేటా, బిజినెస్ ఎనలిటిక్స్ నిపుణుడు, అమెరికా డెట్రాయిట్లోని వేన్ స్టేట్ యూనివర్సిటీ ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ అధిపతి ఆచార్య రత్నబాబు చిన్నం. సాఫ్ట్వేర్ రంగంలోని కిందిస్థాయి ఉద్యోగుల పనులను సమీప భవిష్యత్తులో చాట్ జీపీటీ లాంటివే చేస్తాయని స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్కు వచ్చిన రత్నబాబు చిన్నం కృత్రిమ మేధ(ఏఐ), సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు, అమెరికా విద్య తదితర అంశాలపై ‘ఈనాడు’తో ముఖాముఖి మాట్లాడారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సులో చేరుతున్నారు? వీరికి భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేలాది మంది సీఎస్ఈ చదువుతున్నారు. వారిలో చాలా మంది అమెరికా విద్యకు వస్తున్నారు. అయితే, వారిలో కంప్యూటర్ సైన్స్కు సంబంధించిన నైపుణ్యాలు ఉండటం లేదని గమనించా. ప్రస్తుతం చాట్ జీపీటీ కొన్ని రకాల సాఫ్ట్వేర్ కోడ్లను సీఎస్ఈ విద్యార్థుల కంటే బాగా రాస్తోంది. నా కూతురు కూడా కంప్యూటర్ సైన్స్ చదివి ఓ స్టార్టప్ కంపెనీలో పనిచేస్తోంది. వచ్చే 10-15 సంవత్సరాల్లో ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన నాలోనూ ఉంది. చాట్ జీపీటీ పనితీరు ప్రారంభంలోనే మనుషుల కంటే బాగా ఉంది. అందువల్ల మరో 10 సంవత్సరాల్లో కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసే వారిలో 80 శాతం ఉద్యోగాలు ఉండవని నా అంచనా. కిందిస్థాయి ఉద్యోగుల పనులను చాట్ జీపీటీ వంటి టూల్సే చేస్తాయి. విద్యార్థులు సీఎస్ఈ చేయాలనుకుంటే ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలి. కృత్రిమ మేధ చేయలేని పనులూ చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచీలకు కూడా ప్రాధాన్యమివ్వాలి.
కృత్రిమ మేధతో లాభాలు లేవంటారా?
ఏఐతో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. వైద్యులు ఎక్స్రే, ఎంఆర్ఐ నివేదికను విశ్లేషించి చెప్పే దాని కంటే ఎంతో వేగంగా ఏఐ చెప్పగలదని గూగుల్ ప్రకటించింది. దాని వల్ల రేడియాలజీ నిపుణుల కొలువులపై ప్రభావం ఉంటుంది. సాధారణంగా పుట్టిన వారం రోజులలోపు శిశువుల మెదడు స్పష్టంగా ఉండదు. వారి మెదడులో ఉన్న సమస్యలను ఏఐ ద్వారా గుర్తించవచ్చు. పిల్లలు సరిగా చదువుతున్నారా? లేదా? అని కూడా విశ్లేషిస్తుంది. డ్రైవర్ రహిత కార్లు వస్తున్నందున భవిష్యత్తులో డ్రైవర్ కొలువులు పోయే ప్రమాదముంటుంది. ఇంకెన్ని రంగాలపై దుష్ఫలితాలు ఉంటాయో ఇప్పుడే చెప్పలేం.
ఏఐతో కలిగే అనర్థాల నివారణకు ప్రభుత్వం ఏం చేయాలి?
ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఏం జరుగుతోందో నిపుణులతో భారత్ ఓ కమిటీ వేసి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. గూగుల్ ఏఐ విభాగం అధిపతిగా ఉన్న జెఫ్రీ హింటన్ కూడా ఏఐను తాను తక్కువ అంచనా వేశానని, ఇంకా ముందుకు వెళితే ఎన్నో అనర్థాలు వస్తాయని ప్రపంచాన్ని హెచ్చరిస్తూ ఇటీవలే ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఏఐను ఎంత వరకు, ఎక్కడ, ఎలా వాడుకోవాలి? దానివల్ల తలెత్తే అనర్థాల నివారణకు ఏం చేయాలి? అని విధానపర నిర్ణయాలు తీసుకోవాలి. ఏఐను శాపంగా భావించకుండా దాన్ని ఓ వరంలా మార్చుకోవాలి. ఉదాహరణకు వైద్య రంగంలో దీని ద్వారా జబ్బులను ముందుగానే గుర్తించవచ్చు.
భవిష్యత్తులో టెక్నాలజీ ఎలా మార్పు చెందనుంది?
వచ్చే పదేళ్లలో సాంకేతికపరంగా ఇంకెన్ని మార్పులు వస్తాయో స్పష్టంగా చెప్పలేం. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా.. 2030 నాటికి టెక్నాలజీ స్వరూపం ఎలా ఉండనుందో తనకూ తెలియదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
భారత్, అమెరికా విద్యావిధానం మధ్య వ్యత్యాసం ఏమిటి?
అమెరికాలోని చాలా వర్సిటీలు తమ సిలబస్ను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయి. ఇక్కడ అది లోపించింది. కాకపోతే ఇక్కడి ఐఐటీల వంటి అటానమస్ విద్యాసంస్థల్లో ఆ స్వేచ్ఛ ఉంది. థియరీ కాకుండా రియల్ టైమ్ ప్రాజెక్టులు చేయాలి. అడ్వాన్స్డ్ సిలబస్, బోధన ఉండాలి.
దిగ్గజ కంపెనీలతో కలిసి పరిశోధనలు
గుంటూరుకు చెందిన రత్నబాబు మణిపాల్ విశ్వవిద్యాలయంలో బీటెక్ చదివి అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్, పీహెచ్డీ చేశారు. 1989 నుంచి అమెరికాలో ఉంటున్న ఆయన ఫోర్డ్ మోటార్ కంపెనీ, ఇంటెల్, జనరల్ డైనమిక్స్ లాంటి ఎన్నో కంపెనీలతో కలిసి పరిశోధనలలో పాల్గొంటున్నారు. వేన్ వర్సిటీలో సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఎక్స్లెన్స్ అండ్ ఏఐ, బిగ్డేటా, బిజినెస్ ఎనలిటిక్స్కు వ్యవస్థాపక డైరెక్టరుగానూ వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల